Budget 2023: బడ్జెట్పై ప్రైవేటు రంగ ఉద్యోగుల ఆశలు..!
ఈ సారి దేశ ఆర్థిక పరిస్థితులు చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు శ్లాబ్లను పెంచే సూచనలు ఇప్పటి వరకు స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఎన్పీఎస్లో రాయితీలతో కేంద్రం ఉద్యోగులకు ఊరట కలిగిస్తుందనే ఆశలు ఉన్నాయి.
ఇంటర్నెట్డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఈ సారి ‘జాతీయ పింఛను పథకాని (NPS)’కి సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు రంగంలో పింఛను చందాదారులకు కొంత ఊరటనిచ్చే కబురును ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈ బడ్జెట్ (Budget 2023)లో ప్రకటించే అవకాశం ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఆదాయపన్ను శ్లాబులను మార్చే అవకాశాలు తక్కువ. ఈ క్రమంలో ఏదో ఒక రూపంలో వేతన జీవులకు మేలునందించి బుజ్జగించడానికి అవకాశం ఎక్కువగా ఉన్న మార్గాల్లో జాతీయ పింఛన్పై ఇచ్చే పన్ను మినహాయింపు ఒకటి.
2022 బడ్జెట్కు ముందు బేసిక్+డీఏ పై యజమాని ఇచ్చే ఎన్పీఎస్ చందా 14శాతం వరకు ఉన్నా.. సెక్షన్ 80సీసీడీ(2) కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ మేరకు పన్ను రాయితీ లభించేది. రాష్ట్ర, ప్రైవేటు రంగాల్లోని వారికి 10శాతం వరకే ఉండేది. కానీ, కిందటి బడ్జెట్లో దీనిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేస్తూ సవరణలు చేశారు. ప్రైవేటు రంగ ఉద్యోగులు మినహాయింపు పరిధి మాత్రం ఇంకా 10శాతం మాత్రమే ఉంది. పింఛను స్కీం విషయంలో ప్రభుత్వ-ప్రైవేటు రంగ ఉద్యోగుల పన్ను రేట్ల మధ్య తేడాలు పెరిగిపోయాయి. దీంతో వారు జాతీయ పింఛను పథకంపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో వారిని జాతీయ పింఛను పథకంలో భాగస్వాములను చేయాలంటే మార్పులు తప్పనిసరి. ప్రభుత్వం పింఛను చందా మినహాయింపును 14 శాతానికి పెంచి వారిని సామాజిక భద్రతలో భాగస్వామిని చేసే అవకాశం లభిస్తుంది. మరోవైపు ఎన్పీఎస్కు చందారూపంలో లభించే సొమ్ము వివిధ పెట్టుబడి మర్గాలకు మళ్లిస్తారు. అంటే ఈ చందా పెరిగితే దేశంలో పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధులు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది.
అసలు ఏమిటీ ఎన్పీఎస్..?
2004లో కేంద్ర ప్రభుత్వం ‘ది నేషనల్ పెన్షన్ సిస్టమ్’(ఎన్పీఎస్)ను స్వచ్ఛందంగా ప్రవేశపెట్టింది. దీనిని ‘ది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరి అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రిస్తుంది. తొలుత దీనిని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తర్వాత దీనిని ప్రైవేటు ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు. భారత జాతీయులు, ఎన్ఆర్ఐ హోదా ఉన్న 18-70 ఏళ్ల లోపువారు దీనిలో చేరడానికి అర్హులు. ఉద్యోగి తరఫున జీతం నుంచి యజమానే దీనికి చెల్లింపులు చేయవచ్చు.
ఈ పథకానికి చందా చెల్లింపులపై ఉద్యోగి పన్ను మినహాయింపులు పొందవచ్చు. 1961 ఆదాయపుపన్ను చట్టం సెక్షన్ 80సీసీడీ(1)కింద ఈ చెల్లింపులపై మినహాయింపులు పొందవచ్చు. తొలుత ఈ మినహాయింపుల పరిధి బేసిక్+డీఏ పై 10శాతానికే పరిమితమైంది. ఇది రూ.1.5 లక్షల లోపే ఉండాలి. A అనే ఒక వ్యక్తి జీతం రూ.5,00,000 అనుకుందాం. అతడు రూ.50,000 పై 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందగలడు. ఇక్కడ మరో విషయం అతడు పింఛన్ ఫండ్స్లో పెట్టే మొత్తాలన్ని కలిపి రూ. 1.5 లక్షలపై మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే సదరు వ్యక్తి జీవిత బీమా సంస్థలు ఆఫర్ చేసే ఇతర పింఛన్ పథకాల్లో పెట్టుబడులు, జాతీయ పింఛను పథకం పెట్టుబడులు కలిపి అన్నమాట. A రూ.50వేలు చెల్లించి ఎన్పీఎస్లో చేరిన తర్వాత కూడా మరో రూ.లక్ష మినహాయింపు పొందే అవకాశం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అతడు ఇతర పింఛను పథకాలకు కూడా చందాలు చెల్లించవచ్చు.
యజమాని చెల్లించే ఎన్పీఎస్ వాటాపై తొలుత ఉద్యోగి జీతం నుంచే పన్ను వసూలు చేస్తారు. కానీ, దీనిని తర్వాత సెక్షన్ 80సీసీడీ(2) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ, ఇది ప్రైవేటు ఉద్యోగి బేసిక్+డీఏలో 10శాతం లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14శాతం వరకు అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!