కలవరపెడుతున్న కడెం
సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ప్రమాదపుటంచుకు చేరుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరురోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. ఎగువన ఉన్న బోథ్ ప్రాంతం నుంచి మంగళవారం....
భారీగా ప్రవాహం.. ప్రమాదపుటంచున జలాశయం
ఈటీవీ- ఆదిలాబాద్
కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఉరకలేస్తున్న నీరు
సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ప్రమాదపుటంచుకు చేరుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆరురోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. ఎగువన ఉన్న బోథ్ ప్రాంతం నుంచి మంగళవారం సాయంత్రం నుంచి భారీగా వరదరావడంతో అర్ధరాత్రికి కడెం జలాశయం నీటిసామర్థ్యం 700 అడుగులకు చేరుకుంది. అప్రమత్తమైన యంత్రాంగం రాత్రికి రాత్రే ప్రమాదపు సైరన్ మోగించింది. పక్కనే ఉన్న పాత కడెం గ్రామాన్ని ఖాళీ చేయించింది. జలాశయం దిగువన ఉన్న కన్నాపూర్, కొందుకూరు, పాండవాపూర్, అంబారీపేట, బెల్లాల్, మున్యాల, రాంపూర్, బూత్కూరు,దేవునిగూడెం, గొడిసిర్యాల్ గ్రామాల ప్రజలను ఆగమేఘాలపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉద్ధృతి మరింత పెరగడంతో ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో 17గేట్లను ఎత్తివేయగా, సాంకేతిక లోపం కారణంగా మరో గేటు తెరుచుకోలేదు. వాస్తవంగా కడెం ప్రాజెక్టులోకి సెకనుకు 2.95లక్షల క్యూసెక్కుల వచ్చే నీటి సామర్థ్యాన్ని తట్టుకునే వెసలుబాటు ఉంది. కానీ రాత్రి దాదాపుగా 5 లక్షల క్యూసెక్కుల నీరురావడం, బయటకు వెళ్లే నీరు దాదాపుగా 3 లక్షల క్యూసెక్కులకే పరిమితం కావడంతో ప్రమాద భరితంగా మారింది. ఓ దశలో చేతులెత్తేసిన అధికారయంత్రాంగం ప్రకృతిపై ఆధారపడాల్సి వచ్చింది.
కడెం ప్రాజెక్టు నుంచి పరిశీలిస్తున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్
ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దీనిపై ఆరా తీశారు. నిర్మల్లో ఉన్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సహా ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ కడెం చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. 18వ గేటు పక్కన ఉన్న ప్రధాన కాలువకు బుంగపడటంతో భారీగా వరద బయటకు వెళుతోంది. కడెం జలాశయానికి బుధవారం సాయంత్రం మరోసారి వరద పోటెత్తింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతలో 3 లక్షల క్యూసెక్కులకు పడిపోయిన ఇన్ఫ్లో సాయంత్రం తరువాత క్రమంగా మళ్లీ పెరిగింది. దాదాపుగా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మరోసారి 5 లక్షల క్యూసెక్కులకు చేరుకోవడంతో జలాశయానికి కుడిపక్కన ఉన్న కట్టకు ఓ చోట బుంగపడింది. దాన్ని ఆనుకొని ఉన్న హరిత హోటల్, నివాసిత ప్రాంతం, రహదారిపై నుంచి కడెం ఊళ్లోకి సైతం వరద వచ్చింది. దాదాపుగా 120 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్వాసితులను కడెంలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ఐబీ, ఆసుపత్రికి తరలించి పునరావాసం కల్పించారు. సాగునీటి శాఖ ఎస్ఈ సుశీల్కుమార్, ఈఈ రాజశేఖర్, నిర్మల్ ఆర్డీవో తుకారాం, కడెం, దస్తూరాబాద్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రాత్రివరకు వరద ఉద్ధృతి మరింత పెరిగితే ప్రాజెక్టు మళ్లీ ప్రమాదపుటంచుకు చేరుకునే అవకాశం ఉందనే అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది.
నీట మునిగిన కడెం మండల కేంద్రం
కడెం చరిత్రలో మూడోసారి..
కడెం చరిత్రలో ఇలాంటి వరద రావడం ఇది మూడోసారి. కడెం జలాశయం తొలుత 9గేట్లతో నిర్మితమైంది. నిర్మించిన తర్వాత కొద్దికాలానికే 1959లో భారీగా వరదరావడంతో ఆనకట్టకు ముప్పువాటిల్లడంతో అప్పటి ప్రభుత్వం 1959లో 18 గేట్లతో పునర్ణిర్మాణ పనులను చేపట్టి 1962వరకు పూర్తిచేసింది. 1995లో మళ్లీ భారీగా వరద వచ్చింది. భారీగా వచ్చిన ఉద్ధృతి కారణంగా ప్రాజెక్టుకు ఇరువైపులా ఆనకట్ట కోతకు గురికావడంతో మరోసారి ప్రమాదం తప్పింది. తాజాగా వరదతో ప్రాజెక్టు నిర్వహణ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపుగా కడెం నుంచి మంచిర్యాల వరకు దాదాపుగా 60వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. కడెంలో సెకనుకు 2.85లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునే సామర్థ్యం ఉంటే తాజాగా 5లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండడంతో ప్రమాదానికి కారణమైందని అధికారులు తెలిపారు.
నిర్వహణే కీలకం..
గతానికంటే భిన్నంగా ఏడాది కిందట అన్ని ప్రాజెక్టుల నిర్వహణ కోసం రాష్ట్రప్రభుత్వం ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్(ఓఅండ్ఎం) విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఓ ఈఎన్సీ నేతృత్వంలో ఇద్దరు సీఈలు, ఎస్ఈలు, ఈఈ, డీఈ, జేఈలతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేసింది. దానికోసం కొంత బడ్జెట్ను సైతం కేటాయించింది దీని ప్రకారం వర్షాకాలం ఆరంభంకంటే ముందే ప్రాజెక్టు పనితీరు, గేట్ల నిర్వహణ, సాంకేతిక అంశాలు, వరద ఉప్పొంగితే దిగువన ఉత్పన్నమయ్యే అంశాలను ఆరాతీయాల్సి ఉంది. దానికనుగుణంగా ప్రాజెక్టులవారీగా మరమ్మతులు చేపట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం. వర్షాకాలంలోనైతే ప్రత్యేకంగా డీఈ, జేఈలతోపాటు అవసరమైతే అత్యవసర సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేయాల్సి ఉంది. కానీ కడెంలో తగినంత సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ అనుకున్నంత మేరకు జరగడంలేదు. తొలుత గేట్లను నిర్వహణ చేసినపుడు ఒక గేటును మరమ్మతులే చేయడం కుదరకపోవడంతో అది తెరుచుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిలాబాద్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని... -
పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు
[ 26-04-2024]
ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంతోపాటు రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
తనిఖీల్లో నగదు పట్టివేత
[ 26-04-2024]
ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.98,600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలి
[ 26-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ 138వ మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ పిలుపునిచ్చారు. -
26 నుంచి యోగా-ధ్యానం అంశాలపై తరగతులు
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు యోగా -ధ్యానం అంశాలపై ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు తిరుపతి రెడ్డి తెలిపారు. -
క్రీడా ప్రాంగణంలో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?