దేశీదారు.. తగ్గని జోరు
గుడుంబాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పలువురి వ్యాపారుల చూపు పెన్గంగ సరిహద్దు మహారాష్ట్రలో చౌక ధరకు లభ్యమయ్యే దేశీదారుపై పడింది. నది పరీవాహక గ్రామాలను అడ్డాగా చేసుకొని జిల్లాలో వ్యాపారులు దేశీదారు
మద్యం గొలుసు దుకాణాల్లో విక్రయాలు
జైనథ్, న్యూస్టుడే
గుడుంబాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పలువురి వ్యాపారుల చూపు పెన్గంగ సరిహద్దు మహారాష్ట్రలో చౌక ధరకు లభ్యమయ్యే దేశీదారుపై పడింది. నది పరీవాహక గ్రామాలను అడ్డాగా చేసుకొని జిల్లాలో వ్యాపారులు దేశీదారు విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ఆబ్కారీ శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాల్లోనే దేశీదారు విచ్చలవిడిగా అమ్ముతున్నారు.
జిల్లాలోని ఆయా గ్రామాల్లో వీడీసీల ఆధ్వర్యంలో గ్రామ జనాభాను బట్టి మద్యం గొలుసు దుకాణాలకు అనధికారికంగా టెండర్లు నిర్వహిస్తున్నారు. వ్యాపారులు ఈ దుకాణాల్లో దర్జాగా దేశీదారు అమ్మకాలు సైతం సాగిస్తున్నారు. జైనథ్ మండలంలోని గిమ్మ, పెండల్వాడ, కోర్ట, ఆకోలి, సాంగ్వి, భోరజ్, గూడ, సిర్సన్న, రాంపూర్, ఆనంద్పూర్, దీపాయిగూడ, కరంజి, బేల మండలంలోని సాంగిడి, బెదోడ, కొగ్దూర్, మాంగ్రూడ్, ఆదిలాబాద్ మండలం భీంసారి, తాంసి మండలంతో పాటు భీంపూర్ మండలంలోని కరంజి(బి), అర్లిటి, పిప్పల్కోటి, నిపాని, భీంపూర్, వడూర్, తలమడుగు మండలం లాల్గాడ, ఝరి, రుయ్యాడి తదితర గ్రామాల్లో వ్యాపారం నడిపిస్తున్నారు. గిమ్మ గ్రామంలోనైతే ఇళ్లలోనే వ్యాపారం సాగుతుండటం గమనార్హం.
లాభం ఎక్కువని..
తెలంగాణ మద్యం అమ్మితే లాభాలు అంతంత మాత్రమేనని, మహారాష్ట్రలోని చౌక మద్యం దేశీదారుని అమ్మకాలు సాగిస్తే లాభాలు ఎక్కువ వస్తాయని వ్యాపారులు ఈ దందాను ఎంచుకున్నారు. దేశీదారు ఒక్కో పెట్టె ధర రూ.3600 ఉంటుంది. ఒక్కో పెట్టెలో 48 సీసాలుంటాయి. ఒక్కో సీసా రూ.75 ఉండగా.. రూ.120 లకు విక్రయిస్తారు. ఈ మేరకు ఒక్కో పెట్టెకు రూ.5,760 వస్తాయి. ఖర్చులు పోను ఒక్కో పెట్టెకు రూ.1500 వరకు లాభం చేకూరుతుంది. ఆయా గ్రామాల్లో ఈ లెక్కన జిల్లాలో రోజుకి సుమారు 300 వరకు పెట్టెల చొప్పున అమ్మగా రూ.4.5 లక్షలు, నెలకు రూ.1.35 కోట్లు, ఏడాదికి రూ.16.20 కోట్లకు పై చిలుకు వ్యాపారం సాగుతోంది.
దేశీదారు అమ్మకాలు బాహాటంగా జరుగుతున్నా ఆబ్కారీ అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. ముందస్తు సమాచారమిస్తేనే పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. అధికారుల అండదండలతోనే వ్యాపారులు ఇష్టారీతిన అమ్మకాలు సాగిస్తున్నారని, అందుకే దాడులు నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పట్టించుకునే వారేరి?
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దున గల పెన్గంగ పరీవాహక ప్రాంతం మీదుగా.. నిత్యం జిల్లాలో దేశీదారు దందా యథేచ్ఛగా సాగుతోంది. పట్టించుకునే వారు కరవవడంతో మహారాష్ట్రలోని భోరి, పిప్పల్కోఠి,ఫఫ చనాఖా మీదుగా 44వ జాతీయ రహదారి, పెన్గంగలో పడవ ద్వారా జైనథ్ మండలంలోని నది పరీవాహక గ్రామాలకు, తాంసి మండలంలోని పలు గ్రామాలకు భోరజ్ చెక్పోస్టు దాటి ఆదిలాబాద్కు, మహారాష్ట్రలోని దుర్బ మీదుగా పాటన్ గ్రామం ఆపై బేల మండలానికి తరలిస్తున్నారు.
చట్టపరమైన చర్యలు : నరసింహారెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
దేశీదారు విక్రయాలు సాగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. దేశీదారు అమ్మకాలు జరిపితే తమకు సమాచారం అందించాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
28న ఆదివాసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
[ 26-04-2024]
ఆదివాసీ గిరిజనుల సమస్యలను చర్చించి, పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటంపై ఈనెల 28న సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. -
ఎస్డీడీజీడబ్ల్యూటీటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 26-04-2024]
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. -
పోచమ్మ తల్లికి ఎమ్మెల్యే దంపతుల పూజలు
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ కాలనీలో శుక్రవారం నూతన పోచమ్మ ఆలయంలో వేద పండితుల, వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. -
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిలాబాద్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని... -
పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు
[ 26-04-2024]
ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంతోపాటు రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
తనిఖీల్లో నగదు పట్టివేత
[ 26-04-2024]
ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.98,600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలి
[ 26-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ 138వ మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ పిలుపునిచ్చారు. -
26 నుంచి యోగా-ధ్యానం అంశాలపై తరగతులు
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు యోగా -ధ్యానం అంశాలపై ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు తిరుపతి రెడ్డి తెలిపారు. -
క్రీడా ప్రాంగణంలో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM