logo

ఎస్డీడీజీడబ్ల్యూటీటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు.

Published : 26 Apr 2024 16:49 IST

ఎదులాపురం: మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అనాథ, నిస్సహాయులైన జిల్లాకు చెందిన పదవ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మే 25వ తేదీలోపు అర్హులైన బాలికలు తమ దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఉన్న బాల రక్షక్ భవన్లో అందించాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని