బడుల పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్..!
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పర్యవేక్షించేందుకు జిల్లా అకడమిక్ టాస్క్ఫోర్స్ పేరిట ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
ఉపాధ్యాయుల అసంతృప్తి
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పర్యవేక్షించేందుకు జిల్లా అకడమిక్ టాస్క్ఫోర్స్ పేరిట ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్ (తొలిమెట్టు) కార్యక్రమ విజయవంతం, సక్రమ అమలు లక్ష్యంగా కమిటీ పనిచేయనుంది. అదే సమయంలో ఉపాధ్యాయులకు అవసరమైన సాంకేతిక సహాయం, తోడ్పాటును అందించనుంది. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కమిటీ సభ్యులెవరంటే..
జిల్లా విద్యాధికారి, డైట్ ప్రిన్సిపల్/బోధకుల్లో ఒకరు, జిల్లా నాణ్యత సమన్వయకర్త, మండల విద్యాధికారి, మండలస్థాయి రిసోర్స్ పర్సన్, క్లస్టర్ స్థాయి రిసోర్స్ పర్సన్, విద్యారంగంలో పనిచేస్తున్న ఏదైనా ఎన్జీఓ ప్రతినిధి ఒకరు.. ఇలా మొత్తం ఏడుగురు ఈ టాస్క్ఫోర్స్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
విధులిలా..
జిల్లా ప్రణాళికకు అనుగుణంగా నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ బడుల పనితీరును, ప్రగతిని అంచనా వేస్తారు. సామర్థ్యం , ఉపాధ్యాయుల బోధన నైపుణ్యం పెంపొందించడం, అభ్యసనకు అనుగుణంగా సామగ్రిని పంపిణీ చేయడం, పర్యవేక్షించడం వీరి పని. వంద శాతం ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించేలా అకాడమిక్ ప్రణాళికను అభివృద్ధి చేయడం, డైట్, ఎంఆర్సీ, సీఆర్సీల మధ్య సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు తగిన మద్దతు అందించడం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించేలా సలహాలు- సూచనలందించడం, పోషకులు- పాఠశాల కమిటీల్లో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించడం కమిటీ విధుల్లో భాగం.
ఏం చేస్తారంటే..
కమిటీ సభ్యులు క్రమం తప్పకుండా ఏదో ఒక పాఠశాలను సందర్శించడం, ఎంతమంది ఉపాధ్యాయులున్నారు, ఏ ఉపాధ్యాయుడిని పరిశీలించారు, ఏ విషయం బోధిస్తున్నారు, బోధన ఎలా సాగుతోంది, ఎన్ని తరగతులకు బోధిస్తున్నారు, ఒకటి కన్నా ఎక్కువ తరగతులుంటే ఆ సమయంలో మిగతా విద్యార్థులేం చేస్తున్నారు, ఎలాంటి టీఎల్ఎంలు వాడుతున్నారు, ప్రణాళికకు అనుగుణంగా అభ్యసన సాగుతుందా.. తదితర అంశాలను పరిశీలిస్తూ వాటి ఆధారంగా వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా పరిశీలన పత్రం రూపొందించారు.
ఏర్పాటుపై ఆందోళన..
బోధనను పర్యవేక్షించేందుకు కొత్తగా టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడంపై ఉపాధ్యాయవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఇది ఎస్జీటీలపై ఒత్తిడి పెంచే నిర్ణయమని వారు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఉపాధ్యాయులను దోషులుగా చిత్రించే పరిస్థితి కల్పిస్తున్నారని, దానిని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరించకుండా పర్యవేక్షణ ఎలా..?
- జుట్టు గజేందర్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్లేవు. పూర్తిస్థాయిలో బోధకుల్లేరు. ఇలాంటి పరిస్థితుల్లో టాస్క్ఫోర్స్ పేరిట ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేయడం సరికాదు. ఇప్పటికే తొలిమెట్టు అమలులో భాగంగా సముదాయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉన్నతాధికారులు, పాలనాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడం విడ్డూరం. పాఠశాలలకు రావాల్సిన నిధులు సక్రమంగా రావడం లేదు. ఈ స్థితిలో టీఎల్ఎం (బోధనాభ్యసన సామగ్రి) తయారు చేయాలని ఒత్తిడి పెంచడం దారుణం. కార్యక్రమ ఉద్దేశం మంచిదే అయినా, వనరులను కల్పించి స్నేహపూర్వక వాతావరణంలో అమలయ్యేలా చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిలాబాద్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని... -
పట్టణంలో పోలీసుల విస్తృత తనిఖీలు
[ 26-04-2024]
ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంతోపాటు రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
తనిఖీల్లో నగదు పట్టివేత
[ 26-04-2024]
ఎన్నికల నేపథ్యంలో తనిఖీల్లో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.98,600 నగదును మావల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలి
[ 26-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ 138వ మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ పిలుపునిచ్చారు. -
26 నుంచి యోగా-ధ్యానం అంశాలపై తరగతులు
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని పతంజలి యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు యోగా -ధ్యానం అంశాలపై ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు తిరుపతి రెడ్డి తెలిపారు. -
క్రీడా ప్రాంగణంలో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
దూసుకెళ్తున్న వినియోగం.. షెడ్డుకొస్తున్న నియంత్రికలు
[ 26-04-2024]
జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరు బావుల్లో నీరు బాగా లోతుకు వెళుతుండటంతో దాని ప్రభావం నియంత్రికలపై పడి కాలిపోతున్నాయి. -
రెఫరీగా మారి.. ప్రచారం చేసి!
[ 26-04-2024]
సిరికొండ మండలం వాయిపేట్, రాజన్పేట్, చెమ్మన్గూడ తదితర గ్రామాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గురువారం ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. -
సివిల్స్ ర్యాంకర్కు గవర్నర్ సన్మానం
[ 26-04-2024]
ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 790 ర్యాంకు సాధించిన రేకులవార్ శుభంతో పాటు వారి తల్లిదండ్రులు జీవిత, సత్యనారాయణలను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ సన్మానించారు. -
పేదలకు అండగా.. గిరిజన క్యాంటిన్
[ 26-04-2024]
టీ తాగాలన్నా కనీసం రూ.6 వెచ్చించాల్సిందే. అలాంటి పరిస్థితిలో కేవలం రూ.5 లకే అందిస్తున్న భోజనం ఉట్నూరువాసుల కడుపు నింపుతోంది. ఏజెన్సీలోని ఆదిమ గిరిజనుల(పీవీటీజీ)ను ఆదుకునేందుకు ఐటీడీఏ అధికారులు పలు పథకాలను ప్రవేశపెడుతున్నారు. -
రిమ్స్ సంచాలకుడిని బ్లాక్మెయిల్ చేసే యత్నం
[ 26-04-2024]
తాను స్పెషల్ బ్రాంచీ పోలీసునని చెప్పి రిమ్స్ సంచాలకుడు రాఠోడ్ జైసింÞ్ను, గజానంద్ ఆసుపత్రి వైద్యుడు అభిజిత్ నుగుర్వార్ను బ్లాక్ మెయిల్ చేసే యత్నం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
వివాహితపై హెడ్కానిస్టేబుల్ లైంగిక వేధింపులు
[ 26-04-2024]
శాంతి, భద్రతలు కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన హెడ్ కానిస్టేబుల్ మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగు చూసింది. -
జేఈఈ మెయిన్స్లో గిరిజన విద్యార్థిని ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉట్నూరు మండలం జైత్రంతండాకు చెందిన గిరిజన విద్యార్థిని చౌహాన్ మేఘన ప్రతిభ కనబర్చి పలువురి మన్ననలు అందుకున్నారు. -
గొలుసుకట్టు వ్యాపారంలో ‘బంపర్ ఆఫర్’
[ 26-04-2024]
అమాయకులను నిండా ముంచిన గొలుసుకట్టు వ్యాపారంలో కంపెనీ ఏజెంట్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిపాజిట్దారులకు తిరిగి సొమ్మును చెల్లించే క్రమంలో హైదరాబాద్ నగరశివారులో ఉన్న భూమిని ప్రధాన ఏజెంట్లకు విక్రయించాలని యోచిస్తోంది. -
ఆశీర్వదించండి.. ఎంపీగా గెలిపించండి
[ 26-04-2024]
గోడం నగేష్ను ఆశీర్వదించి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్, యువ నాయకుడు రితీష్ రాఠోడ్లతో కలిసి ఉట్నూరు మండలం పులిమడుగు, సాలెవాడ, కోపర్ఘడ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు భవిష్యత్తు
[ 26-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని ఖానాపూర్, కొలీపుర, బొక్కలగూడ, అంబేడ్కర్నగర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. -
తుక్కు పేరిట అక్రమ దందా!
[ 26-04-2024]
అనుమతులు, లైసెన్సులు లేకుండానే పలువురు ‘తుక్కు’ పేరిట జిల్లాలో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారుల సమీపంలోని పెద్ద ప్రహరీలతో కూడిన గోదాములను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. -
నాలుగు గంటల వరకే పోలింగ్
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన కుమురంభీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి-కోర్తేగూడ గ్రామాల మధ్య గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
చెట్టు పేరు చెప్పి.. ప్లాట్లు అంటగట్టి..
[ 26-04-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమ్మకానికి ఖాళీ స్థలాలు లేకపోవడంతో భూఅక్రమ వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లోని వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లుగా మార్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
వెల్లువెత్తిన నామినేషన్లు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామపత్రాల స్వీకరణ పర్వం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ నామపత్రాలు స్వీకరించారు. -
దారి మళ్లించి.. మురుగుకాలువ ఆక్రమించి
[ 26-04-2024]
కబ్జాల తీరు కొంత పుంతలు తొక్కుతోంది. కబ్జాదారులకు హద్దూఅదుపులు లేకుండా పోతుండడంతో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలో మురుగుకాలువలను కబ్జా చేస్తున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తుంది. -
సన్న బియ్యం ధరలు పైపైకి
[ 26-04-2024]
బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు రోజురోజుకి సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు సన్నబియ్యం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
[ 26-04-2024]
మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నేరస్థుడికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. జిల్లా న్యాయస్థానాల సమన్వయాధికారి సక్రియానాయక్ తెలిపిన వివరాలిలా.. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తూర్పున ఉత్సాహం.. పశ్చిమాన నైరాశ్యం
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార శైలి భిన్నంగా సాగుతోంది. తూర్పున పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో ప్రచారం ఉత్సాహంగా సాగుతుంటే పశ్చిమాన ఆదిలాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్లో మందకొడిగా కొనసాగుతోంది. -
ఇక లెక్క పక్కా!
[ 26-04-2024]
హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్