మూగజీవాల ఉసురు తీస్తున్నారు..
జిల్లాలో మూడు మండలాల గుండా నిశిరాత్రిలో సాగే ఈ అక్రమ దందాలో దారి పొడవునా దళారులు డబ్బులు ఇచ్చుకుంటూ తమ పనికి అడ్డురాకుండా జాగ్రత్త పడుతున్నారు.
యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా
ఈనాడు డిజిటల్, ఆసిఫాబాద్
గోయగాంలో తరలించడానికి సిద్ధంగా పశువులు
జిల్లాలో మూడు మండలాల గుండా నిశిరాత్రిలో సాగే ఈ అక్రమ దందాలో దారి పొడవునా దళారులు డబ్బులు ఇచ్చుకుంటూ తమ పనికి అడ్డురాకుండా జాగ్రత్త పడుతున్నారు. అర్ధరాత్రి 12 తర్వాత ప్రారంభమయ్యే ఈ అక్రమ తరలింపు తెల్లవారుజాము వరకు హైదరాబాద్కు చేరుకోవడంతో ముగుస్తుంది.
జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా మూగజీవాలను వాహనాల్లో కుక్కి వాటి ప్రాణాలు తీస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా పశువులను తరలించాలంటే సంతలో కొనుగోలు చేసిన ధ్రువపత్రం ఉండాలి. పశు వైద్యుల ధ్రువీకరణతో పాటు ఒక్కో వాహనంలో ఆరు మాత్రమే తీసుకెళ్లాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు.
లంపీస్కిన్ వ్యాధి ప్రబలుతున్న తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి పశువుల రవాణా పూర్తిగా నిషేధించారు. కానీ ఇక్కడ నుంచి నిత్యం పదుల సంఖ్యలో వాహనాల్లో పశువులను కుక్కి తరలిస్తున్నారు. ఆర్టీఏ అధికారులు, ఇటు పోలీసులు ఒక్క వాహనాన్ని పట్టుకున్న దాఖలాలు లేవు. రహదారి పక్కనే పోలీస్స్టేషన్లు ఉన్నా, వాంకిడిలో చెక్పోస్టు ఉన్నా ఈ అక్రమ తరలింపునకు అడ్డుకట్ట పడటం లేదు.
పాత రసీదులతో తరలింపు..
వాంకిడి మండలంలో గణేశ్పూర్, గోయగాంలో ప్రతి మంగళవారం పశువుల సంత నిర్వహించేవారు. ఇప్పుడు సంత జరగకున్నా నిత్యం ఇక్కడకు వేరే రాష్ట్రాల నుంచి పశువులను తెచ్చి పాత తేదీలతో సంతలకు సంబంధించి రసీదులు చింపి జీవాలను తీసుకెళ్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ రెండు గ్రామాల్లో పశువుల తరలించే మాఫియాగా ఏర్పడ్డారు. ఏకంగా గ్రామం అవతల మరో కొత్త గ్రామాన్నే సృష్టించారు. ఈ రెండు గ్రామాల్లో 30 వరకు మూగజీవాలను తరలించే ప్రత్యేక వాహనాలు ఉన్నాయంటే తరలింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూర్(టి) మండలాల నుంచి కాగజ్నగర్ క్రాస్రోడ్డు మీదుగా పశువుల అక్రమ రవాణా సాగుతోంది.
నిత్యం 15 నుంచి 20 వాహనాలు..
మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలోని పల్లె ప్రాంతాల నుంచి ఆవులు తెస్తున్న వ్యక్తులు గోయగాంలో ఉంచుతారు. ఒక్కో వాహనంలో 30 నుంచి 40 వరకు వీటిని ఉంచి తీసుకెళుతారు. ‘మార్గమధ్యలో ఉన్న వ్యక్తులకు, కొందరు అధికారులకు, ప్రతినెలా రూ.60 నుంచి రూ.లక్ష వరకు మామూళ్లు ఇస్తుంటాం, ఒక్కో వాహనానికి అన్ని ఖర్చులు పోను రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు మిగులుతాయని’’ ఈ వృత్తి మానేసిన అదే గ్రామానికి చెందిన వ్యక్తి చెబుతున్నారు. అంటే సగటున ఒక్కరోజుకు పది వాహనాల్లో పశువులు తీసుకెళ్లినా రూ.10 లక్షలు, నెలకు సుమారు రూ.3 కోట్ల దందా నడుస్తోంది.
చెక్పోస్టులు తీసేశారు?
ఈ తరలింపు తంతును అడ్డుకోవడానికి వాంకిడి మండలంలో బుదల్ఘాట్ వాగు వద్ద, సిర్పూర్(టి) మండల కేంద్రం, వెంకట్రావ్పేట్ వద్ద పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఏమైందో, ఎవరు ఒత్తిడి చేశారో తెలియదు గాని ఆరు నెలల క్రితమే వాటిని తొలగించారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ అక్రమ వ్యవహారాలను అడ్డుకుని, మూగజీవాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
* ఇతర రాష్ట్రాల నుంచి ఆవులను కారుచౌకగా తీసుకొస్తారు. వాటిని గ్రామ శివారు ప్రాంతంలో కట్టేస్తారు. మేత, తాగునీరు ఏదీ ఉండదు. అదను చూసుకుని అర్ధరాత్రి వ్యాన్లో 30-40 మూగజీవాలను ఒకేసారి ఎక్కిస్తారు. ఆవు తల పైకి ఉండి, గాలి తీసుకునేలా వాహనంలో స్థలం ఉంటుంది. వాహన వేగానికి కుదుపులకు చనిపోయిన వాటిని రహదారి పక్కనే పడేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుంది
[ 07-05-2024]
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా నాయకులు సంతోష్, నారాయణ అన్నారు. -
అతివేగం.. బతుకులు ఆగం..
[ 07-05-2024]
చిన్నపాటి నిర్లక్ష్యం.. త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆతృతతో అత్యంత వేగంగా, మద్యం తాగి వాహనాలను నడపడంతోనే ప్రమాదాలు చోటుచేసుకొని విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. -
రైతుల పేరు... దళారుల జోరు
[ 07-05-2024]
అన్నదాతలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేస్తుంటే ఇదే అదనుగా దళారులు రైతుల పేరున విక్రయించి అక్రమాలకు పాల్పడుతున్నారు. -
రెడ్ అలర్ట్
[ 07-05-2024]
వేసవి భగభగలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటలేదు. -
అమ్మా.. నేనేమీ చేశాను పాపం..
[ 07-05-2024]
అమ్మా... ఎన్నో కష్టాలకోర్చి నవ మాసాలు మోశావు.. ఎందుకమ్మా నా ప్రాణాలు తీయాలని చూశావు.. అమ్మ పాలు అమృతంలా ఉంటాయని అంటారు.. అలాంటి పాల వాసన కూడా చూపించలేక పోయావు.. -
మండుటెండల్లో.. పండుటాకుల గోస!
[ 07-05-2024]
ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది. -
తునికాకు సేకరణకు సన్నాహాలు
[ 07-05-2024]
ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని గిరివెల్లి-ఏ, గిరివెల్లి, కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని బెజ్జూరు, సలుగుపల్లి, గూడెం, కర్జెల్లి, చీలపెల్లి, ముత్తంపేట, కొత్తపేట, అనుకోడ, పెంచికల్పేట, లోనవెల్లి, కడంబ, బొంబాయిగూడ, డబ్బా యూనిట్లకు ఇటీవల ఆన్లైన్ టెండర్లు నిర్వహించారు. -
తప్పు వారిది.. శిక్ష వీరికి!
[ 07-05-2024]
జాతీయ అర్హత పరీక్ష (నీట్) ప్రశ్నపత్రాల తారుమారు వ్యవహారంలో ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. -
ఓటు వేయం.. ఎన్నికలు బహిష్కరిస్తాం
[ 07-05-2024]
తమ గ్రామానికి రహదారి, కనీస మౌలిక సదుపాయాలు లేవని, ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తామని తిర్యాణి మండలం గోవెనకు చెందిన గ్రామస్థులు పేర్కొన్నారు. -
వస్తామంటున్న నేతలు.. వద్దంటున్న శ్రేణులు
[ 07-05-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో రాజకీయ పరిస్థితులు చిత్ర, విచిత్రంగా మారుతున్నాయి. -
లారీల కొరత.. అన్నదాతకు వెత
[ 07-05-2024]
కొనుగోలు కేంద్రాలనుంచి వెంటవెంట ధాన్యం తరలించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
జిల్లా.. వైద్య రంగాలకు ప్రాధాన్యం
[ 07-05-2024]
‘‘మొన్నటి వరకు నేనో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని. నా విధుల నిర్వహణ తరగతి కేంద్రంగా సాగేది. -
సీఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త
[ 07-05-2024]
సీˆఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని భారాస పెద్దపల్లి ఎంపీˆ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
తరుణీ శరణం..!
[ 07-05-2024]
పల్లె.. పట్టణం తేడా లేకుండా అన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. -
శేఖర్ మాస్టర్ మెచ్చిన.. డీజే శేఖర్
[ 07-05-2024]
శేఖర్ మాస్టర్ సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని వ్యక్తి. నృత్య దర్శకత్వంతో పాటు ఈటీవీ నిర్వహించే ‘ఢీ’ ప్రోగ్రాం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. -
ఏడేళ్లుగా తీరని వెతలు!
[ 07-05-2024]
భైంసా మండలం గుండేగాం వాసుల పునరావాసం మాట అరణ్య రోదనే అవుతోంది. -
ఎన్నికల ప్రక్రియ ముమ్మరం
[ 07-05-2024]
జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్యాయత్నం
[ 07-05-2024]
ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
[ 07-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
వాహనం మంచిర్యాలలో.. టోల్ మధ్యప్రదేశ్లో..
[ 07-05-2024]
ఆధునికతో సమయం ఆదా, పనులు సులువుగా అవుతుండటంతో పాటు అప్పుడప్పుడు సమస్యలు కూడా ఎదురవుతాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
[ 07-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!