logo

శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు

శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈనెల 17న జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో  శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్ర నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు రాళ్లబండి మహేందర్ తెలిపారు.

Published : 15 Apr 2024 12:16 IST

ఎదులాపురం : శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈనెల 17న జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో  శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్ర నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు రాళ్లబండి మహేందర్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో శోభాయాత్రకు సంబంధించిన  వివరాలను వెల్లడించారు. ఈనెల 17న పట్టణంలోని రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుంచి సాయంత్రం 5 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని