నిధుల ప్రవాహం.. తీరాలి దాహం
చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు.
బల్దియాలకు రూ. 92.90 లక్షలు మంజూరు
చెన్నూరు పట్టణంలోని ఒడ్డెపల్లి కాలనీలో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా
చెన్నూరు పట్టణంలోని శివారు కాలనీల్లో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటికోసం నిధులు అందుబాటులో ఉండటంతో ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు.
చెన్నూరు, న్యూస్టుడే: ఈసారి ఎండాకాలం ప్రారంభంలోనే జలాశయాలు అడుగంటాయి. నాలుగేళ్లుగా నీటి కొరత లేకుండా నిల్వలు ఉండగా.. ఈసారి దానికి భిన్నంగా ఉండటం, భూగర్భ జలాలు పడిపోతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి తీవ్రత తీవ్రంగా ఉండటంతో పట్టణాల్లో తాగునీటి అవసరాలు మరింత పెరిగాయి. ఇళ్లలో ఉన్న బోరుబావులు ఎండిపోతుండటంతో తాగడానికి, ఇతర అవసరాలకు కుళాయి నీటిపైనే ఆధారపడుతున్నారు. శుద్ధి జలం సక్రమంగా అందకపోవడంతో సరఫరా సమయాల్లో మార్పులు వచ్చాయి. సరఫరాల్లో సమస్యలు రాకుండా ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళిక-2024 కింద నిధులు మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడు పురపాలక సంఘాలకు రూ.92.90 లక్షల నిధులు కేటాయించింది.
ప్రత్యామ్నాయ చర్యలకు..
పట్టణాల్లో రానున్న మూడు నెలల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. బావులు, చెరువులు, జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పట్టణాల్లో రోజూ నీటి సరఫరా చేయాల్సి ఉండగా వివిధ జలాశయాల్లో నీటిమట్టం తగ్గిపోతుండటం, వాటర్ పంపింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో కొద్దిరోజులుగా రోజువిడిచి రోజు నల్లా నీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. జలాశయాల నుంచి నీటిని పంపింగ్ చేసుకునేందుకు బూస్టర్ పంపుల సామర్థ్యం పెంచుకునేందుకు చర్యలు తీసుకున్నారు. 160 కేవీఏ విద్యుత్తు నియంత్రికలను 220 కేవీఏకి మార్చుకోవడం, అవసరమున్న చోట అదనంగా మోటార్లను ఏర్పాటు చేసేందుకు పలు మున్సిపాలిటీల్లో ప్రణాళికలు రూపొందించారు.
వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యలు గుర్తించేందుకు అధికారులు ఇలా ఇంటింటికీ తిరుగుతూ పరిశీలిస్తున్నారు.
తాగునీటి అవసరాలకు వినియోగం
తాగునీటి అవసరాలు తీర్చేందుకు పురపాలికలు పంపించిన ప్రణాళికల ఆధారంగా నిధులు మంజూరు చేశారు. శివారు ప్రాంతాల్లో పైపులైన్లు లేని కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, శుద్ధి కేంద్రాలు, పంపింగ్ చేసే చోట పంపులు, మోటార్లు, చేతిపంపులు, పవర్బోర్లను మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుంది. పైపులైన్ల లీకేజీలు తొలగించడం, వాల్వులు బాగు చేసుకోవడానికి ఈ నిధులు వినియోగించే వీలుంది.
మరమ్మతులు చేపడుతున్నాం
గంగాధర్, పురపాలిక కమిషనర్, చెన్నూరు
పట్టణంలో తాగునీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. లీకేజీలను గుర్తించి తక్షణం వాటి మరమ్మతులు చేపడుతున్నాం. శివారు కాలనీల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడితే అందుబాటులో ఉన్న ట్యాంకర్లతో ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్నాం. పురపాలికకు వేసవి కార్యాచరణ ప్రణాళిక కింద నిధులు మంజూరైనందున ఇక సమస్య ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైండోవర్ ఉల్లంఘన కేసుల్లో తాఖీదులు
[ 30-04-2024]
బైండోవర్ ఉల్లంఘన కేసుల్లో నిందితులు రూ.ఒక లక్ష చొప్పున చెల్లించాలని మావల తహసీల్దార్ తాఖీదులు జారీ చేశారు. -
పదవి విరమణ పొందిన ఎస్ఐకి ఘన సన్మానం
[ 30-04-2024]
అదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందిన జీవీ రమణారెడ్డి, అతని సతీమణి విజయలను ఎస్పీ గౌష్ ఆలం పోలీస్ ముఖ్య కార్యాలయంలో శాలువాలు కప్పి, మిఠాయిలు తినిపించి, బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. -
కరాటే బెల్టులు అందజేత
[ 30-04-2024]
జిల్లా కేంద్రం తిలక్ నగర్లోని అరుణోదయ పాఠశాలలో మంగళవారం బాల, బాలికలకు కరాటేలో గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. -
జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు
[ 30-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షట్కర్ భారీ మెజారటీ తో గెలవబోతున్నారని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
[ 30-04-2024]
ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన కే.ప్రభాకర్ రావును జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పరల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావు
[ 30-04-2024]
అదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ప్రభాకర్ రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. -
లాండ్రీకి తీరిన నీటి సమస్య
[ 30-04-2024]
రిమ్స్లో నిర్వహిస్తున్న ల్యాండ్రీకి నేడు సమస్య పరిష్కారమైంది. -
సాహిత్య సదస్సుపై దాడి ముమ్మాటికీ ఉన్మాద చర్యే
[ 30-04-2024]
ఇటీవల వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 'లౌకిక విలువలు- సాహిత్యం' అనే సదస్సులో చొరబడి ఫాసిస్ట్ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. -
వ్యాను బోల్తా పడి.. 20 మందికి గాయాలు
[ 30-04-2024]
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను బోల్తాపడడంతో 20 మందికి గాయాలయ్యాయి. -
భారాస ఇంటింటి ప్రచారం
[ 30-04-2024]
తాంసి మండలం పాలోది, జామిడి గ్రామాల్లో మంగళవారం భారాస నాయకులు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిధుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం