తునికాకు సేకరణకు వేళాయె..
ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు
అడవి విస్తీర్ణం 1,82,604 చ.హె.
అడవి రేంజ్లు 09
తునికి ఆకు యూనిట్లు 08
ఉపాధి పొందే కూలీలు 3,056
తునికి ఆకు కల్లాలు 162
అడవిలో ఏపుగా పెరిగిన తునికి ఆకు చెట్టు
ఎదులాపురం, న్యూస్టుడే: ఈ ఏడాది తునికి ఆకు సేకరణకు అటవీశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో ఆకు నాణ్యత బాగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సారి ఆకు సేకరణ యూనిట్లు గణనీయంగా తగ్గాయి. గతంలో 21 యూనిట్లు ఉండగా ప్రస్తుతం ఎనిమిది యూనిట్లకే పరిమితమయ్యాయి. ఆకు నాణ్యంగా రావాలంటే నెల రోజులు ముందుగా ప్రూనింగ్(కొమ్మ కొట్టటం) చేయాల్సి ఉంటుంది. తునికి చెట్లకున్న చిన్న చిన్న కొమ్మలు నరికి వేస్తే ఎక్కువ మోతాదులో నాణ్యమైన ఆకు వస్తుంది. కానీ రెండు, మూడేళ్లుగా కొమ్మ కొట్టే ప్రక్రియను అటవీశాఖ విస్మరించింది. దీంతో నాణ్యమైన ఆకు రాక ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడంతో యూనిట్ల కొనుగోలుకు గుత్తేదారులు అనాసక్తి ప్రదర్శిస్తుండటంతో అటవీశాఖ యూనిట్ల సంఖ్యను తగ్గిస్తోంది.
జిల్లాలో రైతు కూలీలకు వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవటంతో తునికి ఆకు సేకరణే ప్రధాన ఆదాయ వనరు. తెల్లవారుజామునే అడవికి వెళ్లి తునికి ఆకు సేకరించి మూటల్లో ఇళ్లకు తరలిస్తారు. ఇంట్లోనే నీడ పట్టున కుటుంబ సభ్యులంతా యాభై ఆకులను ఒక కట్టగా కట్టి వాటిని కల్లాలపై విక్రయిస్తారు. ఇలా జిల్లాలో దాదాపు మూడు వేలకుపైగా మంది ఉపాధి పొందుతారు. అటవీశాఖ యాభై ఆకుల కట్టను రూ.మూడు చొప్పున వారి వద్ద కొనుగోలు చేసి ఎండబెట్టి 1,000 కట్టలను ఒక స్టాండర్డ్ బ్యాగుగా నింపి గుత్తేదారులకు అప్పగిస్తుంది. ఈ నెల 25 నుంచి ఆకు సేకరణ కల్లాల ద్వారా సేకరించటానికి ఏర్పాట్లు చేసినట్లు ఎఫ్ఆర్ఓ గులాబ్సింగ్ తెలిపారు. కూలీలు ఆకు సేకరణలో ఒక్కొక్క కుటుంబం రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తారు. ఇలా వేసవిలో తునికి ఆకు సేకరణ దాదాపు 25 నుంచి ముప్పై రోజులవరకు కొనసాగి కూలీలకు ఉపాధి లభిస్తుంది. స్థానికంగా బీడీలు చుట్టే కార్మికులు సైతం ఆకు సేకరించి నిల్వ చేసుకుంటుంటారు.
వర్షాలతో నాణ్యమైన ఆకు..
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో అడపాదడపా, భారీగా అకాల వర్షాలు నాణ్యమైన తునికి ఆకు రావటానికి దోహదం చేశాయి. సాధారణంగా అటవీశాఖ మే మొదటి వారం నుంచి ఆకు సేకరణ ప్రారంభిస్తుంది. కానీ ప్రస్తుతం వర్షాలతో నాణ్యమైన ఆకు ఉత్పత్తి అవగా ఈ నెలలోనే సేకరణ ప్రారంభించటానికి ఏర్పాట్లు చేసింది. లక్ష్యం కంటే ఎక్కువ సేకరణ జరిగే అవకాశాలున్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
[ 06-05-2024]
బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు బంధువులతో కలిసి ఆందోళన చేసింది. వధువు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. -
కమలదళం.. కదనోత్సాహం
[ 06-05-2024]
‘‘గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాకు ప్రణామం.. బాసర సరస్వతీ, పోరాటయోధుడు కుమురం భీం, రాంజీగోండ్, కొండా లక్ష్మణ్ బాపూజీలకు ప్రణామాలు..’’ అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కాగజ్నగర్లో నిర్వహించిన వికాస సంకల్ప సభలో ప్రసంగం ప్రారంభించారు. -
‘గిరి’యువతకు ఉపాధి కరవు
[ 06-05-2024]
ఆదివాసీ గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కలగానే మిగులుతోంది. యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లలో యువత ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సి ఉండగా.. శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, జాబ్ మేళాల ఏర్పాటు కోసం నిధుల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. -
కాంగ్రెస్లో కొత్తదనం.. కలిసొచ్చిన పాతతరం
[ 06-05-2024]
ప్రజలకు అభివాదం చేస్తూ, యువతకు స్వీయచిత్రాల అవకాశమిచ్చిన అగ్రనేత రాహుల్గాంధీ, గాడిద గుడ్డు కథ వివరిస్తూ నినాదాలు చేయించిన సీఎం రేవంత్రెడ్డి, ఒకే వేదికపై కూచాడి శ్రీహరిరావు, ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, వేణుగోపాలాచారి కనిపించటం, భారీగా తరలివచ్చిన జనం.. -
మండుతున్న ఎండలు.. వేడెక్కుతున్న భవనాలు
[ 06-05-2024]
వేసవిలో మండుతున్న ఎండలకు పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. సిమెంటు కాంక్రీటు భవనాలు వేడెక్కుతున్నాయి. సాధారణంగా గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉంటుంది. మండుతున్న ఎండలతో ఈ ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. -
కేంద్రాలు దూరం.. తప్పని భారం!
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ (కేయూ) పరిధిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ పరీక్షల్లో విద్యార్థులకు అవస్థలు తప్పేలా లేవు. వారం రోజులుగా 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్ యూజీ-2024) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. -
సెలవు కరవు.. విధుల బరువు..
[ 06-05-2024]
కనిపించని నాలుగో సింహం పోలీస్. ఇది అక్షర సత్యం. అదే సమయంలో పోలీసు జీవితం వెనక కనిపించని కష్టాలు, ఒత్తిళ్లు, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఖాకీ చొక్కా.. ప్యాంటులో హుందాతనంగా కనిపిస్తుంటారు. -
వసతులు లేక ఇక్కట్లు
[ 06-05-2024]
పేదలకు గూడు కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు పడకగదుల ఇళ్ల పథకంలో భాగంగా పట్టణంలోని బంగల్పేట్ శివారులో పెద్దమొత్తంలో జీప్లస్2 విధానంలో గృహాలను నిర్మించారు. -
చిన్నగూడు.. ఆదర్శం చూడు
[ 06-05-2024]
ఎక్కడి నుంచో వలస వచ్చిన కూలీలు వారు. ఉండేందుకు తాత్కాలికంగా టార్పాలిన్లతో కట్టుకున్న నివాసాలు వారివి. పనికెళితేనే పూట గడిసే పరిస్థితి. వారి గురించి ఇంతే చెబితే అందులో ప్రత్యేకత ఉండదు. -
పెన్సిల్తో అద్భుతాలు.. జీవం ఉట్టిపడేలా చిత్రాలు
[ 06-05-2024]
చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడమంటే అమితాసక్తి ప్రదర్శించే ఆ యువకుడు పెన్సిల్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. బొమ్మను చూస్తే చాలు ఉన్నది ఉన్నట్టు గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. -
డిగ్రీ ప్రవేశాల.. ‘దోస్త్’
[ 06-05-2024]
ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రకటన జారీ చేసింది. డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమై మూడు విడతల్లో సీట్లు కేటాయింపు జరగనుంది. -
నేటి నుంచి డిగ్రీ పరీక్షలు
[ 06-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సుల్లో రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షల నిర్వహిస్తుండటం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
క్రాంతినగర్ ఘటనలో 40 మందిపై కేసులు
[ 06-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో శుక్రవారం రాత్రి, శనివారం చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 40 మందిని బాధ్యులుగా గుర్తించి ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు. -
విజ్ఞాన భాండాగారం.. అంతర్జాలం
[ 06-05-2024]
దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి, హడావుడి నడుస్తుండగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల కాలం ముందుంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పోటీ పడుతుండగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’