బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు.
వైకాపాను భారీగా వీడుతున్న ముఖ్య నాయకులు
తెదేపా, జనసేన, భాజపాలోకి వరదలా వలసలు
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. అయినా.. ఫలితం లేదు.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. మాకు ఒరిగిందేమీ లేదు.. మరోసారి గెలిస్తే మాత్రం మమ్మల్ని ఏం ఉద్ధరిస్తారని.. వైకాపా నాయకులు.. తెదేపా, జనసేన, భాజపాల్లోకి వెల్లువలా వెళ్లిపోతున్నారు.’’
ఈనాడు, అమరావతి: ‘‘వైకాపా తరఫున గత ఎన్నికల్లో అత్యంత కీలకంగా పనిచేసిన నాయకులు కూడా.. ఇక తమవల్ల కాదని.. దండం పెట్టి వెళ్లిపోతుండడంతో.. అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ప్రజల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనుకుంటే.. ఇలా సొంత పార్టీలోనూ ఇప్పుడు అదే కనిపిస్తుండడంతో వారికి ఏం చేయాలో అర్థంకాకుంది.’’
ఉమ్మడి కృష్ణా జిల్లా వైకాపా నేతలు ఒక్కొక్కరిగా బయటకొచ్చేస్తున్నారు. గతంలో ఏ అధికార పార్టీలో లేనంత దయనీయం వైకాపాలో నెలకొంది. గుడివాడ వంటి నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ దారుణం. నిత్యం.. నాయకులు వెళ్లిపోతూనే ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరైనా నాయకుడు పార్టీని వీడి వెళ్తున్నారనే సమాచారం రాగానే.. అర్ధరాత్రి వాళ్ల ఇంటికి అభ్యర్థులే వెళ్లి బుజ్జగిస్తున్నారు. ఆర్థికంగా తాయిలాలు ఇచ్చి అయినా ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. ఎంపీ బాలశౌరికి మంచి పట్టుంది. ప్రత్యేకంగా వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఆయన వెళ్లడం గట్టి దెబ్బే. బీసీ నేత పార్థసారథి పార్టీని వీడగా.. కంకిపాడు, ఉయ్యూరు మండలాల వారు అనుసరించారు.
ద్వితీయ శ్రేణి ఖాళీ..
పెనమలూరులో పార్థసారథితో పాటు ఎంపీపీ, మండల వైకాపా అధ్యక్ష, ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, పీఏసీఎస్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు.. పెద్దసంఖ్యలో తెదేపాలో చేరారు. గన్నవరంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా వలసలు పెరిగాయి. బాలశౌరి రాకతో కృష్ణా జిల్లా జనసేనలోకి కూడా భారీగా చేరికలు పెరిగాయి. అవనిగడ్డ వైకాపాలో కీలక నేతలు ఒక్కొక్కరిగా జనసేన గూటికి చేరుతున్నారు. వైకాపా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి గుడివాడ శివరావు ఆపార్టీని వీడి జనసేనలో చేరారు. అవనిగడ్డ మండలం పాతఎడ్లంకలో సర్పంచి, ఉపసర్పంచి, మాజీ సర్పంచి సహా గ్రామస్థులంతా మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వేకనూరు, బ్రహ్మానందపురం తదితర గ్రామాలకు చెందిన వందల వైకాపా కుటుంబాలు జనసేనలో చేరాయి. పెడన నియోజకవర్గం నుంచి భారీగా జనసేనలోకి వలసలు మొదలయ్యాయి. తాజాగా ఎంపీ బాలశౌరి సమక్షంలో పెడనకు చెందిన వంద మందికి పైగా వైకాపా కుటుంబాలు జనసేన కండువా వేసుకున్నాయి. గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుతో విసిగి చాలామంది వైకాపాను వీడుతున్నారు. గన్నవరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పొట్లూరి బసవరావు, విజయ డెయిరీ డైరెక్టర్ పాలడుగు నానితో సహా కీలక నాయకులు తెదేపా గూటికి చేరారు. సర్పంచులు ఒక్కొక్కరుగా వైకాపాను వీడుతున్నారు. ఇప్పటికే పదిమందికి పైగా గన్నవరం పరిధిలో ఎమ్మెల్యేలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. గుడివాడలోనూ నిత్యం తెదేపాలోకి చేరికలు ప్రవాహంలా మారాయి. మైనార్టీ కీలక నాయకుడు షేక్ మౌలాలి, వైకాపా వార్డు కన్వీనర్లు, ఎంపీటీసీలు సహా నిత్యం నేతలు బారులుతీరి మరీ బయటకొచ్చేస్తున్నారు.
వాలంటీర్లూ వదిలేస్తున్నారు..
రాజీనామాలు చేసి వైకాపా తరఫున ప్రచారం చేయాలని ఆ పార్టీ నాయకులు వాలంటీర్లపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వాళ్లు రాజీనామాలు చేసి తెదేపా గూటికి చేరి వైకాపా నేతలకు ఝలక్ ఇస్తున్నారు. తాజాగా జక్కంపూడి కాలనీకి చెందిన వాలంటీర్లు జి.నాగరాజు, జి.దుర్గాపస్రాద్, స్వరూప్బాబు.. రాజీనామా చేసి తెదేపాలో చేరారు. వీరి వెంట జక్కంపూడి కాలనీ యువకులు చాలామంది తెదేపా గూటికి చేరారు. గన్నవరం పరిధిలోనూ అంబాపురం సర్పంచి సీతయ్యతో కలిసి నలుగురు వాలంటీర్లు తెదేపాలో చేరారు. విజయవాడ నగరంలో వైకాపా నేతల ఒత్తిడి తాళలేక పెద్దసంఖ్యలో వాలంటీర్లు తెదేపా గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
[ 06-05-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి: నారా లోకేశ్
[ 06-05-2024]
పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
జగనాసుర వారి.. నరకాపురి..!
[ 06-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని రహదారులపై ప్రయాణించినవారెవరైనా సరే.. జగన్ సర్కారును శాపనార్థాలు పెట్టకుండా ఉండలేరు. అటు ప్రైవేటు వాహనాలవారే కాదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం మేం నడపలేం అంటూ మొత్తుకున్న సందర్భాలెన్నో. పల్లె వెలుగు బస్సులు నడి రోడ్డుమీదనే ఎన్నిసార్లు నిలిచిపోయాయో లెక్కే లేదు. -
ఉద్యోగుల ఓట్లకూ వైకాపా గాలం..!
[ 06-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలట్ విడుదల కాలేదు. -
ప్రవాసాంధ్రులూ.. పారాహుషార్!
[ 06-05-2024]
ఒక్క వ్యవసాయ భూములు, పొలాలే కాదు... ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు సహా.. అన్నిరకాల స్థిరాస్తులకు ఎసరు పెట్టేసింది జగన్ సర్కారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం దొడ్డిదారిన ఆస్తులను కాజేసే అక్రమార్కులకు ఇది వరంగా మారనుంది. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు కళాశాలల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకున్నారు. -
పట్టా లేదు... వంశీ.. పత్తా లేరు..
[ 06-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి. -
ఉట్టిపడిన సంప్రదాయం
[ 06-05-2024]
రుగ్వేదం పద్మశ్రీకి ప్రపంచ రికార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయిన వైకాపా మూకలు
[ 06-05-2024]
ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
[ 06-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. -
రేపు పవన్ రాక!
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. -
వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
[ 06-05-2024]
పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. -
నిబంధనలు బేఖాతర్
[ 06-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. -
సూపర్-6 పథకాలతో సంక్షేమం పరుగులు
[ 06-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. -
మీ భూములు కొల్లగొట్టేస్తారు..!
[ 06-05-2024]
ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. -
‘జగన్.. అధికార దుర్వినియోగం చేశారు’
[ 06-05-2024]
గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. -
తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం
[ 06-05-2024]
నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. -
పోస్టల్ బ్యాలట్ సమాచారానికి హెల్ప్లైన్లు
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి షాహిద్బాబు తెలిపారు. -
సీఎం పర్యటనకా? పోస్టల్ బ్యాలట్కా?
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు. -
ఈవీఎం-వీవీ ప్యాడ్ల ఓటింగ్ సజావుగా సాగాలి
[ 06-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్ సూచించారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
[ 06-05-2024]
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
ఫెసిలిటేషన్ కేంద్రాల సంఖ్య పెంపు
[ 06-05-2024]
ద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్ బ్యాలట్ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఫారం-12 అందజేతకు మరో అవకాశం
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా