వైద్యం చేయకుండానే రోగుల పేరిట బిల్లులు!
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
ఆరోగ్యశ్రీ ఆసుపత్రులపై ఫిర్యాదులు
గుట్టుగా విచారణ
డోన్లోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు గుత్తితోపాటు సమీప గ్రామాల నుంచి కొంతమంది పేదలను తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసినట్లు బిల్లులు చేసుకోవడం వివాదాస్పదమైంది. విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఏ వైద్యం చేయకుండానే బిల్లులు పెట్టినట్లు వెలుగులోకొచ్చింది. ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న రోగులతో విచారణ చేయగా తమకు ఎలాంటి వైద్యం అందించలేదని రూ.500 ఇచ్చి వేలిముద్రలు వేయించుకున్నారని చెప్పటంతో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు సిపార్సు చేశారు.
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ ప్రైవేట్ వైద్యశాల, పామిడిలోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో రోగులకు వైద్యం చేయకనే చేసినట్లు ఆరోగ్యశ్రీ కింద బిల్లులు పెట్టారని అప్పట్లో ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. దీనిపై విచారణ ఇంకా చేస్తున్నారు.
అనంతపురం (వైద్యం), న్యూస్టుడే : ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకుల వెనుక వైకాపా నాయకుల అండ ఉందని స్పష్టమవుతోంది. రోగులకు ఎలాంటి వైద్యం అందించకనే వారి పేర్లమీద ఆరోగ్యశ్రీ బిల్లులు చేసుకుంటున్నారు. తమకు వైకాపా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల అండ ఉందని తమ ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోరన్న ధీమాతో కొంతమంది నిర్వాహకులు పెద్ద ఎత్తున నిధులు దిగమింగేశారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఆసుపత్రులకు వస్తే వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి.. వారికి తెలియకుండానే వారి పేర్లమీద ఆరోగ్యశ్రీ బిల్లులు పెట్టుకోవడం వివాదాస్పదమైంది.
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని కొన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఈ తరహా వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు అధికారుల వ్యవహరంపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఒకే తరహా రోగానికి ఎక్కువగా రోగులకు వైద్యం అందించినట్లు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద బిల్లులు పెట్టారు. కొంతమంది రోగుల సెల్ నంబర్లకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకున్నట్లు సంక్షిప్త సమాచారం రావటంతో వారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అప్పటి కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ ఆదేశించారు. ఇదే ఆసుపత్రిలో వందకు పైగా సీవోపీడీ (బిల్లులు పెట్టటంతో అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు రోగికి వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేస్తున్నట్లు మొదట ఫొటో అప్లోడ్ చేసి తరువాత డిశ్చార్జి సమయంలో వేలిముద్రలు తీసుకుంటున్నట్లు బిల్లులు పక్కాగా పెట్టి దోచేస్తున్నారు.
రోగికి ఎలాంటి ఇన్పెక్షన్ లేకపోయినా వెంటిలేటర్పై చికిత్స చేస్తున్నట్లు బిల్లులు పెట్టి దోచుకుంటున్నారు. సీవోపీడీ(క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) కింద వెంటిలేటర్పై చికిత్సకు రూ.60 వేల వరకు ప్యాకేజీ ఉండగా, సాధారణ ఇన్పెక్షన్ అయితే రూ.6 వేల వరకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ఉంది. కొన్ని నెట్వర్క్ వైద్యశాలల్లో ఈ తరహాలో బిల్లులు ఎక్కువ పెట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. చేయని వైద్యానికి రూ.కోట్లలో బిల్లులు పెట్టి కొంతమంది లబ్ధి పొందినట్లు ఫిర్యాదులున్నాయి.
ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో 59 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా రోగులతో వసూళ్లకు పాల్పడుతున్నారు. కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు కాళ్లు, చేతులు విరిగిన వారికి రాడ్లు వేయాలంటే ప్రభుత్వం సరఫరా చేసేవి నాణ్యతగా ఉండవని.. ఇంకో రకం వేస్తామంటూ అదనంగా వసూలు చేస్తున్నారు. చేసేదేం లేక రోగులు ఎక్కువ మొత్తం డబ్బులు కట్టి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.
కంటి శస్త్ర చికిత్సలకు నాణ్యతగల లెన్స్ వేస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. గుండెకు సంబంధించి స్టంట్లు నాణ్యమైనవి వేయించుకుంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని వివరిస్తూ అదనపు మొత్తం చెల్లించాలని చెబుతున్నారు.
ద్విచక్రవాహనం నుంచి పడి గాయపడిన భార్యాభర్తలు సాయినగర్లో ఉన్న ప్రైవేటు వైద్యశాలకు వెళ్లగా.. అక్కడ ఇద్దరికీ శస్త్రచికిత్సలు చేశారు. ఇంటికెళ్లిన బాధితులకు చికిత్స వికటించగా.. తిరిగి ఆసుపత్రికి వచ్చారు. ఆందోళన చేసి ఆరోగ్యశ్రీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి గుట్టుచప్పుడుగా ఇంకో ఆసుపత్రిలో చికిత్సకు ఒప్పించారు. కానీ ఇక్కడి వైద్యుల నిర్వాకంపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం.
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు అధికారులు రాజకీయ బలంతో పోస్టింగ్లు తెచ్చుకున్నారు. ఆ అధికారులు ప్రతి నెలా నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి డబ్బులు వసూళ్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఓ అధికారి, మరో ఉద్యోగి ద్వారా వసూళ్ల పర్వం సాగిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆసుపత్రి నిర్వాహకులతో వాట్సప్ కాల్స్లో మాత్రమే సదరు అధికారులు మాట్లాడుతారని, డబ్బులు కూడా నేరుగా వారు తీసుకోకుండా ఫలానా చోటుకు రమ్మని చెప్పి తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
అధికారుల వసూళ్ల వేట
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అధికారులు వసూళ్ల వేటలో మునిగి తేలుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినా నామమాత్రపు చర్యలు తీసుకుంటుండంతో యాజమాన్యాల్లో మార్పు రావటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవ్వాతాతల పింఛన్లపై జగన్నాటకం
[ 01-05-2024]
ఏ బిడ్డ కన్నవారిని కష్టపెట్టాలనుకోడు. ఏ మనవడు అవ్వతాతల్ని మండుటెండలో నిల్చోబెట్టి మాడ్చాలని కోరుకోడు. ఏ సోదరుడు అక్కాచెల్లెమ్మలను ఇబ్బంది పెట్టాలని తలంచడు.నోరు తెరిస్తే మీ బిడ్డనంటూ దీర్ఘాలు తీసే సీఎం జగన్ మాత్రం అవ్వాతాతలు, -
జగన్ పాలనలో 108 కుయ్యో.. మొర్రో
[ 01-05-2024]
108కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే అర్బన్ ప్రాంతంలో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లోపు అంబులెన్స్ బాధితులు ఇచ్చిన అడ్రస్కు చేరుకోవాల్సి ఉంది. -
దుర్గంలో ఎర్రమట్టి దోపిడీ
[ 01-05-2024]
రాయదుర్గంలో అధికారం అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టణం సరిహద్దున ఉన్న చెరువులు, కొండల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఐదేళ్లుగా దందా సాగిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. -
వంతెన హామీకి రెండున్నరేళ్లు
[ 01-05-2024]
అనంతపురం-అమరావతి జాతీయ రహదారిలోని బుక్కరాయసముద్రం వద్ద వంకపై వంతెన నిర్మాణానికి వైకాపా ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి హామీ ఇచ్చి రెండున్నరేళ్లయింది. -
జాలిలేని జగన్ మామ..
[ 01-05-2024]
మారుమూల మడకశిర ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలనే సదుద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేయించారు. -
పల్లెల ప్రగతిపై ప్రభుత్వం నిర్లక్ష్యం
[ 01-05-2024]
వైకాపా ఐదేళ్ల పాలనలో పల్లెల్లో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉరవకొండ మండలంలోని రాకెట్ల, ఆమిద్యాల, మోపిడి గ్రామాలు పెద్దవి. -
బలిజలకు జగన్ వెన్నుపోటు పొడిచారు
[ 01-05-2024]
గత తెదేపా హయాంలో బలిజలను వెన్నుతట్టి ప్రోత్సహించారని, వైకాపా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడిచి బలిజలను సర్వం నాశనం చేశారని కాపు సంఘం రాష్ట్ర ఐకాస నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆరోపించారు. -
అరాచక పాలనకు అంతం పలుకుదాం
[ 01-05-2024]
అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపాకు అంతం పలుకుదామని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం పలు గ్రామాల్లో మంగళవారం పరిటాల సునీత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
బరిలో పెరిగిన పోటీదారులు
[ 01-05-2024]
జనాలకు రాజకీయాల పట్ల ఆసక్తి నానాటికి పెరుగుతోంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. -
‘ఆశీర్వదించండి.. 114 చెరువులను నింపుతా’
[ 01-05-2024]
ప్రజలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపిస్తే రెండున్నరేళ్లలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులను నింపుతానని, రహదారులను బాగు చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. -
వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం
[ 01-05-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భారీగా నగదు పట్టివేత
[ 01-05-2024]
అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనంత అర్బన్ డీఎస్పీ వీర రాఘవరెడ్డి మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. -
రానున్న మూడ్రోజుల్లో తీవ్ర వడగాలులు
[ 01-05-2024]
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన వడ గాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. -
‘ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం’
[ 01-05-2024]
ఎన్డీఏ కూటమి మంగళవారం విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాలవారికి సమ ప్రాధాన్యం కల్పించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు వడ్డె అంజినప్ప పేర్కొన్నారు.