జగనన్నా.. ఉద్యోగులంటే అంత అలుసా ?
ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా, రాస్తారోకో చేసినా, విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆందోళన చేపడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అరెస్ట్లు చేయడం, ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వారు భయాందోళనలకు గురవుతున్నారు.
ఉద్యమాలు చేస్తే కేసులే
భయాందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు
న్యూస్టుడే, చిత్తూరు విద్య, కలెక్టరేట్, పూతలపట్టు
ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా, రాస్తారోకో చేసినా, విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆందోళన చేపడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అరెస్ట్లు చేయడం, ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వారు భయాందోళనలకు గురవుతున్నారు.. సకాలంలో వేతనాలు అందక, అప్పులు తీర్చలేక, ఈఎంఐలు కట్టలేక ఐదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు.. 2022 ఏప్రిల్లో విజయవాడలో పెద్దఎత్తున ధర్నా చేపట్టగా 65 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోజు నుంచి జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ కోర్టు వాయిదాలకు వెళ్లొస్తున్నారు.. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ఆందోళన చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉందని ఉద్యోగ, ఉపాధ్యాయులు వాపోతున్నారు.
మంత్రి హామీలకే దిక్కులేదు..
-గణేష్ గుల్లారి, మండల ప్రధాన కార్యదర్శి, పూతలపట్టు, ఎస్టీయూ
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మంత్రులు ఇచ్చిన హామీలు అమలుకాక పోవడం శోచనీయం. హక్కుల సాధన కోసం ఉద్యమిస్తే పోలీసులతో అణచివేయించారు. ఉద్యోగులు.. ప్రభుత్వంపై అభద్రతా భావంలో ఉన్నారు. పిల్లల చదువుకు, వివాహాల కోసం దాచుకున్న సొమ్ము దారి మళ్లించడం బాధాకరం. ఉద్యోగుల్లో భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే విధానాలు మానుకోవాలి.
నోటీస్ ఇస్తే మరుసటిరోజే అరెస్టు..
-రెడ్డెప్ప నాయుడు, జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యదర్శి
సమస్యల పరిష్కారానికి ఆందోళన చేపట్టడానికి ముందుగా నోటీసు ఇస్తాం. ఆ మరుసటి రోజే పోలీసులు వచ్చి అక్రమంగా గృహనిర్బంధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నోటీస్ ఇస్తే సంబంధిత సంఘ నాయకులను పిలిచి చర్చించేవారు. ఇప్పుడా విధానమే లేదు. నియంతృత్వ ధోరణితో అణచివేసే పద్ధతి అవలంబిస్తున్నారు. ఎక్కడా ప్రజాస్వామ్యం లేదు.
అడుగడుగునా బెదిరింపులు..
-రాధాకృష్ణ, జిల్లా మీడియా కన్వీనర్, ఆపస్
సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్య పద్ధతి అనుసరించినా ప్రయోజనం లేదు. సీపీఎస్ రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వకపోగా వారికి ఇష్టం వచ్చిన విధానాలు ఉద్యోగులపై రుద్దుతోంది. అణచివేత ధోరణితో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.