logo

వైకాపాకు ఓట్లతో గుణపాఠం చెప్పించాలి

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడిపై వైకాపా అసత్య ప్రచారాలను ఓటుతో తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు.

Published : 17 Apr 2024 03:27 IST

శాంతిపురం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడిపై వైకాపా అసత్య ప్రచారాలను ఓటుతో తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీ కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు పాలనలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని గుర్తు చేయాల్సిన బాధ్యత శ్రేణులపై ఉందని తెలిపారు. ఈ నెల 19న శుక్రవారం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల నామపత్రాల దాఖలు కార్యక్రమంలో తెదేపా సత్తా చాటాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌బాబు పాల్గొన్నారు. మండల పరిధి చెంగుబళ్లకు చెందిన పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరడంతో.. వారిని పసుపు కండువాలతో ఆహ్వానించారు. మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథనాయుడు, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని