హక్కుల కాలరాత.. జగన్మార్కు అణచివేత
బ్రిటిష్ పాలనలో దేశ ప్రజలు బానిసత్వంలో బతికారని చరిత్రలో చదివాం.. వైకాపా ప్రభుత్వ హయాంలో నాటి బానిసత్వాన్ని ఐదేళ్లు స్వయంగా చవిచూశామని ఆవేదన చెందుతోంది ఉద్యోగ లోకం.. నోరు తెరిస్తే తప్పు, మాట్లాడితే ముప్పు.. అన్నట్లైంది వీరి పరిస్థితి..
బానిసల్లా ఉద్యోగులు..!
ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, పోరాటాలకు వీల్లేదు
గృహ నిర్బంధాలు, అడుగు పెట్టనీకుండా అరెస్టులు
నాడు: మాదీ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. గతంలో తెదేపా పాలనలో ఉద్యోగులను అణగదొక్కారు.
- పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రగల్భాలు
నేడు: సీఎంగా కొలువుదీరాక జగన్.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై మౌనం ఉద్యమిస్తామని డిమాండ్ చేస్తే నోటీసులు, గృహ నిర్భంధాలు, అరెస్టులు ఆనక బెదిరింపులు
జిల్లాలో క్లాస్-4 నుంచి గెజిటెడ్ ఉద్యోగులు: 31 వేల మంది
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమాలు: 11, 12వ పీఆర్సీలకు వ్యతిరేకంగా, సీపీఎస్ రద్దు కోసం, సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ.. ఇంకా ప్రజా సంఘాలకు మద్దతుగా చేపట్టిన ఉద్యమాలు అనేకం.
చిత్తూరు కలెక్టరేట్, విద్య, న్యూస్టుడే: బ్రిటిష్ పాలనలో దేశ ప్రజలు బానిసత్వంలో బతికారని చరిత్రలో చదివాం.. వైకాపా ప్రభుత్వ హయాంలో నాటి బానిసత్వాన్ని ఐదేళ్లు స్వయంగా చవిచూశామని ఆవేదన చెందుతోంది ఉద్యోగ లోకం.. నోరు తెరిస్తే తప్పు, మాట్లాడితే ముప్పు.. అన్నట్లైంది వీరి పరిస్థితి.. రాజ్యాంగం ప్రసాదించిన తమ హక్కులు, డిమాండ్ల సాధనకు గళమెత్తే గొంతుకకు అడుగడుగునా ఆంక్షలు.. పోరాటానికి కదలకుండా కట్టడి.. పోలీసులతో ముట్టడి.. వెరసి స్వేచ్ఛ పునాదులపై నిర్మితమైన దేశంలో.. అందునా ఏపీలో హక్కుల కోసం ప్రశ్నిస్తున్న ఉద్యోగులపై పాలకుల నిరంకుశత్వం అంతులేకుండా సాగింది.
ఉద్యోగులకు రూ.కోట్లలో బకాయిలు.. ఏపీఎన్జీవో, ఏపీఐకాస అమరావతి సంఘాలు.. యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, ఏపీసీపీఎస్ఈఏ ఇతర సంఘాలు ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తున్నాయి. పెండింగ్ డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు ఇతరత్రా డిమాండ్ల సాధన కోసం ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు పోరుబాట పట్టారు.
ఏదీ ఆ మాట, ఏదీ ఆ మడమ..
సీఎం వైఎస్ జగన్.. ఉద్యోగుల విషయంలో మాత్రం మాట తప్పారని, మడమ తిప్పారని ఉద్యోగ సంఘాలు పెద్దఎత్తున నినదిస్తున్నాయి. 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు, ఆర్జిత సెలువుల పెండింగ్ బకాయిలు రెండు విడతల్లో చెల్లింపులని నమ్మబలికి ఇప్పటికీ చుక్కలు చూపుతున్నారు. చివరకు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడాన్ని విస్మరించింది వైకాపా ప్రభుత్వం. అసలు జీతాలు 15వ తేదీ దాటినా ఎప్పుడొస్తాయో తెలియని దయనీయ స్థితి.
నియంతలు చరిత్ర పుటల్లో కలిసిపోయారు
- గంటా మోహన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఎస్టీయూ
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కాలనే నియంతలు ఎందరో చరిత్ర పుటల్లో కలసి పోయారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉద్యమ సంఘాలతో చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపేవారు నిజమైన పాలకులు. అధికారాన్ని అడ్డుపెట్టి ఉద్యమకారులపై వేధింపులకు పాల్పడుతుండటం దుర్మార్గం.
అడ్డగోలు నిబంధనలు తగవు
- రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన హక్కు ముఖ్యంగా సంఘాలకు ఉద్యమించే హక్కులు సహజంగానే ఉంటాయి. అయితే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదని న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమించకూడదని అడ్డగోలు నిబంధనలు తీసుకురావడం ఏ మాత్రం మంచిది కాదు.
ఉద్యమాలు బలపడతాయి
- రాఘవులు, జిల్లా అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవో
అణచివేసే కొద్దీ ఉద్యమాలు మరింత బలపడతాయే తప్ప తగ్గవు. కొన్నేళ్లుగా కొద్దిమంది అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రజాస్వామిక పద్ధతిలో ఉద్యోగ సంఘాలను అడ్డుకోవడం శోచనీయం. ఇది ఎవరికీ అంత మంచిదికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛను పంచన.. నయా వంచన
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వంలోని అధికారులు పండుటాకులను ఇబ్బంది పెట్టేందుకు మరో వికృత క్రీడకు తెరలేపారు. -
జన, ధన, మాన చోరుడు జగన్..
[ 30-04-2024]
‘ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. రూ.లక్షల కోట్లు హాంఫట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. -
వారాంతపు సెలవులు హుష్ఖాకీ
[ 30-04-2024]
జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండటంతో వీఐపీల తాకిడి అధికంగా ఉంటుంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, మంత్రులు తరచూ తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అరగొండ ఆలయాలను సందర్శిస్తుంటారు.. -
సదుంలో రణరంగం
[ 30-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో చేపట్టిన ప్రచారం ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. -
రూ. 5 కోట్ల పనులు.. ఐదేళ్లూ విస్మరించారు
[ 30-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో శుభకార్యాలు, సమావేశాలు, సదస్సులు నిర్వహణకు సరైన వేదిక లేక ఇబ్బందులుండేవి. -
పోరు.. ఖరారు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. బరిలో నిలిచింది ఎందరో తేలిపోయింది. మరోవైపు తుది, అనుబంధ ఓటర్ల జాబితాలు ఖరారయ్యాయి. -
వనితే నిర్ణేత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయాన్ని మహిళలు నిర్ణయించనున్నారు. జిల్లా పరిధిలో 25వ తేదీ నాటికి మొత్తం 18,12,980 ఓటర్లు ఉన్నారు. -
ఓటుకొస్తే అమ్మ.. జీతాలకొస్తే ఆ..యమ్మ
[ 30-04-2024]
కాలే కడుపులు.. అర్ధాకలితో ఉన్నా తమకు అప్పజెప్పిన పనులు పూర్తిచేయడంలో ఆయాలు ముందుంటారనడంలో సందేహం లేదు. -
తిరుమల పవిత్రతను మంటగలిపారు
[ 30-04-2024]
శ్రీవారి దర్శనం టికెట్ల ధరను విపరీతంగా పెంచేసి తిరుమలకు వచ్చే భక్తులను గత ఐదేళ్లలో దోచుకున్నారని ఎన్డీయే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. -
వైకాపా ప్రచారానికి అనుమతులేవీ?
[ 30-04-2024]
వడ్డించేవాడు మనవాడైతే.. చాలన్న చందాన తిరుపతిలో వైకాపా, పోలీసుల తీరు కొనసాగుతోంది. -
ఆలయంలో అధికార పార్టీ ప్రచారం
[ 30-04-2024]
పట్టణంలోని బజారువీధి రామమందిరంలో సోమవారం రాత్రి అధికార పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రచారం చేపట్టారు. -
బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
బ్యాండేజ్ వేసుకుని వినూత్నంగా ఎన్నికల ప్రచారం
[ 30-04-2024]
ఎన్నికల్లో సానుభూతి పొందాలని సీఎం జగన్ ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెదేపా, జనసేన నాయకులు ఎద్దేవా చేశారు. -
కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
[ 30-04-2024]
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. -
ఇద్దరు వాలంటీర్లపై వేటుకు సిఫార్సు
[ 30-04-2024]
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. -
చీటీల మోసం కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు
[ 30-04-2024]
చీటీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితుడికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం స్థానిక జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భీమారావు సోమవారం తీర్పు చెప్పారు. -
కమ్యూనిటీ హాలులో వైకాపా నాయకుల సమావేశం?
[ 30-04-2024]
తిరుమలలో కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అదే సమయంలో వైకాపా తిరుమల విభాగం అధ్యక్షుడు చిన్నముని ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక కమ్యూనిటీ భవనంలో సమావేశమయ్యారు.