ముఖ్యమంత్రి సభకు బస్సులు... ప్రయాణికుల పడిగాపులు
సమయానుకూలంగా బస్సులు రాక.. కొన్ని మార్గాల్లో పూర్తిస్థాయిలో సర్వీసులు అందుబాటులో లేక.. సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
గోకవరం బస్టాండ్ వద్ద నిరీక్షిస్తున్న ప్రజలు
వి.ఎల్.పురం, ఏవీఏ రోడ్డు(రాజమహేంద్రవరం), న్యూస్టుడే: సమయానుకూలంగా బస్సులు రాక.. కొన్ని మార్గాల్లో పూర్తిస్థాయిలో సర్వీసులు అందుబాటులో లేక.. సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తామెక్కాల్సిన బస్సు ఎప్పుడొస్తుందో తెలియక మంగళవారం బస్టాండ్లలో పడిగాపులు పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం జరిగిన వైకాపా ‘మేమంతా సిద్ధం’ సభకు జనాలను తరలించేందుకు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 88 బస్సులను కేటాయించారు. రాజమహేంద్రవరం డిపో నుంచి 35, గోకవరం నుంచి 20, కొవ్వూరు నుంచి 23, నిడదవోలు నుంచి 10 వరకు పంపించారు. జిల్లాలోని నాలుగు డిపోల్లో కలిపి ఆర్టీసీ సొంత బస్సులు 205 ఉండగా వీటిలోనే 88 బస్సులను సీఎం పాల్గొనే సభకు వినియోగించారు. సొంత, అద్దె బస్సులు కలిపి జిల్లాలోని ఆయా మార్గాల్లో ప్రతిరోజూ 272 షెడ్యూల్ సర్వీసులుగా తిరుగుతుండగా కొన్నింటిని మళ్లించడంతో షెడ్యూళ్లు కుదించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం నుంచే కొన్ని రూట్లలో బస్సులు అందుబాటులో లేకుండాపోయాయి. ఇటు కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 145 బస్సులను కూడా సీఎం సభకు తరలించడంతో సర్వీసులు తగ్గి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సి ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బుధవారం శ్రీరామనవమి కావడంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, ఇతర పూజాసామగ్రి కొనుగోలు చేసేందుకు ముందురోజు ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున నగరం, పట్టణాలకు బయలుదేరారు. బస్సులు సమయానుకూలంగా లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. అధికారులు మాత్రం షెడ్యూల్ సర్వీసులేమీ కుదించలేదని చెప్పుకొస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటలలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు
[ 29-04-2024]
భువనగిరి పట్టణంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సుమన్ కల్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు జరిపారు. -
కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీని సాధిద్దాం
[ 29-04-2024]
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి కోరారు. -
బటన్నోక్కే వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలి
[ 29-04-2024]
బటన్ నొక్కే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలంతా సాగనంపాలని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరంతా ఓటు వేయాలని సీనియర్ తెదేపా నాయకుడు పెండ్యాల అచ్చిబాబు తెలిపారు. -
పింఛన్దారులను మండుటెండలో తిప్పడమే వైకాపా పనిగా పెట్టుకుంది
[ 29-04-2024]
మండుటెండలో పింఛన్దారులను అటూ ఇటూ తిప్పడమే వైకాపా పనిగా పెట్టుకుందని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. -
వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి.. కూటమిదే విజయం: పవన్కల్యాణ్
[ 29-04-2024]
వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెబుతున్నానని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. -
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
[ 29-04-2024]
కోనసీమ జిల్లా అమలాపురం గ్రామీణ మండలం భట్నవిల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కాటన్ దొర కట్టారు.. జగన్ చెడగొట్టారు
[ 29-04-2024]
సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ.. ఉభయ గోదావరి జిల్లాల కర్షకుల ఆశా దీపం. ఎక్కడి నుంచో వచ్చిన విదేశీయుడు ఈ ప్రాంత ప్రజలు, రైతుల కోసం అంతలా ఆలోచించి ఆనకట్ట కట్టారు. -
మార్పు కోరితే.. కూటమికి ఓటెయ్యండి
[ 29-04-2024]
ఉపాధి కావాలన్నా.. కష్టాలున్నా.. నేను వచ్చి మాట్లాడుతా.. నాకు లంచాలు అవసరం లేదు. రైతు కన్నీళ్లు తుడవగలిగితే.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే నాకు ఆనందం..రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఒక్కరు మాట్లాడరు. -
ఆదర్శంగా తీర్చిదిద్దడమంటే ‘ఇదేనా ఎంపీ గారు..’
[ 29-04-2024]
‘‘కడియం మండలంలోని పొట్టిలంక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా’’ ఇదీ రాజమహేంద్రవరం ఎంపీగా మార్గాని భరత్రామ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటన. -
వైకాపా అండ.. అక్రమ దందా
[ 29-04-2024]
అధికార పార్టీ నాయకులు అండదండలు, జిల్లా, స్థానిక అధికారులు ఆశీస్సులు ఉంటే ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతికి పాల్పడినా పట్టించుకోరన్న ధైర్యం స్థానిక వైకాపా నాయకుల్లో ఉంది.. -
మే 18 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
[ 29-04-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మే 18 నుంచి 24 వరకు జరగనున్న స్వామివారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. -
వైకాపాకు ఓటేస్తే.. మీ ఆస్తులన్నీ తాకట్టే
[ 29-04-2024]
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకూ న్యాయం చేస్తుందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. -
మూగబోయిన జీవితాలు
[ 29-04-2024]
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. -
బ్రాహ్మణ సమాజం ఏకం కావాలి: నాగబాబు
[ 29-04-2024]
బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి బ్రాహ్మణులంతా ఏకం కావాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. ఆదివారం పిఠాపురంలో బ్రహ్మణ సంఘాలు నాగబాబును కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. -
పిఠాపురం.. కొరకరాని కొయ్య
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది. -
హోం ఓటింగ్కు 69 బృందాలు
[ 29-04-2024]
పోలింగ్ కేంద్రాల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేలా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యంతో ఉన్న దివ్యాంగ ఓటర్లకు ఎన్నికల కమిషన్ హోం ఓటింగ్ అవకాశాన్ని కల్పించడంతో దీనికోసం మొత్తం 400 మంది ఎన్నికల సిబ్బందితో 69 బృందాలను ఏర్పాటు చేశారు. -
రారండోయ్ వేడుక చేద్దాం.. ఓట్లు దండుకుందాం
[ 29-04-2024]
అధికార పార్టీ నేతలు నాలుగేళ్లుగా లేనిది ఈ ఏడాది ఇప్పుడే పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటున్నారు. గతంలో పదిమందితో కలిసి వేడుక చేసుకునే వాళ్లు ఇప్పుడు 100మందిని పిలుస్తున్నారు. అంతా ఎన్నికల మహత్యం మరి!. -
ఆంధ్రాలో మార్పు కోసమే కూటమి
[ 29-04-2024]
ఆంధ్రాలో అరాచక పాలన అంతమొందించేందుకే తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ప్రజల ముందుకు వచ్చాయని, ఈ ఎన్నికల్లో వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలంతా ‘సిద్ధం’గా ఉన్నారని రాజమహేంద్రవరం ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
డబ్బు.. బిర్యానీ చూపి జనానికి ఎర
[ 29-04-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అంబాజీపేటలో సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ నిర్వహించనున్నారు. -
నేతలను ప్రసన్నం చేసుకోవాలని.. ప్రలోభాలతో వైకాపా కుటిలయత్నాలు
[ 29-04-2024]
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!