రీయింబర్స్మెంట్ లేదు.. చేయూత నిధులు అందలా..
వాలంటీర్ల ద్వారా ఇంటింటికే పథకాలు అందించాం కదా! నాడి ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్న వైకాపాకు ఎదురుదెబ్బ తగులుతోంది.
ఫోన్లు చేస్తున్న వారిని నిలదీస్తున్న లబ్ధిదారులు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్టుడే, పెదకూరపాడు: వాలంటీర్ల ద్వారా ఇంటింటికే పథకాలు అందించాం కదా! నాడి ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్న వైకాపాకు ఎదురుదెబ్బ తగులుతోంది. అన్ని సంక్షేమ పథకాలు అందాయా అంటూ ఆరా తీస్తూ ఎలాగైనా బుట్టలో వేసుకుందామనుకునే వారికి అటు నుంచి వస్తున్న సమాధానంతో మింగుడుపడడం లేదు. చరవాణిలో ప్రచార మోతతో జనం విసిగెత్తిపోతున్నారు. కొత్త కొత్త నంబర్లతో ఫోన్లు వస్తుంటే ఎవరని తీశాక రాజకీయ పార్టీల ప్రచార విషయాలే ఉంటున్నాయి. ముఖ్యంగా వైకాపా రికార్డు చేసిన ఫోన్లు వస్తున్నాయి. ‘‘వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు అందాయి. అన్నీ ఇంటికే తెచ్చి ఇచ్చారు. మళ్లీ అలా జరగాలంటే మరోసారి వైకాపానే ఆదరించాలి’’ అంటూ ఫోన్లు చేస్తున్నారు. తాడేపల్లి నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ వాలంటీర్ల ద్వారా ఈ ఐదేళ్లలో ఏం ఇబ్బందులు ఎదుర్కోలేదు కదా.. అన్ని పథకాలు ఇంటికే అందాయా? అని అడుగుతున్నారు. అయితే ఇలా ఫోన్లు చేసే వారిని ప్రజలు నిలదీస్తున్నారు. తమ అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతున్నాడని ఫీజు రీయింబర్స్మెంట్ ఒక విడతే పడిందని, తర్వాత జమ కాలేదని ఇదేనా సంక్షేమం అంటే అని అనడంతో ఫోన్ పెట్టేస్తున్నారు. అదే మహిళలకు ఇలాంటి ఫోన్లు వస్తుంటే వారు కూడా అంతే దీటుగా సమాధానమిస్తున్నారు. ఫోన్ చేసి సంక్షేమ పథకాలు ఇంటికే వచ్చాయి కదమ్మా అంటే ‘చేయూత చివరి విడత పడలేదని కొందరు, ఆసరా నిధులు పడలేదని మరికొందరు, డ్వాక్రా రుణమాఫీ పడలేదని.. ఇలా మహిళలు సమాధానమివ్వడంతో చేసేది లేక ఫోన్ కట్ చేస్తున్నారు. మరికొందరైతే ఏ ఊరు? ఏ వార్డు వాలంటీరు అని అడిగి ఫోన్ పెట్టేస్తున్నారు. మొత్తానికి వాలంటీర్ల ద్వారా సంక్షేమం ఆగిపోతుందని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్న వైకాపాకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. చివరి విడత నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కాకపోవడంతో నిలదీస్తున్నారు.
తటస్థ ఓటర్లే లక్ష్యంగా వారి ఫోన్ నంబర్లను సేకరించి రోజుకు ఐదు నుంచి పది సార్లు సర్వే ఏజెన్సీలతో, కాల్సెంటర్లు ఏర్పాటు చేసి మరీ కొత్త సిమ్కార్డులతో వైకాపా సోషల్మీడియా, వాలంటీర్లతో ఫోన్ చేసి అధికార పార్టీకి మద్దతుగా నిలవాలంటూ ప్రచారం చేయిస్తున్నారు. మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వేటు వేసి గెలిపించాలంటూ తమ ప్రాంతాలకు చెందిన ఓటర్ల సెల్ఫోన్లకు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. ఒక వైపు ఇంటింటి ప్రచారం నడుస్తుండగా చరవాణిలో ఇదేం గోలరా అంటూ పలువురు విసుక్కుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే కారణంతో రెండుసార్లు సస్పెండ్ చేశారు.. క్యాట్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ
[ 29-04-2024]
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై విచారణ జరిగింది. -
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
[ 29-04-2024]
ఏపీ, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
[ 29-04-2024]
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
[ 29-04-2024]
కుటుంబంలో చోటుచేసుకున్న చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన చుండ్రు జయశ్రీ, ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన శివరామకృష్ణకు 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ప్రశ్నిస్తే పగ.. స్వేచ్ఛకు సెగ
[ 29-04-2024]
ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడడానికీ వీల్లేదు. వారి అభిప్రాయాలను బహిరంగంగా పంచుకోవడాన్ని సహించరు. అయిదేళ్ల జగన్ పాలన అక్షరాలా ఇలాగే సాగింది. -
జగన్మోసకారి!
[ 29-04-2024]
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ -
సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధం
[ 29-04-2024]
ఎన్నికల సమరానికి సైకిల్ యాత్రతో సంసిద్ధమని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి తెలిపారు. ‘ -
పదవిని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదన
[ 29-04-2024]
‘ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకుని ప్రకృతి సంపదను నాశనం చేసి ఏకంగా 700 ఎకరాల్లో గ్రావెల్ తవ్వి కిలారి రోశయ్య అక్రమ సంపాదన వెనకేసుకున్నారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రిజిస్టర్ పార్టీలు, -
అర్ధరాత్రి దళిత మహిళల దుకాణాల కూల్చివేత
[ 29-04-2024]
పేద దళిత మహిళల దుకాణాలను శనివారం అర్ధరాత్రి కూలగొట్టించిన వైకాపా కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
‘అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తాం’
[ 29-04-2024]
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
జగనన్నా.. ఉపాధి ఏదన్నా..?
[ 29-04-2024]
యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశాల్లో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాటలకు, క్షేత్ర స్థాయిలో పని తీరుకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం పారిశ్రామిక శిక్షణ సంస (ఐటీఐ)ల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. -
డీఎస్సీ వేయలే.. ఒక్క టీచర్ ఉద్యోగమూ ఇవ్వలే!
[ 29-04-2024]
రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మేం అధికారంలోకి రాగానే వాటన్నింటిని భర్తీ చేస్తాం. -
నా ఎస్సీలంటూనే.. నిలువునా మోసం
[ 29-04-2024]
ఎక్కడ మాట్లాడినా.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అంటూ ఎక్కడ లేని ప్రేమను మాటల్లో ఒలకబోసే జగన్.. వాస్తవంలోకి వచ్చేసరికి వారికి రిక్తహస్తాలే చూపారు. -
వారానికోసారే నీరు.. ఇదీ పాలన తీరు..
[ 29-04-2024]
గుంటూరు నగరపాలికలో విలీన గ్రామాలైన గోరంట్ల, రెడ్డిపాలెం, ప్రగతినగర్, మదర్థెరెసా నగర్లలో గుక్కెడు నీటి కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. -
రూపు మారిన ఆస్తి దస్త్రం
[ 29-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నినెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
గుంటూరు మీదుగా రైళ్లు
[ 29-04-2024]
విజయవాడ- ఖాజీపేట మార్గంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!