నీరివ్వలేని నీరో!
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు.
ఎయిమ్స్లో వైద్యులు, సిబ్బంది, రోగుల అవస్థలు
అయినా చలించని ముఖ్యమంత్రి జగన్
అటవీ అనుమతులకు రూ. 3లక్షలు చెల్లించలేరా?
ఈనాడు - అమరావతి: సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు..
కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. శాశ్వత నీటి సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. వారి కష్టాలను కళ్లారా చూడలేదు. వారి ఆర్తనాదాలను వినలేదు. కేవలం రూ. ఏడెనిమిది కోట్లు వెచ్చిస్తే చాలు.. సమస్య పరిష్కారమవుతుందని తెలిసినా.. ఈ అయిదేళ్లలో ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదు. రోగులే ఇళ్ల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది.
పేదలంటే నిర్లక్ష్యమా?
ఎయిమ్స్లో రహదారుల నిర్మాణంలో అపసవ్య విధానాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఇది చెల్లిస్తేనే కొలనుకొండ జంక్షన్ వద్ద ఆసుపత్రి ప్రవేశ మార్గం నుంచి తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనులకు పర్యావరణ అనుమతులిస్తామని గత కొన్నాళ్లుగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చెబుతున్నా.. జగన్ సర్కారు చెవికెక్కించుకోలేదు. ఈ మొత్తాన్ని ఎవరు చెల్లించాలన్నదానిపై ఆర్ అండ్ బీ, మున్సిపల్ ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు సీఎం జగన్ ఏమాత్రం చొరవ చూపలేదు. ఇదీ పేదలపై ఆయనకున్న ప్రేమ! రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం సంబంధిత శాఖలతో మాట్లాడి ఆ మొత్తాన్ని చెల్లించే ప్రయత్నమూ చేయలేదు.
ఎప్పటికప్పుడు పొడిగింపులే
శాశ్వత నీటి సౌకర్యం కోసం 2022 డిసెంబరులో పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పింది. రూ. 8 కోట్లతో గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువుకు, అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా ఆసుపత్రికి నీళ్లివ్వాలన్నది ప్రణాళిక. పనుల పూర్తి గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు. ఈ ఏడాది ఫిబ్రవరికల్లా పూర్తి చేస్తామని చెప్పింది. అదీ ముగిసింది. మళ్లీ ఏప్రిల్ వరకు గడువు పెంచింది. విచిత్రమేమంటే.. పనులకు అసలు అటవీశాఖ అనుమతే రాకపోవటం గమనార్హం. మరో మూడు, నాలుగు నెలల సమయం కావాలంటూ అధికారులు ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
గుత్తేదారుకు బకాయిలు
2.50 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో కూడిన సంపులు, నీటిశుద్ధి ప్లాంట్లకు సంబంధించి సివిల్ పనులు పూర్తయ్యాయి. మెకానికల్, ఫిల్టర్ బెడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జాతీయ రహదారి క్రాసింగ్ పనులు కూడా కొంతమేరకు చేయాల్సి ఉంది. గుత్తేదారుకు రూ. 2 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఇస్తేనే పనులు చేస్తానని ఆయన భీష్మించుక్కూర్చున్నారు.
ట్యాంకర్ల నీటిలోనూ కోతే
విజయవాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు అయిదేళ్లుగా ఎయిమ్స్కు నీటిని ఉచితంగా ఇస్తున్నాయి. ఇందుకోసం నిత్యం నాలుగు అద్దె ట్యాంకర్లను ఎయిమ్స్ వినియోగిస్తోంది. ఇప్పటిదాకా అద్దె కింద రూ. కోటిన్నరకుపైగానే ఖర్చు చేసింది. రోజూ ఒక్కో ట్యాంకర్ 10 ట్రిప్పులు వేయాలి. కానీ.. ఆ రెండు కార్పొరేషన్లలో నీటి సమస్య కారణంగా ఆరేడు ట్రిప్పులే సరఫరా చేస్తున్నాయి. ఇవి రోగుల అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు.
గత తెదేపా ప్రభుత్వం ఏం చేసిందంటే...
- ఆసుపత్రి, రహదారుల నిర్మాణం కోసం అవసరమైన భూములను సేకరించింది.
- నిర్మాణాలకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన మంజూరు చేసింది.
- 2015లో ప్రారంభమైన పనులు రికార్డుస్థాయిలో 2019 నాటికి పూర్తయ్యేలా పూర్తి సహకారం అందించింది. ఆ వెంటనే వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది.
వైకాపా ప్రభుత్వం నిర్వాకమిదీ...
- స్థానికంగా నివాసం ఉంటున్న వైద్యులు, వైద్య-నర్సింగ్ విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నా జగన్ సర్కారు పట్టించుకోలేదు.
- గత అయిదేళ్లుగా విజయవాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ల నుంచి ట్యాంకర్ల ద్వారా అరకొరగా వస్తున్న నీటితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. జగన్ సర్కారు చేతకానితనం వల్ల శాశ్వత పరిష్కారం పనులు పూర్తి కాలేదు.
- రహదారుల నిర్మాణం, బస్సు సౌకర్యం వంటి అంశాలను పట్టించుకోలేదు. తగినన్ని బస్సుల్లేక రోగులు గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక మూకలను ఓడించండి!
[ 01-05-2024]
‘తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన స్థితి నెలకొంది. -
ప్రతిపక్షాలపై కక్ష.. పింఛనర్లకే శిక్ష
[ 01-05-2024]
పింఛను సొమ్ము కోసం ఎవరూ సచివాలయాలకు రావొద్దని ఇళ్లకు వెళ్లి ఉద్యోగులు చెప్పడంపై పింఛనుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడానికి సరిపడా సిబ్బంది లేరని సాకులు చెబుతోంది. -
కార్మికలోకం కకావికలం
[ 01-05-2024]
అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. మూడు ప్రాంతాల అభివృద్ధికి కనీసం 30వేల ఎకరాలు ఉండాలి. అమరావతిలోనే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను. ఇక్కడే ఉంటాను. తెదేపా కన్నా దీటుగా రాజధాని నిర్మిస్తాను. -
కరకట్టపై కక్ష...!
[ 01-05-2024]
అమరావతి అంటేనే పొడ గిట్టని సీఎం జగన్.. దానిని ధ్వంసం చేసేందుకు శక్తిమేర ప్రయత్నించారు. రాజధానికి వెళ్లేందుకు సరైన అనుసంధాన రహదారి లేకుండా చేశారు. కరకట్ట రోడ్డును విశాలంగా విస్తరిస్తానని శంకుస్థాపన సమయంలో మాట ఇచ్చి.. ఆనక మడమ తిప్పేశారు. -
‘మే’మూ కడతాం ఇసుకాసురులకు పా‘డే’
[ 01-05-2024]
పెదకూరపాడు నియోజకవర్గం అమరావతికి చెందిన రామాంజనేయులు భవన నిర్మాణ కార్మికుడు. 2019 వరకూ సొంతూరులోనే పనులు చేసుకుంటూ ముగ్గురు పిల్లలతో హాయిగా కాలంగా వెళ్లదీశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత సృష్టించడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. -
పండుటాకులే ఎండగడతాయి జగన్!
[ 01-05-2024]
వెల్దుర్తి మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో వజ్రాలపాడు తండా, రామచంద్రాపురం తండా, సేవానాయక్ తండా, కొత్తపుల్లారెడ్డిగూడెం, దావుపల్లి తండాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 700 మంది వరకూ వృద్ధులున్నారు. -
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ
[ 01-05-2024]
నందమూరినగర్లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్లో పెద్ద మొత్తంలో పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్ల కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీటిని ఆర్డర్ ఇచ్చాడని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్ యజమాని గురుప్రసాద్ చెబుతున్నారు. -
తీరాన ప్రజాగళానికి సన్నద్ధం
[ 01-05-2024]
-
ఏకోపాధ్యాయ పాఠశాలలు.. దిగజారిన విద్యా ప్రమాణాలు
[ 01-05-2024]
రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారకుండా చూస్తాం.. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల అమలును విస్మరించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఒక్క డీఎస్సీ కూడా వేయకుండానే అయిదేళ్ల పాలన పూర్తి చేశారు. -
‘జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’
[ 01-05-2024]
రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్న జగన్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాల మహా సభ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్లెల వెంకట్రావు కోరారు. రిపబ్లికన్ పార్టీ మంగళగిరి అభ్యర్థి, న్యాయవాది గుర్రం రామారావుతో కలసి అమరావతి ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ..
[ 01-05-2024]
తెదేపా జాతీయ కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తరఫున ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. -
‘వైకాపా పాలనలో ఛార్జీల బాదుడు’
[ 01-05-2024]
వైకాపా పాలనలో ప్రజలపై నిత్యావసర సరకులు, విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కూటమి నాయకులు కోటేశ్వరరావు, కంతేటి బ్రహ్మయ్య ఆరోపించారు. -
శిడిమాను ఉత్సవం..భక్త సంబరం
[ 01-05-2024]
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో జగన్మాత పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. దూరప్రాంతాల నుంచి వేలాది మంది తరలి రావడంతో గ్రామం కిక్కిరిసింది. -
కూటమి గెలుపు అభివృద్ధికి మలుపు
[ 01-05-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని రసూల్ పేట, కొత్తపేట, బీసీ కాలనీలో మంగళవారం తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సప్లిమెంటరీ ఫీజుల చెల్లింపునకు మే 4 వరకు గడువు
[ 01-05-2024]
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు రుసుం చెల్లించేందుకు గడువు మే 4 వరకు ఉందని డీఈవో ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. -
వైకాపాకు గుంటూరు డిప్యూటీ మేయర్ సజీల రాజీనామా
[ 01-05-2024]
వైకాపాకు రాజీనామా చేసినట్లు గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.