logo

మరదలి కొడుకని దత్తత తీసుకొంటే.. ఇల్లంతా దోచేశాడు

దత్తత తీసుకున్న మరదలి కొడుకు ఇళ్లంతా దోచేసిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 20 May 2022 01:58 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: దత్తత తీసుకున్న మరదలి కొడుకు ఇళ్లంతా దోచేసిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హకీంపేట ఎన్‌ఎస్‌ఎఫ్‌ కాలనీలో నివసించే సెంట్రింగ్‌ కాంట్రాక్టర్‌ సయ్యద్‌ జావిద్‌ మరదలు చనిపోవడంతో ఆమె కుమారుడైన సయ్యద్‌ నిజాంను చిన్నప్పుడే దత్తత తీసుకున్నాడు. జావిద్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 14న శుభకార్యానికి వెళ్లగా.. నిజాం ఇంట్లోనే ఉండిపోయాడు. 15వ తేదీ తెల్లవారుజామున జావిద్‌ తన కుటుంబ సభ్యులతో ఇంటికి తిరిగి రాగా, ఇంటికి తాళం వేసి కనిపించింది. రెండో తాళంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. మూడు అల్మారాలు తెరిచి ఉన్నాయి. వాటిలోని రూ. 5లక్షల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలతో పాటు నిజాం కనిపించలేదు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని