logo

ఆసుపత్రిలో మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం

దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం చేసిన ఘటన మలక్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్‌ వివరాల మేరకు..

Published : 24 Sep 2022 02:59 IST

సైదాబాద్‌, న్యూస్‌టుడే: దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళపై వార్డ్‌బాయ్‌ అత్యాచారం చేసిన ఘటన మలక్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్‌ వివరాల మేరకు.. అంబర్‌పేటకు చెందిన మహిళ(40) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. జియాగూడకు చెందిన సందీప్‌(25) అక్కడే వార్డ్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి రెండో అంతస్తులో పని ఉందని ఆమెకు చెప్పాడు. అక్కడ శుభ్రం చేస్తుండగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పంపించేశాడు. ముభావంగా ఉంటున్న ఆమెను కుటుంబ సభ్యులు కారణం అడగ్గా విషయం చెప్పింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని