నేర వార్తలు
మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు చిత్రీకరించి కాలబురాగి(గుల్బర్గా)లోని వ్యక్తికి పంపిన నిందితుడిపై పీడీ చట్టం విధిస్తామని ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపారు.
మహిళల నగ్న చిత్రాల నిందితుడిపై పీడీ చట్టం
కేశవగిరి, న్యూస్టుడే: మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు చిత్రీకరించి కాలబురాగి(గుల్బర్గా)లోని వ్యక్తికి పంపిన నిందితుడిపై పీడీ చట్టం విధిస్తామని ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపారు. సోమవారం చాంద్రాయణగుట్ట ఠాణాలో విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్వర్మ, డీఎస్సై హరీష్కుమార్లతో కలిసి ఏసీపీ వివరాలు వెల్లడించారు. పాతబస్తీ బార్కస్ సలాలా ప్రాంతంలో మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు చిత్రీకరిస్తూ.. బేరం పెడుతున్న ఘటనలో నిందితుడు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజేశ్వర్ గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్(35)ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతడు చరవాణిలో పలువురు మహిళల నగ్నచిత్రాలు, వీడియోలను వాట్సాప్ ద్వారా కాలబురాగిలోని గులాంకు పంపినట్లు గుర్తించామన్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామన్నారు. పాతబస్తీలో పరిచయమైన ఓ మహిళ ఆధారంగా కొందరు మహిళలను పిలిచి నగ్నచిత్రాలు, వీడియోలు చిత్రీకరించినట్లు తేలిందని చెప్పారు. ఈ తరహాలో మోసపోయిన వారుంటే తనకు గాని, చాంద్రాయణగుట్ట ఠాణాలో లేదా సమీప పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయాలని కోరారు. సీపీ సీవీ ఆనంద్, డీసీపీ పి.సాయిచైతన్య ఆదేశాలతో కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మొదటిసారి పాతబస్తీకి వచ్చాడా..?
నిందితుడు సయ్యద్ పాతబస్తీకి మొదటిసారి వచ్చాడా లేక అంతకు ముందు వచ్చి వెళ్లాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హుస్సేన్కు ఇద్దరు భార్యలు, 8మంది సంతానం ఉన్నారు. వీరంతా బసవకల్యాణ్, రాజేశ్వర్ గ్రామంలో ఉంటున్నట్లు తేలింది. ప్రధాన నిందితుడు గులాం బాలికలు, యువతులు, మహిళలతో వ్యభిచారం చేయిస్తాడని గుర్తించారు.
ఆ మహిళ ఎవరు..?
పాతబస్తీకి వచ్చిన హుస్సేన్కు సహకరించిన మహిళ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. చార్మినార్ ప్రాంతంలో ఒక మహిళతో పరిచయం ఏర్పడిందని, తన దందా కోసం మహిళలను ఆమె సమకూర్చిందని హుస్సేన్ తెలిపాడు. నగ్నచిత్రాలు, వీడియోలు ఎవరివో తెలుసుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
లారీని ఢీకొన్న బస్సు.. నలుగురి దుర్మరణం
చెన్నై, న్యూస్టుడే: గుమ్మిడిపూండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేటు బస్సు ఆదివారం రాత్రి 27 మంది ప్రయాణికులతో చెన్నైకి బయలుదేరింది. బెంగళూరుకు చెందిన కిశోర్ డ్రైవర్. కాకినాడకు చెందిన శ్రీధర్(27) క్లీనర్. సోమవారం వేకువజామున 5 గంటల సమయంలో తిరువళ్ళూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని తచ్చూరు వద్ద అదుపుతప్పి లారీని ఢీకొంది. బస్సు ముందు భాగం దెబ్బతింది. క్లీనరు శ్రీధర్, ప్రయాణికులు నెల్లూరుకు చెందిన సతీష్కుమార్ (27), బెంగళూరుకు చెందిన రోహిత్శర్మ, చెన్నైకి చెందిన జానకిరామన్ (42) ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు, క్షతగాత్రులను పోలీసులు పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవరు కిశోర్ను కవరప్పేట పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్కు మూడేళ్లు పూర్తి
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ ఉదంతానికి మంగళవారంతో మూడేళ్లు పూర్తి కానుంది. 2019 నవంబరు 27న నలుగురు నిందితులు యువ వైద్యురాలు దిశపై తొండుపల్లి గేటు వద్ద అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం షాద్నగర్ శివారు చటాన్పల్లి సమీపంలోని 44వ నెంబరు జాతీయ రహదారి కింద సజీవ దహనం చేశారు. అత్యంత అమానవీయమైన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లారీ డ్రైవర్లుగా పనిచేసే ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా దిశకు సంబంధించిన వస్తువులు గుర్తించేందుకు నిందితుల్ని పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. అనంతరం క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం డిసెంబరు 6న చటాన్పల్లి తీసుకెళ్లినప్పుడు జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించడం మరో సంచలనం. నిందితుల ఎన్కౌంటర్ కట్టుకథ అని జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న 10 మంది పోలీసులపై హత్యానేరం నమోదు చేయాలని సూచించింది. మొత్తం 383 పేజీల నివేదిక సమర్పించింది. ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపామన్న పోలీసుల వాదనను తప్పుబట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది.
నగరంలో హై అలర్ట్
ఈనాడు- హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగి మంగళవారం నాటికి 30 ఏళ్లవుతున్న నేపథ్యంలో పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతల పరంగా సున్నిత పరిస్థితుల నేపథ్యంలో పాతబస్తీ సహా వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి గస్తీ పెంచారు. చార్మినార్ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటుచేస్తున్నారు. నిరసన కార్యక్రమాలకు అవకాశంలేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని పార్టీలు శాంతియుత నిరసనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో భద్రత పెంచారు.
దోపిడీ సొత్తు కోసం వేట
ఈనాడు- హైదరాబాద్: నాగోల్ స్నేహపురికాలనీలోని ఆభరణాల దుకాణంలో కాల్పులు దోపిడీకి పాల్పడిన కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దోచుకున్న సొత్తు కోసం వేట కొనసాగుతోంది. మహారాష్ట్ర, హరియాణా సహా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సమాచారం. నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారం దోపిడీకి పాల్పడిన నేపథ్యంలో గతంలోనూ ఇలాంటి నేర చరిత్ర ఉందా అని తెలుసుకుంటున్నారు. రివాల్వర్ ఎక్కడి నుంచి తెచ్చారని కూపీ లాగుతున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు 15 బృందాలను ఏర్పాటు చేయగా.. మొత్తం ఆరు రాష్ట్రాల్లో గాలించారు. నగరంలోని బంగారం దుకాణం యజమానులు అప్రమత్తమయ్యారు. కొందరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటుచేసుకుంటున్నారు.
ఆరోగ్య కేంద్ర భవనం తలుపులు వేసుకొని వైద్యాధికారి నిరసన
కాచిగూడ, న్యూస్టుడే: తాను కనిపెట్టిన కరోనా మందును వినియోగంలోకి తేవాలని, అందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సహకరించడం లేదని ఆరోపిస్తూ యూపీఎస్సీ లోపలి నుంచి తలుపులు పెట్టుకుని వైద్యాధికారి నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిపించాలని డిమాండ్ చేశారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు కథనం ప్రకారం... ఇసామియాబజార్ యూపీఎస్సీ వైద్యాధికారి వసంత్కుమార్ సోమవారం సాయంత్రం భవనం లోపలి నుంచి గడియ పెట్టుకుని నిరసన చేపట్టారు. డీఎంహెచ్ఓ వెంకటి, ఎస్సై రవికుమార్, వైద్య, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని బయటకు రావాలని అభ్యర్థించారు. పోలీసులు, వైద్యాధికారులు అతన్ని బుజ్జగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?