logo

చెత్త సేకరణ ఆటో కింద పడి బాలుడు మృతి

చెత్త సేకరణ ఆటో కింద పడి బాలుడు దుర్మరణం పాలైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.

Published : 27 Mar 2023 18:54 IST

గౌతమ్‌ నగర్‌: చెత్త సేకరణ ఆటో కింద పడి బాలుడు దుర్మరణం పాలైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై హరి ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలి డివిజన్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన రజా (16నెలలు) తన ఇంటి ముందు ఆడుకున్నాడు. అక్కడే ఉన్న చెత్త సేకరణ ఆటో డ్రైవర్‌ వాహనాన్ని వెన్నకి తీసే క్రమంలో బాలుడు చక్రాల కింద పడి మృతిచెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని