logo

కక్ష సాధించేందుకే రాహుల్‌పై వేటు : కాంగ్రెస్‌

రాజకీయ కుట్రతోనే రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని కాంగ్రెస్‌ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌లు విమర్శించారు.

Published : 28 Mar 2023 02:49 IST

మాట్లాడుతున్న  రాములు నాయక్‌, మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌  

వికారాబాద్‌, న్యూస్‌టుడే: రాజకీయ కుట్రతోనే రాహుల్‌ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని కాంగ్రెస్‌ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌లు విమర్శించారు. సోమవారం రైల్వేస్టేషన్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  కక్ష సాధింపులో భాగంగానే అక్రమ రాజకీయానికి భాజపా తెర తీసిందన్నారు. భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌ గాంధీ చరిష్మా పెరిగిందని, దీన్ని గ్రహించిన భాజపా కుయుక్తులు పన్నుతోందన్నారు. కార్యక్రమంలో తాండూర్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జి రమేష్‌ మహరాజ్‌, వికారాబాద్‌ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, నాయకులు కిషన్‌నాయక్‌, రాజశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌ ముదిరాజ్‌, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని