హత్యా.. ఆత్మహత్యా?
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందింది. షాయినాయత్గంజ్ ఎస్సై లక్ష్మయ్య వివరాల ప్రకారం..
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
గోషామహల్, న్యూస్టుడే: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందింది. షాయినాయత్గంజ్ ఎస్సై లక్ష్మయ్య వివరాల ప్రకారం.. గోషామహల్ జోషివాడీకి చెందిన దిల్లూబుల్(27) స్క్రాప్ దుకాణంలో, భార్య ఆస్మిత ఇళ్లలో పనిచేస్తారు. వారికి పవిత్ర (5.5 ఏళ్లు) దిబేశ్(3), ఇషాన్(10 నెలలు) ఉన్నారు. వారు పిల్లలను ఇంట్లో వదిలేసి పనులకు వెళ్తుంటారు. దిల్లూబుల్ గురువారం ఉదయం పనికెళ్లగా భార్య పని నుంచి మధ్యాహ్నం తిరిగొచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఆమె మళ్లీ వెళ్లి రాత్రి 9 గంటలకు వచ్చింది. అప్పటికే గదిలో పవిత్ర మెడకు చున్నీ చుట్టి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. బాలికను ఎవరైనా హత్య చేశారా లేక ప్రమాదవశాత్తు ఆడుకుంటుండగా మెడకు చున్నీ చుట్టుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో నమ్మించి బాలిక హత్య
కాటేదాన్, న్యూస్టుడే: ప్రేమ పేరుతో బాలికకు దగ్గరైన ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హతమార్చాడు. మైలార్దేవుపల్లి ఎస్సై నాయుడు వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరామకాలనీలో ఉండే బాలిక(13)ను అదే ప్రాంతంలో నివసించే మహ్మద్ మోహిన్(30) మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు. అతడికి ఇంతకుముందే పెళ్లయింది. శివరాంపల్లి హసన్నగర్లో ఉంచాడు. విషయాన్ని బాలికకు తెలియనివ్వలేదు. ఇటీవల బాలిక మరొకరితో సెల్ఫోన్లో ప్రేమ మాటలు మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. దానిపై గురువారం రాత్రి ఆమెతో గొడవపడ్డాడు. ‘నీకు పెళ్లైంది కదా.. నీతో ఎలా ప్రేమ కొనసాగించాలని బాలిక నిలదీసింది. ఆయితే ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించి శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నరకు ఓ ఆటోలో వచ్చి పెళ్లి చేసుకుందామని బాలికను వెంటతీసుకెళ్లాడు. కాటేదాన్ స్పోర్ట్స్ స్టేడియం పక్కన నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమె తలపై బండరాయితో మోది దారుణంగా హతమార్చాడు. అనంతరం మైలార్దేవుపల్లి ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు.
ఇల్లు అద్దెకు తీసుకొని మోసం
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఫిర్యాదు
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: తన ఇంటిని అద్దెకు తీసుకొని మోసానికి పాల్పడ్డారంటూ విశ్రాంత ఐపీఎస్, త్రిపుర రాష్ట్ర మాజీ డీజీపీ కె.నాగరాజ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ 71లోని నవనిర్మాణ్నగర్లో నివసించే నాగరాజ్కు బంజారాహిల్స్ రోడ్ 2లోని హుడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో అతనితోపాటు కుమారుడి పేరు మీద స్థలం, ఇల్లు ఉన్నాయి. ఇంటిని హబీబ్నగర్ ప్రాంతంలో నివసించే కిశోర్కుమార్కు అయిదేళ్లపాటు లీజుకిచ్చారు. 2023 జనవరి 15తో ఈ గడువు ముగిసింది. అయితే ఇంటిని మెహదీపట్నం ఖాదిర్భాగ్కు చెందిన అబ్దుల్ రహీమ్, బేగంబజార్ బేదర్వాడికి చెందిన దామోదర్దాస్బజాజ్కు సబ్్ లీజుకు ఇచ్చినట్లు గుర్తించారు. ప్రహరీ నిర్మించి హద్దులు మార్చి ఓ గదిని ధ్వంసం చేసినట్లు గుర్తించారు. నవంబరు నుంచి కిరాయి సైతం చెల్లించలేదంటూ ఈనెల 27న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: యువతిపై ఓ డెలివరీ బాయ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఒబేదుల్లా ఖాన్ ఓ సంస్థలో డెలివరీ బాయ్. 8 నెలల క్రితం లక్డీకాపూల్లో ఓ యువతి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆహారాన్ని అందించేందుకు వెళ్లాడు. ఆన్లైనులో ఆమె డబ్బు చెల్లించగా ఆమె ఫోన్ నంబరు తీసుకొని స్నేహం చేశాడు. గురువారం యువతి హాస్టల్లో ఉండగా భోజనానికి వెళ్దామంటూ ద్విచక్రవాహనంపై జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలోని ఓయో గదికి తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం తాగి భోజనం చేసి అక్కడే నిద్రించారు. ఉదయం యువతి నిద్రలేచే సరికి వివస్త్రగా ఉండటం, చరవాణిలో కొన్ని వీడియోలను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేసింది. చరవాణిని నేలకేసి పగులగొట్టింది. శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఒబేదుల్లాఖాన్ను అరెస్ట్ చేశారు. చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.
పురుగుమందు కంపెనీ మోసం రూ.3 కోట్లు!
300 మంది వరకు బాధితులు
రాయదుర్గం: పురుగుమందు సంస్థ గోల్మాల్ కేసులో 300 మంది వరకు బాధితులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డీలర్లకు సరకు సరఫరా చేసినట్లు తప్పుడు ఇన్వాయిస్లు సమర్పించి ఫైనాన్షియల్ సంస్థ నుంచి డీలర్ల పేరిట భారీగా డబ్బులు కాజేసి బిచాణా ఎత్తేసిన ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సొల్యూషన్స్ (పురుగు మందుల) సంస్థ సీఈవో ఆదిత్య దేశ్పాండే, సహ వ్యవస్థాపకుడు ఆదిత్య కేఎల్పై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. రాయదుర్గం టీహబ్లోని కార్యాలయానికి అద్దె సైతం చెల్లించడం లేదట. ఐదారు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో డీలర్ పేరిట రూ.2.5-5 లక్షల వరకు ఫైనాన్స్ సంస్థ నుంచి సొత్తు దండుకున్నట్లు తెలుస్తోందని, రూ.3 కోట్ల వరకు కాజేసి ఉంటారని ఇన్స్పెక్టర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
[ 28-04-2024]
హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. -
భువనేశ్వర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
[ 28-04-2024]
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
[ 28-04-2024]
రిజర్వేషన్ల అంశంపై ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. -
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
[ 28-04-2024]
నగరంలో కాలేయ కొవ్వు (ఫ్యాటీ లివర్) సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం పెట్టగా.. ఇప్పటికీ కొన్ని కొనసాగిస్తున్నాయి. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
[ 28-04-2024]
ఈ చిత్రం చూశారా.. ఓయూ ఆర్ట్స్ కళాశాల అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే. ఇది కైరోలోని ఈజిప్ట్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్. దీని ఆర్కిటెక్ట్ మొనేసర్ ఎర్నెస్ట్ జాస్పర్. -
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
[ 28-04-2024]
తెలంగాణలో తొలిసారిగా ఓ తమిళపార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్లు నామినేషన్లు దాఖలు చేశారు. -
ఎండకు తాళలేం.. ఎన్నికల విధులకు వెళ్లలేం
[ 28-04-2024]
ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం. -
సాధించేందుకు పట్టు.. తెలిసిందే లోగుట్టు
[ 28-04-2024]
మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు. -
నాలుగు స్థానాలు.. బరిలో 168 మంది
[ 28-04-2024]
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114మంది నామపత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకూ పరిశీలన కొనసాగింది. -
బెట్టింగ్ కోసం వృద్ధురాలిని హతమార్చిన యువకుడు
[ 28-04-2024]
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడిన యువకుడు.. వృద్ధురాలిని హతమార్చి పరారయ్యాడు. చివరికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
గంజాయి తాగొచ్చి వేధిస్తున్నాడని తమ్ముడి హత్య
[ 28-04-2024]
మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు. -
నాలా.. సాఫీగా సాగేలా
[ 28-04-2024]
నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ వేగం పెంచింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేయగా.. కమిషనర్ రోనాల్డ్రాస్ భరోసా ఇవ్వడంతో నెలరోజులుగా పనులు ఊపందుకున్నాయి. -
ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..
[ 28-04-2024]
నగరంలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు. -
యువ వాటరూ.. నీదే జోరు
[ 28-04-2024]
యువ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్న నాయకులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్లలోపు వారే ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకొంటే గెలుపు ఖాయమనే ధీమాలో నేతలున్నారు. -
అసత్య ప్రచారాలకు ‘మిత్ వర్సెస్ రియాలిటీ’తో చెక్
[ 28-04-2024]
అసత్య ప్రచారాలపై నియంత్రణ లేకుండా పోతోంది.. ఫలితంగా వాస్తవ సమాచారం దారి తప్పుతోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా నిత్యం వివిధ అంశాలపై కోకొల్లలుగా వార్తలు, వదంతులు పుట్టుకొస్తున్నాయి. -
ఆలిన్లో అదుపులోకి అగ్నికీలలు
[ 28-04-2024]
ఆలిన్ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చల్లారక పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. 24 గంటలు దాటినా మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో అటుగా ఉండే పరిశ్రమలు, కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
డార్మెటరీలో దోస్తీ.. చోరీలతో మస్తీ
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మెటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
నగరవాసి.. నీటికి అల్లాడి
[ 28-04-2024]
వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. -
బామ్మర్దికి వీడియోకాల్.. ఆపై బలవన్మరణం
[ 28-04-2024]
బామ్మర్దికి వీడియోకాల్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన శనివారం కీసర మండలం చీర్యాలలో జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేశ్యాదవ్(38)కు 12 ఏళ్ల క్రితం కీసర శివాజీ నగర్ కాలనీకి చెందిన భవానీతో వివాహమైంది. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 28-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గెలుపు బాధ్యత మీదే!
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు. ఉదయం మొదలు రాత్రి వరకు తమ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..