logo

దేశ రక్షణ, అభివృద్ధి భాజపాతోనే సాధ్యం

దేశరక్షణ, సమగ్ర అభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 30 Mar 2024 02:21 IST

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

షాద్‌నగర్‌ న్యూటౌన్‌, న్యూస్‌టుడే: దేశరక్షణ, సమగ్ర అభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు భాజపాలో చేరిక సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ఆయన విచ్చేశారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణ సమక్షంలో పలు గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది ఇతర పార్టీల కార్యకర్తలకు కూడా ఆయన కండువాలను కప్పి భాజపాలోకి ఆహ్వానించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి దిశలో తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారన్నారు. డీకే.అరుణ మాట్లాడుతూ.. నాడు భారాస ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడితే నేడు కాంగ్రెస్‌ పార్టీ ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తోందని ఆమె ఆరోపించారు. విజయభాస్కర్‌, మనోహర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి, మోహన్‌సింగ్‌, లష్కర్‌నాయక్‌, ఇస్నాతి శ్రీనివాస్‌, రుషికేష్‌, అనీల్‌, శ్యాంసుందర్‌రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని