వ్యూహ రచన.. గెలుపు యోచన
చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో గెలుపు బావుటా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి.
చేవెళ్లలో ప్రధాన రాజకీయ పార్టీల ఎత్తులకు పైఎత్తులు
చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో గెలుపు బావుటా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యనాయకులతో సమన్వయ కమిటీలు, మండలాలు, గ్రామాల్లో ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రధాన పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అమలు చేసిన, చేయనున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించాలని కాంగ్రెస్, ఎన్నికల తరుణంలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎండగట్టాలని భారాస, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మోదీ ప్రభుత్వం అందిస్తున్న సుస్థిర పాలన తదితర అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భాజపా భావిస్తున్నాయి.
న్యూస్టుడే, వికారాబాద్.
శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు భారాస..
రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో భారాస కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ లోపే లోక్సభ ఎన్నికలు రావడం, ఓటమి భారం నుంచి శ్రేణులు ఇంకా కోలుకోకపోవడంతో వారిలో ఆత్మవిశ్వాసం నింపే దిశగా అధిష్ఠానం చర్యలు చేపట్టింది. మేమున్నామంటూ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి భరోసా నింపుతోంది. ఐదేళ్ల అనంతరం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, అధైర్యపడవద్దని నమ్మకం కలిగిస్తోంది. జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్లో చేరి అభ్యర్థులుగా పోటీ చేయడం వంటి పరిణామాలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారం కోల్పోవడం, ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు లేకపోవడం వంటి అంశాలు ప్రతికూలంగా మారనున్నాయి. జిల్లాలో నాయకులను సమన్వయం చేసే బాధ్యతను మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి అప్పగించినట్లు తెలిసింది.
ఆధిక్యత చాటేందుకు కాంగ్రెస్
విజయమే లక్ష్యంగా జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో ఆధిక్యత చాటేలా కాంగ్రెస్ కార్యాచరణ చేపట్టింది. ఈ సందర్భంగా పరపతి, పలుకుబడి ఉన్న నేతలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో వికారాబాద్లో 26,500, పరిగిలో 24,300 కాంగ్రెస్కు ఆధిక్యత వచ్చింది. తాండూరులో మాత్రం భారాసకు 1,250 ఓట్ల స్వల్ప ఆధిక్యత వచ్చింది. ఇతర పార్టీల్లోని కీలక నాయకులపై హస్తం పార్టీ దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్లో చేరేందుకు ఈ ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని పలువురు ప్రతిపక్ష నాయకులు పార్టీ మారేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను చేర్చుకుంటున్నారు.
భాజపాలో సమరోత్సాహం..
కాషాయ జెండా ఎగురవేయాలన్న సమరోత్సాహంతో అవసరమైన వ్యూహానికి భాజపా రూపకల్పన చేస్తోంది. భారీ సభలతో సంబంధం లేకుండా, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రజల మధ్యే ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. భారాస ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాండూరు నియోజకవర్గంలో భారాసకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ప్రధాని మోదీ చరిష్మాతో పాటు, కేంద్ర ప్రభుత్వ పని తీరును ప్రచారాస్త్రాలుగా సంధిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అదృశ్య మిత్రుల సహకారం కలిసి వచ్చే అంశంగా భాజపా భావిస్తోంది.
జిల్లాలో మొత్తం ఓటర్లు 9,79,155
మార్చి 15న జారీ చేసిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు 9,79,166 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 4,83,354 మంది ఉండగా, స్త్రీలు 4,95,779, ట్రాన్స్జెండర్లు 33 మంది ఉన్నారు. వీటిలో కొడంగల్ నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఈ ఓట్లను మినహాయిస్తే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఓట్లు 7,38,311 ఉన్నాయి. వీరిలో పురుషులు 3,64,908, స్త్రీలు 3,73,375 మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
[ 28-04-2024]
నగరంలో కాలేయ కొవ్వు (ఫ్యాటీ లివర్) సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం పెట్టగా.. ఇప్పటికీ కొన్ని కొనసాగిస్తున్నాయి. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
[ 28-04-2024]
ఈ చిత్రం చూశారా.. ఓయూ ఆర్ట్స్ కళాశాల అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే. ఇది కైరోలోని ఈజిప్ట్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్. దీని ఆర్కిటెక్ట్ మొనేసర్ ఎర్నెస్ట్ జాస్పర్. -
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
[ 28-04-2024]
తెలంగాణలో తొలిసారిగా ఓ తమిళపార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్లు నామినేషన్లు దాఖలు చేశారు. -
ఎండకు తాళలేం.. ఎన్నికల విధులకు వెళ్లలేం
[ 28-04-2024]
ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం. -
సాధించేందుకు పట్టు.. తెలిసిందే లోగుట్టు
[ 28-04-2024]
మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు. -
నాలుగు స్థానాలు.. బరిలో 168 మంది
[ 28-04-2024]
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114మంది నామపత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకూ పరిశీలన కొనసాగింది. -
బెట్టింగ్ కోసం వృద్ధురాలిని హతమార్చిన యువకుడు
[ 28-04-2024]
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడిన యువకుడు.. వృద్ధురాలిని హతమార్చి పరారయ్యాడు. చివరికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
గంజాయి తాగొచ్చి వేధిస్తున్నాడని తమ్ముడి హత్య
[ 28-04-2024]
మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు. -
నాలా.. సాఫీగా సాగేలా
[ 28-04-2024]
నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ వేగం పెంచింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేయగా.. కమిషనర్ రోనాల్డ్రాస్ భరోసా ఇవ్వడంతో నెలరోజులుగా పనులు ఊపందుకున్నాయి. -
ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..
[ 28-04-2024]
నగరంలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు. -
యువ వాటరూ.. నీదే జోరు
[ 28-04-2024]
యువ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్న నాయకులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్లలోపు వారే ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకొంటే గెలుపు ఖాయమనే ధీమాలో నేతలున్నారు. -
అసత్య ప్రచారాలకు ‘మిత్ వర్సెస్ రియాలిటీ’తో చెక్
[ 28-04-2024]
అసత్య ప్రచారాలపై నియంత్రణ లేకుండా పోతోంది.. ఫలితంగా వాస్తవ సమాచారం దారి తప్పుతోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా నిత్యం వివిధ అంశాలపై కోకొల్లలుగా వార్తలు, వదంతులు పుట్టుకొస్తున్నాయి. -
ఆలిన్లో అదుపులోకి అగ్నికీలలు
[ 28-04-2024]
ఆలిన్ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చల్లారక పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. 24 గంటలు దాటినా మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో అటుగా ఉండే పరిశ్రమలు, కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
డార్మెటరీలో దోస్తీ.. చోరీలతో మస్తీ
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మెటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
నగరవాసి.. నీటికి అల్లాడి
[ 28-04-2024]
వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. -
బామ్మర్దికి వీడియోకాల్.. ఆపై బలవన్మరణం
[ 28-04-2024]
బామ్మర్దికి వీడియోకాల్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన శనివారం కీసర మండలం చీర్యాలలో జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేశ్యాదవ్(38)కు 12 ఏళ్ల క్రితం కీసర శివాజీ నగర్ కాలనీకి చెందిన భవానీతో వివాహమైంది. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 28-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గెలుపు బాధ్యత మీదే!
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు. ఉదయం మొదలు రాత్రి వరకు తమ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు