అభివృద్ధి చేసేలోపు.. నదిని మూసేద్దామని!
మూసీ అభివృద్ధికి ఓ వైపున పనులు వేగంగా జరుగుతుంటే.. అంతే జోరుగా నది ఆక్రమణ కొనసాగుతోంది.
మూసీ పొడవునా జోరందుకున్న ఆక్రమణలు
నిర్మాణ వ్యర్థాలతో నింపి షెడ్లు, ప్రహరీల నిర్మాణం
ఈనాడు, హైదరాబాద్, కార్వాన్, న్యూస్టుడే
దరియాబాగ్ వద్ద నదిని నిర్మాణ వ్యర్థాలతో నింపేశారిలా..
మూసీ అభివృద్ధికి ఓ వైపున పనులు వేగంగా జరుగుతుంటే.. అంతే జోరుగా నది ఆక్రమణ కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతంపై పలువురు నేతలు, స్థానికులు కన్నేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని సర్కారు ప్రకటించడంతో.. ఎలాగైనా చేజిక్కించుకునేందుకు కబ్జాకోరులు యత్నిస్తున్నారు. నదీ గర్భాన్ని నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. ఎకరాల కొద్దీ భూమిని ప్లాట్లుగా మార్చుతున్నారు. వారిని కట్టడి చేయకపోతే.. అంచులను మట్టితో నింపేస్తూ నదిని పిల్ల కాలువలా మార్చేస్తారు. అత్తాపూర్ నుంచి నాగోల్ మధ్య జరుగుతోన్న ఆక్రమణలపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది..
అత్తాపూర్లో..
నార్సింగి నుంచి బాపూ ఘాట్ వరకు మూసీ ఆక్రమణలు పెద్దగా కనిపించవు. అత్తాపూర్ నుంచి కార్వాన్, జియాగూడ, పురానా పూల్ వరకు కొంత కాలంగా ఆక్రమణలు జోరందుకున్నాయి. అత్తాపూర్ మూసీ వంతెన ఎగువన కూడా రాత్రికి రాత్రి నదిలో కాలనీలు పుట్టుకొస్తున్నాయి. పురానా పూల్ నుంచి గుడిమల్కాపూర్ను కలుపుతూ మూసీ ఒడ్డున 100అడుగుల రోడ్డు పనులు పూర్తి కాలేదు.నది అంచునే రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక జరిగింది.. ఇంతలోనే ఆ రోడ్డు నుంచి వంద మీటర్ల లోపలివరకు కాలనీలు పుట్టుకొచ్చాయి. దరియాబాగ్ గిర్కపల్లి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గణేశ్ ఘాట్ వరకు, మొఘల్నగర్ వద్ద మూసీని ఇటీవల పెద్దఎత్తున పూడ్చారు.షెడ్లు నిర్మించి పార్కింగ్ కేంద్రంగా మార్చగా, రెవెన్యూ అధికారులు తొలగించారు. సదరు వ్యక్తి మళ్లీ ప్రహరీ నిర్మించాడు.
చాదర్ఘాట్ పరిసరాల్లో..
ఇమ్లిబన్ బస్టాండ్ నుంచి చాదర్ఘాట్ వరకు నదికి ఇరువైపులా రక్షణ గోడ ఉంది. గోడ లోపల వంద మీటర్ల వరకు మట్టి పోస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నిలుపుతూ స్థలాన్ని కబ్జాలో పెట్టుకున్నారు. మెకానిక్ షెడ్లు నడుపుతున్నారు. ముసారాంబాగ్ వంతెన వరకు ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.
రెండు పడక గదుల ఇళ్లు ఇస్తారని..
మూసీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కొత్తసర్కారు నిర్ణయించింది. ఆక్రమణలు తొలగించి, నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు కట్టేందుకు లేదా కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మూసీ అభివృద్ధి జరిగితే రెండు పడక గదుల ఇల్లు వస్తుందని, లేదంటే కొన్న ఇల్లు అలాగే ఉండిపోతుందని వారంతా భావిస్తున్నారు. ఈ వైఖరితో ఆక్రమణల తొలగింపు క్లిష్టతరం కానుందని, నదిలో పోసిన మట్టి తొలగింపును వెంటనే ప్రారంభించాలని, కంచె నిర్మించాలని నిపుణులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న.. తమ్ముడి భార్య అమ్మమ్మ ఇంటికి నిప్పంటించిన ఘటన నగరంలో ఐదో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
[ 28-04-2024]
ఈ చిత్రం చూశారా.. ఓయూ ఆర్ట్స్ కళాశాల అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే. ఇది కైరోలోని ఈజిప్ట్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్. దీని ఆర్కిటెక్ట్ మొనేసర్ ఎర్నెస్ట్ జాస్పర్. -
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
[ 28-04-2024]
తెలంగాణలో తొలిసారిగా ఓ తమిళపార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ తరఫున హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్లు నామినేషన్లు దాఖలు చేశారు. -
ఎండకు తాళలేం.. ఎన్నికల విధులకు వెళ్లలేం
[ 28-04-2024]
ఎన్నికల విధుల పట్ల కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపట్లేదు. రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుతున్నారు. నిత్యం సుమారు వంద నుంచి 200ల మంది ఉద్యోగులు లేఖలు ఇస్తుండటమే అందుకు నిదర్శనం. -
సాధించేందుకు పట్టు.. తెలిసిందే లోగుట్టు
[ 28-04-2024]
మొన్నటి వరకు ఆ ముగ్గురు నేతలు భారాసలో కీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు రాజకీయంగా సన్నిహితంగా మెలిగినవారే. ఇప్పుడు అదే నేతలు కాంగ్రెస్లో చేరి రాజధాని పరిధిలోని మూడు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులుగా బరిలో నిలిచారు. -
నాలుగు స్థానాలు.. బరిలో 168 మంది
[ 28-04-2024]
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114మంది నామపత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకూ పరిశీలన కొనసాగింది. -
కాలేయానికి.. అధిక కొవ్వు ముప్పు
[ 28-04-2024]
నగరంలో కాలేయ కొవ్వు (ఫ్యాటీ లివర్) సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ తర్వాత చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం పెట్టగా.. ఇప్పటికీ కొన్ని కొనసాగిస్తున్నాయి. -
బెట్టింగ్ కోసం వృద్ధురాలిని హతమార్చిన యువకుడు
[ 28-04-2024]
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడిన యువకుడు.. వృద్ధురాలిని హతమార్చి పరారయ్యాడు. చివరికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. -
గంజాయి తాగొచ్చి వేధిస్తున్నాడని తమ్ముడి హత్య
[ 28-04-2024]
మద్యం, గంజాయికి బానిసయ్యాడు. మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం, ఇంట్లోని డబ్బు, వస్తువులు తీసుకెళ్తున్న తమ్మున్ని అన్న హత్య చేశాడు. -
నాలా.. సాఫీగా సాగేలా
[ 28-04-2024]
నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ వేగం పెంచింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో గుత్తేదారులు పనులు ఆపేయగా.. కమిషనర్ రోనాల్డ్రాస్ భరోసా ఇవ్వడంతో నెలరోజులుగా పనులు ఊపందుకున్నాయి. -
ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..
[ 28-04-2024]
నగరంలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు. -
యువ వాటరూ.. నీదే జోరు
[ 28-04-2024]
యువ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గెలుపు తథ్యమని భావిస్తున్న నాయకులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్లలోపు వారే ఉండటంతో వీరిని తమవైపు తిప్పుకొంటే గెలుపు ఖాయమనే ధీమాలో నేతలున్నారు. -
అసత్య ప్రచారాలకు ‘మిత్ వర్సెస్ రియాలిటీ’తో చెక్
[ 28-04-2024]
అసత్య ప్రచారాలపై నియంత్రణ లేకుండా పోతోంది.. ఫలితంగా వాస్తవ సమాచారం దారి తప్పుతోంది. సామాజిక మాధ్యమాలు వేదికగా నిత్యం వివిధ అంశాలపై కోకొల్లలుగా వార్తలు, వదంతులు పుట్టుకొస్తున్నాయి. -
ఆలిన్లో అదుపులోకి అగ్నికీలలు
[ 28-04-2024]
ఆలిన్ ఫార్మా పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు చల్లారక పోవడంతో భారీ నష్టం వాటిల్లింది. 24 గంటలు దాటినా మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో అటుగా ఉండే పరిశ్రమలు, కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
డార్మెటరీలో దోస్తీ.. చోరీలతో మస్తీ
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మెటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
నగరవాసి.. నీటికి అల్లాడి
[ 28-04-2024]
వేసవికి భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు, జలమండలి సరఫరా చేసే నీటి పరిమాణం సైతం తగ్గుతోంది. అవసరాలకు సరిపడా నీరు లభించక అల్లాడుతున్న జనాన్ని ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. -
బామ్మర్దికి వీడియోకాల్.. ఆపై బలవన్మరణం
[ 28-04-2024]
బామ్మర్దికి వీడియోకాల్ చేసి ఓ వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన శనివారం కీసర మండలం చీర్యాలలో జరిగింది. సీఐ వెంకటయ్య వివరాల ప్రకారం. బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన పర్వతం మహేశ్యాదవ్(38)కు 12 ఏళ్ల క్రితం కీసర శివాజీ నగర్ కాలనీకి చెందిన భవానీతో వివాహమైంది. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 28-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గెలుపు బాధ్యత మీదే!
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతలు ఎన్నికల ప్రచారానికి మరింత పదును పెడుతున్నారు. ఉదయం మొదలు రాత్రి వరకు తమ పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు