logo

శంషాబాద్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది.

Published : 19 Apr 2024 03:05 IST

పురస్కారం అందుకుంటున్న ప్రదీప్‌ ఫణికర్‌

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. జర్మనీలో ఇటీవల నిర్వహించిన ప్యాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌పో-2024 కార్యక్రమంలో ఆర్జీఐఏకు బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ ఇన్‌ ఇండియా అండ్‌ దక్షిణాసియా అవార్డు వరించింది. ఈ మేరకు స్కైట్రాక్స్‌ ప్రతినిధుల చేతుల మీదుగా ఆర్జీఐఏ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ పురస్కారం అందుకున్నారు. సంస్థ ప్రతినిధులు కస్టమర్‌ హెల్ప్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ సెక్యూరిటీ, వాణిజ్య సముదాయాలు, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ కేంద్రాల సేవల్లో సాంకేతికతను పరిశీలించి ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని