logo

‘యాదాద్రి కట్టినా.. రాజకీయాలకు వాడుకోలేదు’

దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం తెల్లాపూర్‌ ఎంఐజీ కాలనీలో మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచార సభ నిర్వహించారు.

Updated : 10 May 2024 05:41 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

రామచంద్రాపురం రూరల్‌, న్యూస్‌టుడే: దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం తెల్లాపూర్‌ ఎంఐజీ కాలనీలో మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచార సభ నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో నిర్మించనంత పెద్దగా మాజీ సీఎం కేసీఆర్‌ రూ.వెయ్యి కోట్లతో యాదాద్రి ఆలయాన్ని నిర్మించినా ఏనాడూ రాజకీయాలకు దేవుడిని వాడలేదన్నారు. పుష్కలంగా వర్షాలు పడి పాడిపంటలతో రాష్ట్రం అలరారిందని, భగవంతుడు సహకారం అందించాడన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకొచ్చాక రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిందన్నారు. రాత్రి 9.52 గంటలకు స్టేజీ ఎక్కి ఏడు నిమిషాలపాటు ప్రసంగించి 9.59 గంటలకు ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మున్సిపల్‌ ఛైర్మన్‌ లలిత తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని