మేం ఓటేస్తాం.. మరి మీరు..
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేధావులు, ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈసారి ఇంటి వద్దే ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించారు.
నేటి తరానికి స్ఫూరిదాయకంగా నిలుస్తున్న వృద్ధులు
న్యూస్టుడే, వికారాబాద్ కలెక్టరేట్
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేధావులు, ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈసారి ఇంటి వద్దే ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. దీనిని కొందరు వినియోగించుకోగా మరి కొందరు ఓపిక తెచ్చుకుని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేస్తామని చెపుతున్నారు. ఇలాంటి తరుణంలో కొత్తగా ఓటు పొందిన వారు, ఓటు వేయడానికి ఆసక్తిచూపని వారు సైతం ముందుకు కదలాల్సిన అవసరాన్ని నొక్కిచొబుతున్నారు. వికారాబాద్ పట్టణానికి చెందిన వృద్ధులు ఓటు వేయాల్సిన అవసరాన్ని, గత ఎన్నికలు.. ఇప్పటి ఎన్నికలకు గల తేడాలు, నేతల ప్రచారం, వ్యయం తదితర అంశాలను ‘న్యూస్టుడే’ తో పంచుకున్నారు.
6 కి.మీ నడిచి వెళ్లాను
- పి.రాంరెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, కన్యాలాల్బాగ్, వికారాబాద్.
నాకిప్పుడు 90ఏళ్లు. నేను 1957 ఎన్నికల నుంచి ఓటు వేస్తున్నా. అప్పడు నాయకులు, ప్రజలు అనే తేడాలు ఉండేవి కావు. సాదాసీదాగా ఉండేవారు. మా సొంత గ్రామం ధారూర్ మండలం ఎబ్బనూరులో పోలింగ్ బూత్ లేదు. ఓటు వేయడానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న అల్లీపూర్కు నడిచి వెళ్లాం. ఇప్పుడు చదువుకున్న వారిలో కొందరు ఓటేసేందుకు చొరవ చూపడంలేదు. అందరూ ఓటేయాలి.
అభివృద్ధి చేసే వారికే వేయాలి
- దావల్గారి అనంతమ్మ, కొత్తగడి, వికారాబాద్.
నేను తొలిసారిగా ఇంటివద్ద ఓటు వేశా.నాకు ఇప్పుడు 98 ఏళ్లు. నాకు 5గురు కొడుకులు. అందరూ ప్రయోజకులయ్యారు. ఇప్పటికి అన్ని పనులు నేనే చేసుకుంటాను. గట్టి పదార్థాలను కూడా తింటాను. ఎవరు మంచి నాయకుడు, ఎవరితో అభివృద్ధి జరుగుతుంది అని చూసి నేటి యువత ఓటేయాలి.
ఒకటికి పదిసార్లు ఆలోచించాలి
- వై.అడివయ్య స్వామి, రిటైర్డ్ పోస్టుమాస్టర్, ఎబ్బనూర్.
ఎన్నికల ప్రారంభమైనప్పటి నుంచి ఓటు వేస్తున్నా. నాకిప్పుడు 91 సంవత్సరాలు. మా చిన్నతనంలో గ్రామలో పోలింగ్ బూత్ కూడా లేదు. నాలుగైదు కిలో మీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్లి ఓటు వేశాం. ఓటును వృథా చేయకుండా ఒకటికి పది సార్లు ఆలోచించి మంచి వ్యక్తికి వేయాలి.
ప్రలోభాలకు లొంగొద్దు
- బూచన్పల్లి రాజయ్య, వ్యాపారి, వికారాబాద్.
నా వయసు 86 సంవత్సరాలు. నేటి ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయింది. అధికారులు, నేతల్లో అవినీతి పెరిగింది. యువ ఓటర్లు ప్రలోభాలకు లొంగకూడదు. అభ్యర్థి వ్యక్తిగత వివరాలను లోతుగా తెలుసుకుని పరిశీలించి ఓటు వేయాలి.
రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం
- శివలీల, దోమ
దోమ, న్యూస్టుడే: ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఒక్కసారికూడా వదలకుండా సద్వినియోగం చేశా. నాకిప్పుడు 92 సంవత్సరాలు. ఓటు వేయకపోతే గుర్తింపు ఉండదు. మనకు చేయాల్సిన పనులు నేతలు చేయరు. మంచి వారిని ఎన్నుకోవడానికి రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే తప్ప దేశం బాగు పడదు. ఇది ప్రతి మనిషి అంతరాత్మకు తెలిసిన అంశం. కొందరు చెడ్డవారిని కూడా మంచి వారుగా భావించి ఓటేస్తారు. ఇది సరికాదు. మంచివారికే ఓటు వేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 20-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
[ 20-05-2024]
కిర్గిజ్స్థాన్ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్లోని భారత రాయబారితో మాట్లాడారు. -
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
[ 20-05-2024]
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీ నాటికి ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
[ 20-05-2024]
అబిడ్స్లోని శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు మోసం చేసింది. -
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
[ 20-05-2024]
చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్
[ 20-05-2024]
Telangana ECET Results: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TG ECET Results) ఫలితాలు విడుదలయ్యాయి. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!