లబ్ధిదారులే గెలిపిస్తారు
‘హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్లు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారే తప్ప..
హైదరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్యాదవ్
ఇంటర్వ్యూ
‘హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్లు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారే తప్ప.. ఏం అభివృద్ధి చేశారంటే నోరు మెదపరు. భారాస హయాంలో తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు ఇక్కడి ప్రజలకు అందాయి. అలా 5.6 లక్షల మంది ఓటర్లు మా వెంటే ఉన్నారు.’’ అని హైదరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్యాదవ్ తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి, ఇతర అంశాలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.
ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది.. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?
గత పదేళ్ల భారాస పాలనలో అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. హైదరాబాద్ లోక్సభ స్థానంలోనే 5.6 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వారి పాలన ఎలా ఉంటుందో ప్రజలు గమనించారు. రెండింటినీ బేరీజు వేసుకొని కేసీఆర్ ప్రభుత్వమే మేలు అనే నిర్ణయానికి వచ్చారు.
మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?
మా ప్రధాన ప్రత్యర్థి ఎంఐఎం. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించింది. భాజపా సైతం పరోక్షంగా సహకరిస్తోంది. దేశవ్యాప్తంగా భాజపాకు ‘బీ’ టీమ్గా ఎంఐఎం పనిచేసింది. అందుకు ప్రతిగా భాజపా తమ అభ్యర్థిగా మాధవీలతను నిలబెట్టి ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. మసీదులకు విల్లు ఎక్కుపెట్టినట్టు రెచ్చగొడుతూ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తుండటంతో పరోక్షంగా ఎవరికి లాభం చేకూరుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా కాంగ్రెస్, భాజపా రెండూ ఎంఐఎంకు మద్దతుగా ఉన్నాయి. భారాస, ఎంఐఎంకు మధ్య మాత్రమే పోటీ ఉంది.
మీరు గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు?
ఎంఐఎం ఏలుబడిలో సరైన రోడ్లు లేవు. మౌలిక సదుపాయాలేవీ కల్పించలేదు. పార్కింగ్ కోసం నిత్యం నరకమే. అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లుంది అంటూ గుండె మీద చేయి వేసుకొని మరీ ఓట్లు అడగగలుగుతున్నాను. అసదుద్దీన్ చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగిన దాఖలాలున్నాయా? ఓటర్లకు ఇదే చెబుతున్నాం. ఎంపీగా గెలిచిన తర్వాత విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తా.
ప్రత్యర్థుల బలాలు, బలహీనతలు ఏంటి?
బడుగు, బలహీనవర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలోనే. బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. హైదరాబాద్ ప్రజలకు నేను కొత్త కాదు. పైగా 5.6లక్షల మంది లబ్ధిదారులు మా వెంట ఉన్నారు. కొన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నాను. భాగ్యనగర్ ఉత్సవ సమితి తరఫున చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. మైనారిటీల్లో సింహభాగం ఎంఐఎం వైపు ఉన్నా భారాస పాలనలో 20 శాతం ఓటు బ్యాంకును పెంచుకోగలిగాము. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మా వైపు మళ్లారు. ఈ లెక్క ప్రకారం 50 వేల నుంచి లక్ష మెజారిటీతో విజయం సాధిస్తాననే నమ్మకముంది. భాజపా అభ్యర్థి మాధవీలతకు బీఫాం ఇచ్చాక పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఆమె ఎన్నికల కోసం నటించడానికి వచ్చిన ఓ యాక్టర్ మాత్రమే. ఎన్నికలు అయ్యాక వెళ్లిపోతారు. అభివృద్ధిపై అసదుద్దీన్ను ప్రశ్నించడం మానేసి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ భారాసకు పడే ఓట్లకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
- ఆశపడి మోసపోయామని పాదయాత్రలకు వెళ్లినప్పుడు ప్రజలు నాతో అంటున్నారు. రూ.4 వేలు, తులం బంగారం, స్కూటీలు, నెలకు రూ.2,500 రాలేదని వాపోతున్నారు.
- ఇక్కడ నిధుల కొరత లేదు. నాయకత్వ లోపమే ఉంది. వారికి కావాల్సింది మతతత్వమే. మేము మానవత్వం కావాలి అంటున్నాం.
- పాతబస్తీలో 40 ఏళ్లుగా ఎంఐఎం గెలుస్తున్నా అభివృద్ధి చేయలేదు. ప్రజల్లో జీవితాల్లో మార్పు రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 20-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
[ 20-05-2024]
కిర్గిజ్స్థాన్ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్లోని భారత రాయబారితో మాట్లాడారు. -
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
[ 20-05-2024]
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీ నాటికి ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
[ 20-05-2024]
అబిడ్స్లోని శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు మోసం చేసింది. -
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
[ 20-05-2024]
చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్
[ 20-05-2024]
Telangana ECET Results: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TG ECET Results) ఫలితాలు విడుదలయ్యాయి. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..