మువ్వన్నెల రెపరెపలు
జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లా కలెక్టరేట్ సహ పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థల్లో నిరాడంబరంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా
నిరాడంబరంగా గణతంత్ర దినోత్సవం
కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాకు వందనం చేస్తున్న జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్, అధికారులు
కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లా కలెక్టరేట్ సహ పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థల్లో నిరాడంబరంగా గణతంత్ర వేడుకలను నిర్వహించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ వందనం స్వీకరించారు. అంతకు ముందు గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, అదనపు పాలనాధికారులు జీవీ శ్యామ్ప్రసాద్ లాల్, గరిమ అగ్రవాల్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
* తన క్యాంపు కార్యాలయంతో పాటు కరీంనగర్ క్లబ్లో జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అదనపు పాలనాధికారి జీవీ శ్యామ్ప్రసాద్ లాల్ తన క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు.
కరీంనగర్ కోర్టు ఆవరణలో
కరీంనగర్ న్యాయవార్తలు: జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.జి.ప్రియదర్శిని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైకోర్టు నిబంధనల ప్రకారం పతాకావిష్కరణ జరపగా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ కార్యవర్గసభ్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పివి రాజ్కుమార్, గౌరు రాజిరెడ్డి, అదనపు ప్రభుత్వ న్యాయవాది పూరెల్ల రాములు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది కొద్ది సంఖ్యలో పాల్గొన్నారు.
పరేడ్మైదానంలో జరిగిన వేడుకల్లో సీపీ సత్యనారాయణ, పోలీసు అధికారులు
జిల్లా సహకార బ్యాంకులో..
కరీంనగర్ పట్టణం: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 73వ గణతంత్ర వేడుకలు జరిగాయి. నాఫ్స్కాబ్, టిస్కాబ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై బ్యాంకు సిబ్బంది, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న మూడేళ్ల నుంచి అయిదేండ్లలో ప్రస్తుతమున్న 67 శాఖల నుంచి వంద శాఖలకు పెంచడానికి కార్యాచరణ చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు సీఈవో ఎన్.సత్యనారాయణ రావు, పింగిలి రమేష్, ఉపాధ్యక్షుడు స్వామిరెడ్డి, పాలకవర్గ సభ్యులు బి.గోపాల్రావు, పి.ప్రభాకర్రెడ్డి, ఎండీ.రియాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
* కరీంనగర్ జిల్లా వ్యవసాయ పరిశోధన క్షేత్రం అధికారి, శాస్త్రవేత్త మంజులత జాతీయ పతాకం ఎగుర వేశారు. కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
జాతీయ గీతం ఆలపిస్తున్న టెస్కాబ్, జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు, కార్యాలయ ఉద్యోగులు
కమిషనరేట్లో..
కరీంనగర్ నేరవార్తలు : కరీంనగర్ కమిషనరేట్ ఆవరణలోని పరేడ్ మైదానంలోని జాతీయ జెండాను పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆవిష్కరించి గౌరవందనం చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు ఎస్.శ్రీనివాస్, జి.చంద్రమోహన్, ఏసీపీలు విజయసారథి, శ్రీనివాస్, మదన్లాల్, ప్రతాప్ పాల్గొన్నారు.
పిటిసిలో...రాంనగర్లోని పోలీస్ శిక్షణ కళాశాలలో ప్రిన్సిపల్ వి.సునీతమోహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వైస్ ప్రిన్సిపల్ రవి, డీఎస్పీలు శ్రీనివాసులు, కాశయ్య, గంగాధర్, ఆర్ఐలు తిముఖ్, శ్రీనివాస్, సంపత్ ఉన్నారు.
* కరీంనగర్ కమిషనరేట్ పోలీసు శిక్షణ కేంద్రంలో జాతీయ జెండాను ఏసీపీ నాగేందర్ ఆవ్కిరించారు. ఆర్ఐ కిరణ్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటికి ఓటర్ చీటీల పంపిణీ
[ 05-05-2024]
నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇవ్వగా, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది కేటాయింపులు పూర్తి చేశారు. -
ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి
[ 05-05-2024]
పోలింగ్ రోజున దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, దివ్యాంగులకు చేపట్టాల్సిన ప్రత్యేక ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. -
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తారా.. ఇవ్వరా?
[ 05-05-2024]
-
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
[ 05-05-2024]
రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజీపేట, మర్రిపల్లి, నాగాయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బరిలో 42 మంది.. 3 బ్యాలెట్ యూనిట్లు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్(బీయూ), కంట్రోల్ యూనిట్(సీయూ), వీవీప్యాట్ (ఓటర్ వెరీఫైడ్ పేపర్) యంత్రాలను వినియోగించనున్నారు. -
ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలి
[ 05-05-2024]
ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగంలో గోప్యత పాటించాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తెలిపారు. శనివారం పలుప్రాంతాల్లో జరుగుతున్న ఇంటివద్ద ఓటింగ్ను పరిశీలించారు. -
జగిత్యాలలో నేడు కేసీఆర్ రోడ్షో
[ 05-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్షో నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్టాండ్ నుంచి కొత్తబస్టాండ్ వరకు రోడ్షో నిర్వహిస్తారు. -
భానుడి భగభగలు!
[ 05-05-2024]
భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు. -
ప్రజా సేవకుడిగా పార్లమెంటులో గళం వినిపిస్తా
[ 05-05-2024]
‘కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై నాకు ప్రణాళిక ఉంది.. నాన్న ఆశయ సాధన కోసం కరీంనగర్ ప్రజల సేవకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు అన్నారు. -
దేవుళ్ల పేరుతో రాజకీయాలు వద్దు: వినోద్
[ 05-05-2024]
కరీంనగర్కు స్మార్ట్సిటీని తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నిలిపిన తాను ఎంపీగా గెలిచాక నగర రూపురేఖలను మరింతగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు భారాస ఎంపీ అభ్యర్థి బోయిపల్లి వినోద్కుమార్ తెలిపారు. -
కష్టమొస్తే అండగా ఉన్నా: సంజయ్
[ 05-05-2024]
ఓటును నియంతృత్వ పాలన సాగించిన గడీల వారసులకు వేస్తారా? మోదీని ప్రధాన మంత్రిని చేసే గరీబోల్ల నాయకుడు బండి సంజయ్కుమార్కు వేస్తారో ప్రజలు నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు. -
రిజర్వేషన్లను రక్షించుకుందాం
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లను రక్షించుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని.. ప్రజలు ఆలోచించి అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని కోరారు. -
రూ.10.88 లక్షల నగదు పట్టివేత
[ 05-05-2024]
హుజూరాబాద్ మున్సిపల్ పరిధి పరకాల అడ్డదారి చెక్పోస్టు వద్ద శనివారం వాహన తనిఖీల్లో రూ.10.88 లక్షల నగదు పట్టుకున్నట్లు సీఐ బొల్లం రమేష్ తెలిపారు. -
వీణవంకకు చేరుకున్న కేసీఆర్
[ 05-05-2024]
మంచిర్యాలలో రోడ్ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం
[ 05-05-2024]
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధర్మపురి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. -
భారాసకు ఆరుగురు కౌన్సిలర్ల రాజీనామా
[ 05-05-2024]
జగిత్యాలలో ఆరుగురు భారాస కౌన్సిలర్లు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని 7, 10, 17, 21, 33, 38వ వార్డుల కౌన్సిలర్లు పల్లెపు రేణుక, సిరికొండ పద్మ, సిరికొండ భారతి, బండారి రజని, దాసరి లావణ్య, అల్లె గంగాసాగర్ భారాస పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..