Telangana News: కూతురిని ప్రేమిస్తున్న యువకుడి హత్యకు తండ్రి పన్నాగం..రూ.5 లక్షల సుపారీ
సుపారీ ఇచ్చి తన కూతురిని ప్రేమిస్తున్న యువకుడిని హత్య చేయించేందుకు తండ్రి కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు
నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాహుల్హెగ్డే, అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్
సిరిసిల్ల గ్రామీణం, న్యూస్టుడే: సుపారీ ఇచ్చి తన కూతురిని ప్రేమిస్తున్న యువకుడిని హత్య చేయించేందుకు తండ్రి కుట్ర పన్నిన విషయాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఎస్పీ రాహుల్హెగ్డే తన కార్యాలయంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని తిప్పాపూర్కు చెందిన నీలం శ్రీనివాస్ (45) తన కూతురు శిరీష (23)ను వేములవాడ పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన చింతలతండం మనోజ్కుమార్(25) గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. శిరీషకు ఏడాది కిందట మరొకరితో వివాహం చేసినా అతనితో ప్రేమవ్యవహారం కొనసాగిస్తుంది. కొన్ని నెలల క్రితం ఆమె ఇంటి నుంచి పారిపోయి మనోజ్కుమార్తో కలిసి ముంబయికి వెళ్లిపోయింది. అక్కడ వారం రోజులు ఉండి మళ్లీ వేములవాడకు వచ్చింది. అయితే భర్త ఆమెను భార్యగా జీవితంలోని అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈక్రమంలోనే పలు పంచాయితీలు నిర్వహించారు. అయినప్పటికీ మనోజ్కుమార్ను విడిచిపెట్టలేదు. దీంతో ఆమె తండ్రి నీలం శ్రీనివాస్, తన స్నేహితుడైన మానుక కుంటయ్యలు కలిసి మనోజ్కుమార్ను చంపేందుకు నిర్ణయించుకున్నారు. వారం రోజుల క్రితం వేములవాడలో శ్రీనివాస్, కుంటయ్యతో సమావేశమై పెద్ద కత్తులతో దాడులు చేసి చంపేందుకు పథకం వేశారు. వీరు బిహార్కు చెందిన లఖింద్ర సాహ్ని, కోరుట్ల పట్టణానికి చెందిన బొమ్మిడి రాజుకుమార్తో కలిసి రూ.5 లక్షలకు హత్య చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం మనోజ్కుమార్ కదలికలను గమనిస్తూ హత్య చేసేందుకు తిప్పాపూర్ బస్టాండ్లో కలుసుకున్నారు. ఈ క్రమంలోనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్లను చూసి నిందితులు కారు స్టార్ట్ చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకొని తనిఖీ చేయగా కారులో రెండు పెద్ద కత్తులు, మారణాయుధాలు లభించాయి. దీంతో నలుగురిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు పెద్ద కత్తులు, నాలుగు సెల్ఫోన్లు, కారు, బైక్, బాధితుని ఫొటో, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, సీఐ వెంకటేష్ పాల్గొన్నారు.
పోలీసులు స్వాధీన పరచుకున్న కత్తులు, సెల్ఫోన్లు, నగదు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.