చుక్ చుక్ బండి.. అంతటా ఆగదండి!
కరీంనగర్ నుంచి పెద్దపల్లి మీదుగా మంచిర్యాలకు రహదారి మార్గంలో వెళ్తే సుమారు 84 కిలోమీటర్ల దూరానికి రెండు గంటలకు పైగా ప్రయాణించాలి. అదే రైలులో పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు అర గంటలోపే చేరుకోవచ్చు. దీంతో చాలా మంది కరీంనగర్
ప్యాసింజర్ నుంచి ఎక్స్ప్రెస్గా మారిన అజ్ని రైలు
నేడు పునఃప్రారంభం.. కాజీపేట నుంచి బల్లార్షా వరకే సేవలు
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ (పాతచిత్రం)
కరీంనగర్ నుంచి పెద్దపల్లి మీదుగా మంచిర్యాలకు రహదారి మార్గంలో వెళ్తే సుమారు 84 కిలోమీటర్ల దూరానికి రెండు గంటలకు పైగా ప్రయాణించాలి. అదే రైలులో పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు అర గంటలోపే చేరుకోవచ్చు. దీంతో చాలా మంది కరీంనగర్ నుంచి పెద్దపల్లి వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి అందుబాటులో ఉండే ఎక్స్ప్రెస్ గాని, ప్యాసింజర్ రైలు గాని ఎక్కితే మొత్తమ్మీద గంటన్నరలోనే మంచిర్యాల చేరుకోవచ్చు. అయితే ఇదంతా గతం.. దాదాపు రెండున్నరేళ్ల కిందట కరోనా వచ్చిన తర్వాత రైళ్ల వేళలన్నీ మారాయి. హాల్టింగ్, పాత మార్గాలను రద్దు చేయడంతో రైలు ప్రయాణం ప్రహసనంగా మారింది.
50 ఏళ్లుగా నడిచిన నాగ్పూర్(అజ్ని) ప్యాసింజర్ రైలును రెండేళ్ల కిందట కొవిడ్ ప్రభావంతో అధికారులు రద్దు చేశారు. తాజాగా ఆగస్టు 1 నుంచి ఈ రైలును నడిపించాలని నిర్ణయించారు. అయితే కాజీపేట నుంచి బల్లార్షా వరకు మాత్రమే ఎక్స్ప్రెస్ రైలుగా నడిపించనున్నారు. ప్రతి రోజూ రాత్రి 10.50కి కాజీపేట జంక్షన్లో బయల్దేరి పెద్దపల్లికి 11.41, రామగుండానికి 11.54 వరకు చేరుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారుజామున బల్లార్షా జంక్షన్కు 3.10కి చేరుతుంది. తిరిగి ఇదే ఎక్స్ప్రెస్ ఉదయం 3.50కి బల్లార్షా నుంచి రామగుండానికి ఉదయం 5.47కి, పెద్దపల్లికి 6.15కు వచ్చి, కాజీపేటకు ఉదయం 8.50కి చేరుకుంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా గతంలో కాజీపేట నుంచి నాగ్పూర్(అజ్ని) వరకు నడిపిన ఈ ప్యాసింజర్ను ఎక్స్ప్రెస్గా మార్చడంతో పాటు బల్లార్షా వరకు మాత్రమే నడిపించాలని నిర్ణయించారు. అంతే కాకుండా పదుల సంఖ్యలోని స్టేషన్లలో హాల్టింగ్లను ఎత్తివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బస్సు ప్రయాణం.. భారమే!
నిత్యం కరీంనగర్, నిజామాబాద్ల నుంచి మంచిర్యాల, బల్లార్షాలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు సాధారణంగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఈ మార్గంలో బస్సులో వెళ్లాలంటే గంటల తరబడి ప్రయాణానికి ఒళ్లు హూనం కావాల్సిందే. అస్తవ్యస్తంగా రహదారులు, ట్రాఫిక్ రద్దీతో రోజులో సగం సమయం ప్రయాణానికే కేటాయించాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో పెరిగిన బస్సు ఛార్జీలతో ఆర్థిక భారం కూడా మామూలుగా లేదు. అదే రైలు ప్రయాణమైతే ఎక్కువలో ఎక్కువగా జనరల్ టికెట్కు రూ.150 లోపే ఉంటుంది. బస్సులో వెళ్తే గమ్య స్థానాలను బట్టి రూ.200కు పైగా వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా బస్సులు సమయపాలన పాటించడం లేదు. నిత్యం గోదావరిఖని, మంథని, పెద్దపల్లి, కరీంనగర్ల నుంచి మంచిర్యాలకు వెళ్లే బస్సులు కిటకిటలాడుతూ ఉంటాయి.
* ఇక మంచిర్యాల జిల్లా పరిధిలో మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లలో మాత్రమే రైలును నిలపనున్నారు. దీంతో సింగరేణి, ఇతర సంస్థల ఉద్యోగులు, ఇతరులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గతంలో రవీంద్రఖని(రామకృష్ణాపూర్), మందమర్రి పట్టణాల్లో హాల్టింగ్ ఉండగా, తాజాగా దాన్ని ఎత్తివేశారు.
14 స్టేషన్లకు తగ్గిన హాల్టింగ్
* కరీంనగర్ జిల్లా పరిధిలో జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా పరిధిలో పొత్కపల్లి, పెద్దపల్లి జంక్షన్, రామగుండం రైల్వే స్టేషన్లలో మాత్రమే హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
* అజ్ని ప్యాసింజర్గా కొనసాగిన కాలంలో సింగరేణీయులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు కాజీపేట నుంచి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా మహారాష్ట్ర వరకు ఇందులోనే ప్రయాణించేవారు.
* గతంలో 60 స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉన్న ఈ రైలును ఎక్స్ప్రెస్గా మార్చడంతో పాటు కేవలం 14 స్టేషన్లలోనే నిలుపుదలకు నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జమ్మికుంట తహసిల్దార్గా విజయ
[ 04-05-2024]
జమ్మికుంట తహసీల్దార్గా శనివారం బి. విజయ బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఎన్పీడీసీఎల్ రికవరీ ఆఫీసర్గా పని చేయగా.. తాజాగా స్థానిక తహసీల్దార్గా నియమించారు. -
వడదెబ్బతో ఎంఈవో మృతి!
[ 04-05-2024]
వెల్గటూరు మండల విద్యాధికారి బత్తుల భూమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. ఎన్నికల విధుల్లో భాగంగా వాహన తనిఖీ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న భూమయ్య... -
రెండు సభలతో కాంగ్రెస్ జోరు
[ 04-05-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం.. సీఎం రేవంత్రెడ్డి హాజరవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.. నిర్ణీత సమయానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటలపాటు సభలు ఆలస్యమైనా ప్రజలు సీఎం ప్రసంగానికి ఉత్సాహంతో స్పందించారు. -
శాసన సమరం.. దిల్లీలో గళం
[ 04-05-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు నేతలు ఇటు శాసనసభ, అటు లోక్సభ సభ్యులుగా ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. రాజకీయ అనుభవం, ప్రజాదరణతో రెండు స్థాయిల్లోని చట్టసభల్లో అడుగుపెట్టి గళం విప్పారు. -
కేసీఆర్ రోడ్ షోతో భారాసలో హుషారు
[ 04-05-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారానికి వచ్చిన కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా గోదావరిఖనిలో చేపట్టిన రోడ్షో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. -
నేను ఈవీఎం.. 13న కలుద్దాం
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు పోలింగ్ శాతం పెంపునకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అనారోగ్యంతో ఆబ్కారీ ఎస్సై మృతి
[ 04-05-2024]
ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఆబ్కారీ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాదుల కాళిప్రసాద్ (61) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందాల్సిన ఆయన అకాల మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. -
మావోయిస్టు నేతకు అంతిమ వీడ్కోలు
[ 04-05-2024]
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో మావోయిస్టు నేత చీమల నర్సయ్య అలియాస్ జోగన్న అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు. -
బియ్యం అమ్మకాల్లో గోల్మాల్
[ 04-05-2024]
సన్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా జిల్లాలో తొలిరోజు 320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
‘చక్కెర పరిశ్రమపై కాంగ్రెస్ డ్రామా’
[ 04-05-2024]
చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘పని చేయని నాయకులను నిలదీయాలి’
[ 04-05-2024]
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి పనిచేయని నాయకులను నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 04-05-2024]
కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్, పిప్రి, చేపూర్ గ్రామాల్లో, మాక్లూర్ మండలకేంద్రంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. -
పంట రుణాలపై వడ్డీ వసూలు
[ 04-05-2024]
జిల్లాలో వానాకాలం, యాసంగి పంట ఉత్పత్తుల అమ్మకం జోరందుకోగా ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు డబ్బులను రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకుల్లోని తమ పంట రుణాలను పెద్దఎత్తున రెన్యూవల్స్ చేస్తుండగా వడ్డీభారం వేధిస్తోంది. -
క్యూఆర్ కోడ్తో ఓపీ నమోదు
[ 04-05-2024]
చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే వారు ఓపీ నమోదులో పడుతున్న ఇబ్బందులను తప్పించేందుకు ప్రభుత్వం క్యూఆర్కోడ్ ద్వారా ఓపీ నమోదు చేసుకునే సదుపాయం కల్పించిందని గోదావరిఖనిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందుసింగ్ అన్నారు. -
ఆ రెండు పార్టీలకు ఓటేసి మోసపోవద్దు
[ 04-05-2024]
ఎన్నికల్లో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని భారాస కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం అసాధ్యం
[ 04-05-2024]
లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదానే లేదని, ప్రస్తుతం 300 సీట్లలోకూడా పోటీ చేయని పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. -
వాహనాలు ఇలా.. చెత్త సేకరణ ఎలా?
[ 04-05-2024]
వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో వ్యర్థాలు, చెత్త సేకరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని బాగు చేయించకపోవడంతో నెలల తరబడి మూలన పడి ఉంటున్నాయి. ఫలితంగా వార్డుల్లో సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. -
ఆస్తి పన్ను చెల్లింపులో ఆదర్శం
[ 04-05-2024]
నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేందుకు పురపాలకశాఖ ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఎర్లీబర్డ్ పథకం ప్రవేశపెట్టింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ప్రకటించింది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 04-05-2024]
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్ నగర పాలక సంస్థ పాలకవర్గంలో 60 మంది కార్పొరేటర్లు ఉండగా, ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా లేరు. -
ఈసీ మార్గదర్శకాలపై అవగాహన అవసరం
[ 04-05-2024]
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సూక్ష్మ పరిశీలకులకు (మైక్రో అబ్జర్వర్ల)కు పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు