logo

ఘనంగా రక్షాబంధన్‌

జిల్లా కేంద్రంలో శుక్రవారం రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు యువతులు, మహిళలు ఉత్సాహం చూపారు. పురపాలక కమిషనర్‌ కలెక్టర్‌ గుగులోతు రవికి రాఖీ కట్టారు. శాసనమండలి

Published : 13 Aug 2022 04:07 IST

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి రాఖీ కడుతున్న మహిళ

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో శుక్రవారం రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు యువతులు, మహిళలు ఉత్సాహం చూపారు. పురపాలక కమిషనర్‌ కలెక్టర్‌ గుగులోతు రవికి రాఖీ కట్టారు. శాసనమండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డికి మాజీ కౌన్సిలర్లు, పలువురు ముస్లిం మహిళలు రాఖీ కట్టారు. దళిత శక్తి ఆధ్వర్యంలో తహసీల్‌చౌరస్తా వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి మహిళలు రాఖీలు కట్టి మిఠాయిలు పంపిణీ చేశారు.

సారంగాపూర్‌: సారంగాపూర్‌లో నిర్వహించిన రక్షాబంధన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌లకు జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత రాఖీ కట్టారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ సింధు శర్మ, డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రావు, ఈడీ లక్ష్మీనారాయణ, ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సురేందర్‌, సర్పంచి రాజేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


కలెక్టర్‌ రవికి రాఖీ కడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత


అంబేడ్కర్‌ విగ్రహానికి రాఖీలు కడుతున్న మహిళలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని