నాలుగేళ్ల నిరీక్షణకు తెర
రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతంపైగా మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమలున్నవి ఉమ్మడి జిల్లాలోనే. అందులోనూ సిరిసిల్ల వస్త్రోత్పత్తులకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. సిరిసిల్ల నేత కుటుంబానికి చెందిన గూడూరి ప్రవీణ్కు రాష్ట్ర ప్రభుత్వం
టీపీటీడీసీఎల్ ఛైర్మన్గా ప్రవీణ్
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతంపైగా మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమలున్నవి ఉమ్మడి జిల్లాలోనే. అందులోనూ సిరిసిల్ల వస్త్రోత్పత్తులకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. సిరిసిల్ల నేత కుటుంబానికి చెందిన గూడూరి ప్రవీణ్కు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. వ్యవసాయం తర్వాత కీలకమైంది వస్త్రోత్పత్తి రంగం. ప్రభుత్వ ఆర్డర్లు, మరమగ్గాల ఆధునికీకరణ, నేతన్న బీమా వంటి సంక్షేమ పథకాల అమలులో కార్పొరేషన్ పదవి కీలకం. 2018లోనే చేనేత, మరమగ్గాలను రెండు వేర్వేరు కార్పొరేషన్లగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్లుగా అప్పుడు, ఇప్పుడంటూ ఊరించింది. ఎట్టకేలకు తెలంగాణ పవర్లూం, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ఛైర్మన్గా గూడూరి ప్రవీణ్ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఉమ్మడి జిల్లా నేతన్నలకు మంచి అవకాశం.
అభివృద్ధికి అవకాశం
రాష్ట్ర వ్యాప్తంగా 68 వేల మరమగ్గాలుంటే వాటిలో సగం సిరిసిల్లలోనే ఉన్నాయి. వస్త్రోత్పత్తి అంటే చేనేత అనే ముద్ర పడిపోయింది. కానీ జిల్లాలో ఎక్కువగా మరమగ్గాలపై వస్త్రోత్పత్తి జరుగుతోంది. ఈ వ్యత్యాసాన్ని గమనించి ప్రభుత్వం వేర్వేరుగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వం కొంత నిధిని అందజేస్తుంది. వీటి ద్వారా ఆయా రంగాల అభివృద్ధి, సంక్షేమానికి వెచ్చించే వెసులుబాటు ఉంటుంది. మరమగ్గాలపై ప్రభుత్వ ఆర్డర్లు ఉత్పత్తి చేసేందుకు ప్రత్యేకంగా నూలు బ్యాంకు ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. పరిశ్రమలో వస్త్రోత్పత్తుల నాణ్యత, కార్మికులకు బీమా వంటి సంక్షేమ పథకాలను వివరించేందుకు ప్రత్యేకంగా ఉద్యోగుల నియామకం జరుగుతుంది. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటవుతుంది. వస్త్రోత్పత్తుల నిల్వలకు ప్రత్యేక గోదాం, రాష్ట్ర బడ్జెట్లో కార్పొరేషన్కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులుంటాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆప్కోను ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు టెస్కోను ఏర్పాటు చేశారు. దీనిలో ఆస్తులు, అప్పుల లెక్కలు, సిబ్బంది విభజన అసంపూర్తిగా మిగిలింది. ఈ ప్రక్రియ పూర్తయితే టెస్కోను రద్దు చేసే అవకాశం ఉంది.
వ్యక్తిగతం
పేరు: గూడూరి ప్రవీణ్, తండ్రి రాజయ్య
కుటుంబం: భార్య మంజుల మాజీ కౌన్సిలర్. కొడుకు మానస్ ఎం.ఎస్, కూతురు ప్రత్యూష ఎంటెక్ చేశారు. ప్రస్తుతం ఇద్దరూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు.
విద్యాభాస్యం: ఎంఏ, ఎంఫిల్ (రాజనీతిశాస్త్రం)
పదవులు: అర్బన్ సహకార బ్యాంకు ఛైర్మన్, సెస్ ఛైర్మన్, అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా సేవలందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయ్యో రైతన్నా..
[ 08-05-2024]
జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. శ్రమ ఫలితం చేతికందే ముందు ధాన్యం తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వ్యూహాలకు పదును!
[ 08-05-2024]
లోక్సభ పోరు చివరి అంకానికి చేరుతోంది. ఓటరు తీర్పు వెల్లడించే సమయం ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ప్రచార వేగం పెంచుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా’..అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. -
ఇందూరు.. హోరాహోరీ పోరు
[ 08-05-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. -
‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’
[ 08-05-2024]
‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రజలను కోరారు. -
హుషారుగా వచ్చి.. ఉసురుమంటూ!
[ 08-05-2024]
కరీంనగర్లో మంగళవారం నిర్వహించాల్సిన సభ గాలివాన బీభత్సంతో రద్దు అయింది. సభాస్థలి వద్ద పరిస్థితి చిన్నాభిన్నమైంది. గాలులకు సభావేదిక వద్ద వేసిన టెంట్లు కుప్పకూలాయి. -
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యం అయిందని, ప్రతిపాదిత భూమిని అప్పగిస్తే ఏడాదిలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్ పేర్కొన్నారు. -
పట్టణవాసులు కదలాలి
[ 08-05-2024]
పల్లెలతో పోలిస్తే అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నా పట్టణవాసులు మాత్రం ఎన్నికల పోలింగ్పై ఆసక్తి చూపడం లేదు. జగిత్యాల జిల్లా అయిదు పురపాలక సంఘాలతో ప్రత్యేకతను చాటుతుండగా ఈ ఒరవడి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తేనే స్పష్టమైన ఫలితం -
పట్టణాల్లో నిర్లక్ష్యం.. పల్లెల్లో ఆదర్శం
[ 08-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఓటింగ్ రోజున సెలవు ప్రకటించినా ఆశించిన మేరకు ఓటింగ్శాతం నమోదు కావడం లేదు. -
కాంగ్రెస్ గెలుపు జిల్లాకు అవసరం
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావు గెలిస్తే.. జిల్లా మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశముంటుందని, భాజపా, భారాస అభ్యర్థుల గెలుపుతో ప్రయోజనం ఏమీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదు
[ 08-05-2024]
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదని, ఆ పార్టీ దళితులకు అన్యాయం చేస్తోందని భాజపా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పనితీరు బేరీజు వేయండి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని భాజపా జతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
అభివృద్ధి కోరుకుంటే భారాసకు ఓటేయండి
[ 08-05-2024]
అన్ని వర్గాల ప్రజలు, రైతులపట్ల కాంగ్రెస్ అనాలోచితంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక వారధి.. అవకాశాల పెన్నిధి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి. -
అతివల ఆదరణ దక్కేదెవరికో!
[ 08-05-2024]
సార్వత్రిక సమరంలో పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు గెలుపు వ్యూహాలు ముమ్మరం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు యువకుల దుర్మరణం
[ 08-05-2024]
ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. -
రూ.9.42 లక్షల నగదు పట్టివేత
[ 08-05-2024]
జగిత్యాల పట్టణం మోచిబజార్లో ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టగా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి కె.శిరీష ఎలాంటి ఆధారం లేకుండా తీసుకెళ్తున్న రూ.4.84 లక్షలను పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు