జానపదం.. మా ప్రాణపదం
రాష్ట్రాలు వేరైనా.. సంస్కృతి, సంప్రదాయాలను జానపద రూపంలో తెలియజెప్పేందుకు ఒకే వేదిక వద్దకు రావడం ఆనందంగా ఉందని పలువురు కళాకారులు పేర్కొన్నారు. తాము ప్రదర్శించే నృత్యాలు వేర్వేరుగా ఉన్నా భావం ఒక్కటేనని నృత్యకారులు తెలిపారు. కరీంనగర్ కళోత్సవాల్లో
వివిధ రాష్ట్రాల కళాకారుల మనోగతం
కరీంనగర్ సాంస్కృతికం, కరీంనగర్ పట్టణం
కళాకారుల నృత్యప్రదర్శన
రాష్ట్రాలు వేరైనా.. సంస్కృతి, సంప్రదాయాలను జానపద రూపంలో తెలియజెప్పేందుకు ఒకే వేదిక వద్దకు రావడం ఆనందంగా ఉందని పలువురు కళాకారులు పేర్కొన్నారు. తాము ప్రదర్శించే నృత్యాలు వేర్వేరుగా ఉన్నా భావం ఒక్కటేనని నృత్యకారులు తెలిపారు. కరీంనగర్ కళోత్సవాల్లో భాగంగా శనివారం జరిగిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ‘న్యూస్టుడే’తో పలువురు కళాకారులు తమ భావాలను పంచుకున్నారు.
మా ప్రదర్శనలు ఒకే పోలిక
- సోనాల్, మహారాష్ట్ర
తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చెందిన మా ప్రదర్శనలకు దగ్గరి పోలికలు ఉన్నాయి. భాష వేరైన భావం ఒక్కటే. నవరాత్రుల సందర్భంగా నాగపూర్లో అంబా ఫెస్టివల్లో మా ప్రదర్శనలకు ప్రత్యేకత ఉంటుంది. అమరావతి స్టార్ సంస్థ ద్వారా అనేక ప్రాంతాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నాం. కరీంనగర్ కళోత్సవాలు చాలా బాగున్నాయి.
తెలంగాణ జానపదాలు నచ్చాయి
- గీతాంజలి, అస్సాం
మేం కూడా రెండు ప్రదర్శనలు ఇస్తున్నాం. ఎన్.ఎస్.ఎస్.కు చెందిన 11 మంది అస్సాంలో సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించాం. పలు ప్రాంతాలను సందర్శించినా కరీంనగర్ కార్యక్రమం చాలా బాగుంది. తెలంగాణ జానపదాలు ఆకర్షించాయి. మా సంస్కృతిని వేదికపై తెలియజేసేందుకు వచ్చాం.
యువజన ఉత్సవాల్లో ..
-జగ్జీవన్ రాఘవ, గుజరాత్
అహ్మదాబాద్ ప్రాంతంలోని కురేంద్రనగర్కు చెందిన యువజన సంఘం ద్వారా అక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. మా సంస్కృతిని తెలియజేసే నృత్యాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. మూడు ప్రదర్శనలు ఎంపిక చేశారు. 15 మంది సభ్యులలో యువతియువకులు ఉన్నారు. అన్ని రాష్ట్రాల వారుకూడా ఆయా ప్రాంతాల సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం వల్ల వాటిని అవగాహన చేసుకుంటున్నాం.
ఒకే వేదికపై కలుస్తున్నాం
-రెగీనా, కేరళ
అన్ని రాష్ట్రాల కళాకారులను కలుసుకునే అవకాశం కరీంనగర్ వేదిక కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాం. కొలికొడ్ జిల్లాలోని జానపద సాంస్కృతిక ఫోరం ద్వారా కల్చరల్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అక్కడ ప్రదర్శించిన వాటికంటే భిన్నంగా మా రాష్ట్ర ప్రత్యేక ప్రదర్శనలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. 12 మంది ప్రదర్శనలో పాల్గొంటున్నాం.
మా సంసృతిని తెలియజేస్తాం
-అజయ్కుమార్, హిమాచల్ ప్రదేశ్
మా రాష్ట్ర సంస్కృతిని తెలియజేసే కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశ, విదేశాలకు వెళ్లాం. ఖాట్మండ్లో మా ప్రదర్శనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ కూడా రెండు ప్రదర్శనలు ఇస్తున్నాం. సమీప రాష్ట్రాల వారిని కూడా కలుసుకునే అవకాశం కలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలం శ్రేణుల్లో కదనోత్సహం
[ 09-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ సభ భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. పట్టణ శివారు బాలానగర్లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ లోక్సభ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన జనసభకు జనం భారీగా హాజరయ్యారు. -
గజిబిజిగా ఓటరు జాబితా
[ 09-05-2024]
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీల నాయకులు ఓటరు జాబితాలు పరిశీలిస్తున్నారు. వారు జాబితాను చూస్తే.. పేర్లు గజిబిజిగా కనిపించాయి. ఓటరు చీటీలు పంపిణీ చేసే వారికి కూడా తలనొప్పిగా తయారైంది. -
ప్రచారానికి 3 రోజులు.. పోలింగ్కు 5 రోజులు
[ 09-05-2024]
లోక్సభ పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఓ వైపు ప్రచారం తుది దశకు చేరుతుండటంతో నాయకులు వేగాన్ని పెంచుతుండగా ఎన్నికల యంత్రాంగం ఓటింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలై ఉంది.. -
భానుడి భగభగ.. కావొద్దు ఓటుకు సెగ
[ 09-05-2024]
ఉదయం 9 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. రోజురోజుకూ ఎండలు భగభగమంటున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. -
ప్రచార ఉపాధి
[ 09-05-2024]
జెండాలు వేరైనా జిందాబాద్ పలికే గొంతులు అవే.. కండువాల రంగు వేరైనా అక్కడా, ఇక్కడా ప్రదర్శనగా వెళ్లేది వాళ్లే.. ఒకచోట సభ.. మరో చోట రోడ్షో.. ఇంకో చోట కూడలి సమావేశం.. ఇలా పార్టీ ఏదైనా, పేరేదైనా ప్రచారంలో వాళ్లే ముందుంటున్నారు. -
డిజిటల్ మాధ్యమం.. విస్తృత ప్రచారం
[ 09-05-2024]
ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తూ పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. జన బాహుళ్యంలో ఉండే మాధ్యమాల ద్వారా ఓటు ప్రాధాన్యతను వివరిస్తోంది. -
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధునిక వైద్య సేవలేవీ!
[ 09-05-2024]
ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న ధర్మపురి పట్టణంలో మెరుగైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ముప్పై పడకల ఆసుపత్రిలో పది పడకల ఐసీయూ కేంద్రానికి మోక్షం కలగడం లేదు. -
ఇందూరు అభివృద్ధికి అండగా ఉంటా
[ 09-05-2024]
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డితో కలిసి ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొండ మండలాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. -
దేశానికి మోదీతోనే భద్రత
[ 09-05-2024]
భారత దేశానికి ప్రధాని నరేంద్రమోదీతోనే భద్రత సాధ్యమని నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. బుధవారం రాత్రి కోరుట్ల పట్టణంలోని కార్గిల్చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మాట్లాడారు. -
సింగరేణి కార్మికుల మొగ్గు ఎటు?
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారీ సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఆదరణ ఉంటే విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. -
ఆదరిస్తే యువతకు ఉపాధి చూపిస్తా
[ 09-05-2024]
నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ రంగ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. -
సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
[ 09-05-2024]
అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు. -
కలిసొచ్చిన బాస్మతి... హరియాణాకు ఎగుమతి
[ 09-05-2024]
కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మిల్లర్ల కోతలతో విసుగు చెందిన కర్షకులు బాస్మతి రకం వరి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యాసంగిలో వ్యవసాయ క్షేత్రాల్లో పంటను పండిస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. -
పుణ్యక్షేత్రం అభివృద్ధికి హామీ ఏది?
[ 09-05-2024]
వేములవాడలో భాజపా ఎన్నికల సభకు వచ్చి రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రధాని మోదీ దక్షిణ కాశీగా పేరొందిన ఆలయ అభివృద్ధికి మొండి చేయి చూపారని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆ పార్టీలకు మాట్లాడే అర్హత లేదు
[ 09-05-2024]
వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇవ్వలేదని భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఖండించారు. -
ఆలయానికి ఎందుకు నిధులివ్వలేదు?
[ 09-05-2024]
ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసిన ప్రధాని మోదీ, దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
రూ.12.50 లక్షల నగదు పట్టివేత
[ 09-05-2024]
జగిత్యాల పట్టణంలోని వివిధప్రాంతాల్లో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని రూ.9.20 లక్షలను పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
-
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్