logo

భూమి పట్టా కాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వారసత్వ భూమి గత కొన్ని సంవత్సరాలుగా కాస్తులో ఉన్నప్పటికీ పట్టాతో పాటు ధరణిలో నమోదు కాకపోవడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని నల్ల వెంకయ్యపల్లిలో జరిగింది.

Published : 03 Oct 2022 04:59 IST

చికిత్స పొందుతూ మృతి


శ్రీనివాస్‌రెడ్డి

శంకరపట్నం, న్యూస్‌టుడే: వారసత్వ భూమి గత కొన్ని సంవత్సరాలుగా కాస్తులో ఉన్నప్పటికీ పట్టాతో పాటు ధరణిలో నమోదు కాకపోవడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని నల్ల వెంకయ్యపల్లిలో జరిగింది. కేశవపట్నం ఎస్సై దేశ్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కలాలి శ్రీనివాస్‌రెడ్డి(36) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. వారసత్వంగా వచ్చిన 34 గుంటల భూమి పట్టాతో పాటు ధరణిలో నమోదు కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగాడు. సరైన ఆధారాలు లేకపోవటంతో అధికారులు నమోదును తిరస్కరించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి గతనెల 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం తొలుత హుజూరాబాద్‌ అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి భార్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని