మంత్రులు ముగ్గురు.. మాజీలు ముగ్గురు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు బరిలో ఉండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, గత ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన నాటి అమాత్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఎన్నికల బరిలో అమాత్యులు
నియోజకవర్గాల్లో ఆసక్తికర పోటీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు బరిలో ఉండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, గత ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన నాటి అమాత్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మంత్రులు, మాజీ మంత్రులు బరిలో ఉండటంతో వాటిపైనే అందరి దృష్టీ పడింది.
న్యూస్టుడే, గోదావరిఖని
- ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2009, 2010(ఉప ఎన్నిక), 2014, 2108 ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న కేటీఆర్ ప్రస్తుతం పురపాలక, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలకు మంత్రిగా ఉన్నారు.
- కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న భారాస అభ్యర్థి గంగుల కమలాకర్ ఇది వరకే మూడు సార్లు విజయం సాధించారు. తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రిగా సేవలందిస్తున్నారు. 2009లో తెదేపా నుంచి పోటీ చేసి గెలుపొందిన గంగుల 2014, 2018 ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి వరుసగా విజయం సాధించారు.
- ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే ఆరుసార్లు విజయం సాధించారు. తొలిసారి మేడారం నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఆయన 2008(ఉప ఎన్నిక), 2009 సాధారణ ఎన్నికలు, 2010(ఉప ఎన్నిక)లో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు.
మాజీలు
- మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దుద్దిల్ల శ్రీధర్బాబు గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. తొలిసారిగా 1999 ఎన్నికల్లో మంథని నుంచి విజయం సాధించిన ఆయన 2004, 2009, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. వైఎస్ హయాంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన శ్రీధర్బాబు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు.
- రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నాయకులు టి.జీవన్రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 1983లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జీవన్రెడ్డి వైఎస్ ప్రభుత్వంలో రహదారులు భవనాల శాఖ మంత్రిగా సేవలందించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్రెడ్డి ఆ తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించారు. 1996 ఉప ఎన్నిక, 1989, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. పంచాయతీరాజ్, ఆబ్కారీ, రహదారులు భవనాల శాఖ మంత్రిగా జీవన్రెడ్డి గతంలో పనిచేశారు.
- తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడిగా పనిచేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2004 నుంచి వరుసగా విజయాలు నమోదు చేసుకుంటూ వస్తున్న ఈటల రాజేందర్ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో సేవలందించారు. 2004లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి, 2008(ఉప ఎన్నిక)లో విజయం సాధించారు. ఆ తర్వాత హుజూరాబాద్ నుంచి 2009, 2010(ఉప ఎన్నిక) 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. భారాసను వీడిన అనంతరం 2021లో జరిగిన ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా మరోసారి విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం
[ 27-04-2024]
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్