ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు.
న్యూస్టుడే-మేడిపల్లి
- రాజస్థాన్లోని సర్దార్గఢ్ గ్రామానికి చెందిన హకుందాస్ 1962లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల్లో తప్పాడు. స్నేహితులు ఎగతాళి చేశారు. పట్టు వదలని హుకుందాస్ పదో తరగతి పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. 2019 నాటికి 55 సార్లు పదో తరగతి పరీక్షలు రాసి చివరకు ఉత్తీర్ణుడయ్యాడు. విశేషమేమిటంటే.. అప్పటికే అతను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నాలుగో తరగతి ఉద్యోగం చేశాడు. 2005లో ఉద్యోగ విరమణ చేసినా పట్టు వదలని విక్రమార్కుడిలా 2019లో ఉత్తీర్ణత సాధించాడు. ఉమ్మడి జిల్లాలోనూ పలువురు తమ వయసుతో నిమిత్తం లేకుండా పదో తరగతి పూర్తి చేసి స్ఫూర్తి నింపుతున్నారు.
- కోట్లాది మంది అభిమానులను తన సినిమాలతో అలరిస్తున్న పవన్ కల్యాణ్ తాను ఇంటర్లో ఫెయిలైనట్లు వరంగల్ ఎన్ఐటీ వేడుకల్లో చెప్పారు. తోటి విద్యార్థులు కాపీ కొట్టారని, తాను నిజాయతీగా పరీక్షలు రాయడంతో ఫెయిల్ అయినట్లు ఆనాటి సంగతులను గుర్తుచేశారు. తాను పరీక్షల్లో తప్పినా నైతికంగా విజయం సాధించానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్లాగే చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు పదో తరగతి, ఇంటర్ తప్పినా తమ సామర్థ్యంపై నమ్మకంతో జీవితాల్లో గెలిచారు. ఉమ్మడి జిల్లాలోనూ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు చదువుతో నిమిత్తం లేకుండా విజయం వైపు అడుగులు వేశారు.
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. చాలామంది విద్యార్థులు భవిష్యత్తుపై భరోసాతో ఉంటే.. కొందరు మాత్రం ఫలితాలపై బెంగతో ఉంటారు. ఒకవేళ పది ఉత్తీర్ణత సాధించలేక పోతే తనువు చాలించడమే శరణ్యమనుకుంటారు. ఇంకొందరు తాము ఇంటర్ మెట్లెక్కలేం అనే భావనతో ఉంటారు. మరికొందరు పదో తరగతి అనంతరం ఏం చదవాలో అవగాహన లేక అర్ధంతరంగా చదువు మానేస్తుంటారు. కానీ అవకాశాలు కోకొల్లలుగా ఉన్న ఈ రోజుల్లో పది మెట్లెక్కగానే హైరానా పడే బదులు ఆలోచనతో అడుగులు వేస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో పరీక్షల అనంతరం అవకాశాలు, జాగ్రత్తలు తదితరాలపై కథనం..
పరీక్ష తప్పితే ఇక అంతేనా!
జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన ఓ బాలుడు పదో తరగతి పరీక్ష తప్పానని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లాలోనూ బాలిక పరీక్ష ఉత్తీర్ణత సాధించలేదనే కారణంతో తనువు చాలించింది. మల్యాల మండలంలోనూ ఓ బాలుడు పదో తరగతి ఫలితాలు చూసి తాను ఉత్తీర్ణత సాధించలేదనే మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా పదుల సంఖ్యలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి ఏం సాధించారు? తమ కుటుంబాలను పుట్టెడు దు:ఖంలో ముంచి తీరని విషాదాలకు కారణమయ్యారు. వాస్తవానికి పదో తరగతి, ఇంటర్లో పరీక్షలు తప్పినంత మాత్రాన జీవితంలో ఏమీ సాధించలేమనే భావన విడనాడాలి. పరీక్ష ఎలా గట్టెక్కాలో శ్రమించాలి. ఉన్నతవిద్య వైపు అడుగులు వేయాలి. స్వయం ఉపాధి మార్గం వెతుక్కోవాలి. తమకు చేతనైన పని చేసుకుంటే విజయం ఎలా వరిస్తుందో ప్రణాళిక వేసుకోవాలి.
పదితోనూ ఉద్యోగాలు
పదో తరగతి విద్యార్హతతో పలు ఉద్యోగాలకు అర్హత పొందవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, రైల్వే తదితరాల్లో ఉద్యోగాలు పొందే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య పూర్తి చేయలేమన్న భావన కలిగిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరై ఆయా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. తొలుత పదో తరగతి అర్హతతో కొలువు పొంది అనంతరం డిపార్ట్మెంటల్ పరీక్షలు, ఉన్నత విద్యతో మంచి స్థానంలో ఉండవచ్చు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు పదో తరగతి అర్హతతో ఆర్మీ వైపు అడుగులు వేశారు. మరికొందరు డిప్లొమా కోర్సులతో తమకు అనువైన ఉద్యోగం సాధించారు.
మార్కులే ప్రామాణికం కాదు
పదో తరగతి, ఇంటర్లో వచ్చిన మార్కులే ప్రాతిపదికగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ అత్తెసరు మార్కులతో పాసైన యువకులెందరో ఉన్నత ఉద్యోగాలు సాధించారు. బీమారం మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు పదో తరగతిలో తక్కువ మార్కులు సాధించాడు. ఇంటర్ ప్రభుత్వ కళాశాలలో చేరి గ్రూప్స్కు సిద్ధమయ్యాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో రెండు ఉద్యోగాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. బీమారం మండలం దేశాయిపేటకు చెందిన ఓ నిరుపేద యువకుడు పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని, ఆంగ్లంపై తనకు పట్టులేదని కుంగిపోలేదు. పట్టుదలే పెట్టుబడిగా చదివాడు. ఆంగ్లంలో పీజీ పూర్తిచేసి ఇటీవల వెలువడిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 ఉద్యోగాలు సాధించి మార్కులే ప్రామాణికం కాదని నిరూపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం
[ 27-04-2024]
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!