ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం: కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. మొత్తం ఏడింటిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు 3 జిల్లాల్లోకి వెళ్లాయి. రెండు సెగ్మెంట్లు రెండేసి జిల్లాల్లో ఉండగా, మిగతా రెండు ఒకే జిల్లా పరిధిలో ఉన్నాయి. గతంలో పార్టీలపరంగా ఒకే జిల్లా అధ్యక్షుడు ఉండేవారు. ప్రస్తుతం అయిదుగురు ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు వారందరినీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
హామీలు అమలయ్యేనా!: ఎన్నికల ప్రచారం ఎలా ఉన్నా హుస్నాబాద్, బెజ్జంకి మండలాలను కరీంనగర్ జిల్లా పరిధిలోకి తేవాలన్న అంశం శాసనసభ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చింది. ఈ మేరకు శాసనసభ్యులు హామీ ఇచ్చారు. ఇది ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాలి.
శాసనసభ నియోజకవర్గాల వారీగా ఇలా..
సిరిసిల్ల(1): నియోజకవర్గంలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలు రాజన్న సిరిసిల్ల జిల్ల్లాలోనే ఉన్నాయి.
వేములవాడ(2): కథలాపూర్, భీమారం, మేడిపల్లి మండలాలు జగిత్యాల జిల్లాలోకి వెళ్లగా, వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాలు రాజన్న సిరిసిల్లలో ఉన్నాయి.
చొప్పదండి(3): చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉండగా మల్యాల, కొడిమ్యాల మండలాలు జగిత్యాల, బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉన్నాయి.
కరీంనగర్(1): కరీంనగర్ నగరంతో పాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, కరీంనగర్ అర్బన్ మండలాలుండగా పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాలో ఉంది.
హుజూరాబాద్(2): కమలాపూర్ హన్మకొండ జిల్లాలో ఉండగా హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాలు కరీంనగర్ పరిధిలోకి వస్తాయి.
మానకొండూర్(3): మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం మండలాలు కరీంనగర్ జిల్లాలో ఉండగా ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల జిల్లాలో, బెజ్జంకి సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నాయి.
హుస్నాబాద్(3): హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలు సిద్దిపేట జిల్లాలో, సైదాపూర్, చిగురుమామిడి మండలాలు కరీంనగర్ జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో ఉన్నాయి.
నాడు జాబితాలో పేరుండటమే ఓటరు గుర్తింపు
న్యూస్టుడే, ధర్మారం: దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మొదటి ఎన్నికల నిర్వహణకు అయిదేళ్లు ఆగాల్సి వచ్చింది. అప్పట్లో ఎవరికీ ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రాగా 1951లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 21 ఏళ్లు నిండిన, సంబంధిత నియోజకవర్గంలో ఆరు నెలలు(180 రోజులు)గా నివాసం ఉంటున్న వారికి ఓటరు జాబితాలో చోటు కల్పించారు. తాము భారతీయులమని చెప్పుకోవడానికి అప్పట్లో ఎవరి వద్దా గుర్తింపు పత్రాలు లేవు. దీంతో ఓటరు జాబితాలో పేరుంటే తాము భారతీయులమైనట్టేనని పోటీ పడి నమోదు చేసుకునేవారు. అప్పటి దేశ జనాభాలో కేవలం 49 శాతం మంది అంటే 17,32,12,343 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోస్టల్ ఓట్లు..అభ్యర్థుల పాట్లు
[ 03-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. -
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మూడు ఏసీలు
[ 03-05-2024]
కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రిలో రూ.1.50 లక్షల విలువ చేసే మూడు ఏసీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులపై ఏప్రిల్ 20న ‘ఉక్కపోతతో తల్లీ బిడ్డల ఉక్కిరిబిక్కిరి’, -
ఓటు ఘనం.. పోటీ నామమాత్రం
[ 03-05-2024]
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. -
యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
[ 03-05-2024]
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. -
వేములవాడ ఆలయ హుండీ ఆదాయం రూ. 1.52 కోట్లు
[ 03-05-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. -
రైతుల చెంతకు రాజన్న కోడెలు
[ 03-05-2024]
దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించే కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా అందించేందుకు ఆలయ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. -
చోరీ కేసు నిందితుడి అరెస్టు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. -
సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 03-05-2024]
ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
రాజీ మార్గమే రాజ మార్గం
[ 03-05-2024]
రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రసాద్ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. -
స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
[ 03-05-2024]
వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలో నిత్యం జిల్లా స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. వేములవాడ నందికమాన్ కూడలికి సమీపంలో రహదారి వెంబడి స్థలంతో పాటు చెట్లను ఆక్రమించినప్పటికీ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే పల్లెలు, పట్టణాల్లో ప్రగతి
[ 03-05-2024]
భాజపా పాలనలో పల్లెలు, పట్టణాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
రామగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
కార్మికుల కోసం ఏం చేశానో తెలుసుకోండి
[ 03-05-2024]
కార్మికుల కోసం నేను ఏంచేశానో ఒక్కసారి తెలుసుకోవాలని... మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులా..!
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఇప్పటికే ఉద్యోగులను గుర్తించి విధులు కేటాయించారు. -
లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు
[ 03-05-2024]
జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.