బాలయ్యకు బ్రహ్మరథం
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందికొట్కూరు, కర్నూలు వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రజలు సోమవారం బ్రహ్మరథం పట్టారు.
భారీగా తరలివచ్చిన అభిమానులు
మాట్లాడుతున్న బాలకృష్ణ
ఈనాడు, కర్నూలు : స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందికొట్కూరు, కర్నూలు వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రజలు సోమవారం బ్రహ్మరథం పట్టారు. నందికొట్కూరు నుంచి కర్నూలు చేరుకున్న ఆయన నగరంలోని ఒకటో పట్టణ ప్రాంతం, చిన్నమ్మవారిశాల నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. జనం భారీగా తరలిరావడంతో యాత్రకు ముందుకు సాగేందుకు సమయం పట్టింది. మహిళలు సైతం పెద్దఎత్తున తరలివచ్చి స్వర్ణాంధ్ర సాకార యాత్రకు సంఘీభావం తెలిపారు. వైకాపా పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో సుమారు 50 నిముషాల సేపు బాలకృష్ణ వివరించారు. కేంద్రం సహకారం కోసమే భాజపాతో తెదేపా పొత్తు పెట్టుకుందని చెప్పారు. ముస్లింలను తెదేపా ఎప్పుడూ ఓటు బ్యాంకుగా చూడలేదని పేర్కొన్నారు. వారిని సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా చేసేందుకు తెదేపా ఎలాంటి చర్యలు తీసుకుందో వివరించారు. రంజాన్ తోఫా, ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర అంశాలన్నీ ప్రస్తావించారు. హిందీలో సైతం కొద్ది నిమిషాలు ప్రసంగించారు. బాలకృష్ణ అభిమానులు యాత్ర మార్గంలో క్రేన్ సాయంతో రెండు భారీ గజమాలలు వేశారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసేన అధినేత పవన్కల్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు. బాలయ్య ప్రసంగం పూర్తయ్యే సరికి రాత్రి సుమారు 9.45 గంటలైంది. కార్యక్రమానికి వచ్చినవారు అప్పటివరకు అక్కడే ఉండి బాలకృష్ణ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకున్నారని, అక్రమాలు చేశారన్న ఉద్దేశంతోనే ఆయనకు టికెట్ ఇవ్వకుండా మార్చేశారని బాలకృష్ణ అన్నారు. మరొకరికి దోపిడీ చేసే అవకాశం కల్పించారని ఎద్దేవా చేశారు. తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జనసేన జెండాతో బాలయ్య
కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంతకుల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు
[ 29-04-2024]
వైకాపా హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. -
సైకోను శాశ్వతంగా ఇంటికి పంపాలి: చంద్రబాబు
[ 29-04-2024]
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో వేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
కూటమితోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
[ 29-04-2024]
ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాలులోఉమ్మడి జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాల్లోని యువతతో కలిసి భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు. -
తెదేపాలోకి 80 కుటుంబాలు చేరిక
[ 29-04-2024]
నియోజకవర్గంలోని నందవరం మండలంలోని హాలహర్వికి గ్రామానికి చెందిన ఎనభై కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. -
వర్షాలు సమృద్ధిగా కురవాలని సప్తభజనలు
[ 29-04-2024]
మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఖరీఫ్, రబీ సీజన్లలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని సప్త భజనలు నిర్వహిస్తున్నారు. -
తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా
[ 29-04-2024]
పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెదేపా అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్రెడ్డి అన్నారు. -
గూడ్స్ బోగిలో మంటలు
[ 29-04-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు రైల్వే స్టేషన్లో ఆదివారం గూడ్స్ బోగిలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అగ్ని మాపక శాఖ వారికి సమాచారం అందించారు. -
జలం తీసుకొస్తాం.. జనాలను బాగు చేస్తాం
[ 29-04-2024]
పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది.. మంత్రాలయం నియోజకవర్గంలో వలసలు ఎక్కువ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వలసలకు అడ్డుకట్ట వేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. -
వైకాపాలో రగడ
[ 29-04-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక సగర (ఉప్పర) సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీరశైవ సంఘం ఛైర్మన్ రుద్రగౌడ్, పట్టణ బ్యాంకు ఛైర్మన్ యు.కె.రాజు తదితరులు హాజరయ్యారు. -
జగన్ పాలన.. కష్టాల‘పాలు’
[ 29-04-2024]
చంద్రబాబు ఆలోచన: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం.. ‘పాడి’ రంగాన్ని ప్రోత్సాహం ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేనివిధంగా కల్లూరు మండలం తడకనపల్లెలో పశు వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. -
పశ్చిమాన వలస విలాపం
[ 29-04-2024]
పశ్చిమాన పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. వలస వెళ్తున్న ప్రజలను చూసి. ఇళ్లకేసిన తలుపులు, తాళాలు ప్రశ్నిస్తున్నాయి.. మళ్లీ ఎప్పుడు తీస్తారని. ఇంటికి కాపలా ఉన్న పెద్దలు ఎదురు చూస్తున్నారు.. అయినవాళ్లు ఎప్పుడు తిరిగొస్తారని. -
విలీనం చేసి.. జగన్ నిలువునా ముంచి
[ 29-04-2024]
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి. -
జగన్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
[ 29-04-2024]
ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలవరం కట్టలేదని, రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయకుండా మాట తప్పారని, మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. -
అరాచక పాలనకు అంతం తప్పదు
[ 29-04-2024]
రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
నెరవేరని మాటలు.. అవస్థల పాఠాలు
[ 29-04-2024]
విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలు ప్రసంగాల్లో ఊదరగొడుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పొంతన ఉండటం లేదు. -
వైకాపాను నమ్మి మళ్లీ మోసపోవద్దు
[ 29-04-2024]
ఆదోని పట్టణంలోని శివశంకర్నగర్లో భాజపా అభ్యర్థి డా.పార్థసారథి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట తెదేపా సీనియర్ నాయకులు భూపాల్చౌదరి, తెదేపా మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశం
[ 29-04-2024]
ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్ బందోబస్తుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 22న బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్కు ఆవుకు పోలీస్స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు నిమిత్తం డోన్కు వచ్చారు. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెబుదాం: బీసీ
[ 29-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెప్పి ఇంటికి పంపిద్దామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పెండేకంటి నగర్, శివనందినగర్లో ‘ప్రజాగళం’లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖరరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. -
కల్తీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారులను ఓడించాలి
[ 29-04-2024]
నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్