జగనన్న ఏలుబడిలో రుచి తప్పిన భోజనం
‘‘మన ఇంట్లో మనం తినే భోజనం ఎంత శుచిగా ఉండాలని అనుకుంటామో.. స్కూళ్లలో వండే ఆహారమూ అంతే నాణ్యంగా ఉండాలి’’ అంటూ సీఎం జగన్ పదే పదే చెబుతుంటారు..
ఇంటి నుంచే తెచ్చుకుంటున్న విద్యార్థులు
సరిగా లేదని పారబోస్తున్న పిల్లలు
కర్నూలు, నంద్యాల విద్య
‘‘మన ఇంట్లో మనం తినే భోజనం ఎంత శుచిగా ఉండాలని అనుకుంటామో.. స్కూళ్లలో వండే ఆహారమూ అంతే నాణ్యంగా ఉండాలి’’ అంటూ సీఎం జగన్ పదే పదే చెబుతుంటారు.. కానీ తన ఏలుబడిలో ఆహార పదార్థాలు బాగా లేకపోవడంతో పిల్లలు తినడానికి ఇష్టపడటం లేదు. రుచికరంగా రోజుకో మెనూ.. ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందిస్తున్నామంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టే జగన్ జమానాలో మధ్యాహ్న భోజనం ‘ఘోర’ముద్దలా తయారైంది.
కర్నూలు జిల్లాలో 1,433 పాఠశాలల్లో 2,56,416 మంది, నంద్యాలలో 1,369 పాఠశాలల్లో 1,49,973 మంది చదువుతుండగా... మధ్యాహ్న భోజన వంట సహాయకులు కర్నూలులో 3,399 మంది, నంద్యాలలో 2,540 మంది పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.3 వేల గౌరవ వేతనానికి గానూ మూడు నెలలుగా చెల్లించడం లేదు.
నాణ్యత లేని చిక్కీలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విద్యార్థులకు వారంలో మూడు రోజులు చిక్కీలు ఇవ్వాలి. రెండు జిల్లాలకు చిక్కీలు సరఫరా చేస్తున్న ఏజెన్సీకి రెండు నెలలుగా సుమారు రూ.3 కోట్ల వరకు బిల్లులు ఇవ్వాలి. నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారని ప్రధానోపాధ్యాయులు ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవు.
గుడ్లు తేలేస్తున్నారు
నెల్లూరు వాసికి చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీ గుడ్లను వారానికి ఒకసారి సరఫరా చేస్తుంది. ఎండాకాలం కావడంతో గుడ్లు నిల్వ ఉండటం లేదని, పాడవుతున్నాయని హెచ్ఎంలు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఉమ్మడి జిల్లాలో పరిధిలో సుమారు రూ.4.5 కోట్ల బిల్లులు చెల్లించాలి.
నీటిశుద్ధి ఏది
కర్నూలులో మొదటి విడత కింద 567 పాఠశాలల్లో రూ.24.47 కోట్లు, నంద్యాలలో 444 బడుల్లో 12.53 కోట్లు వెచ్చించి నాడు.. నేడు కింద నీటి శుద్ధి యంత్రాలు పెట్టారు. రెండో విడత కింద కర్నూలులో 714 బడుల్లో రూ.23.38 కోట్లు, నంద్యాలలో 672 పాఠశాలల్లో రూ.14.99 కోట్లు వెచ్చించారు. వాటి నిర్వహణ సక్రమంగా లేక మూలకు చేరాయి.
మధ్యాహ్నభోజనం అంతంతే
కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకు 1,641 మంది విద్యార్థులు చదువుతుండగా...1,260 మంది విద్యార్థులు మాత్రమే సోమవారం హాజరయ్యారు. ఇందులో 655 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తిన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మిగతా వారు ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తిన్నారు.
కార్మికుల గుండెల్లో ధరదడ
కూరగాయలు, గ్యాస్, కందిపప్పు, చింతపండు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా మధ్యాహ్న భోజనం ఛార్జీలను ప్రభుత్వం పెంచడం లేదు. 1-8 తరగతులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% వ్యయాన్ని భరిస్తున్నాయి. ప్రస్తుత మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి భోజనం అందించేందుకు రూ.20 ఇవ్వాలని వంట ఏజెన్సీలు డిమాండు చేస్తున్నాయి. సర్కారు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు.
టమాటా చారు తయారీలో... ఈ గుడ్లే విద్యార్థులకు ఇచ్చారు.
బనగానపల్లి గ్రామీణం: బనగానపల్లి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో దాదాపుగా 830 మంది విద్యార్థులకు గాను 763 మంది హాజరయ్యారు. దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఇళ్లకు వెళ్లి మధ్యాహ్నం భోజనం చేశారు.
ఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లె ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో కొందరికే గుడ్లు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలో 127 మందికి గానూ 46 మందికి, జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ 146 మందికి 135 మందికి మాత్రమే గుడ్లు ఇచ్చారు. గుడ్లు సరఫరాలో లోటు ఉందని చెబుతున్నారు.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వర జడ్పీ ఉన్నత పాఠశాలలో 1,080 మందికి గాను 434 మంది భోజనం చేశారు.
మంత్రాలయం గ్రామీణం: కౌతాళం మండలంలోని హాల్వి జడ్పీ ఉన్నత పాఠశాలలో హాజరైన 476 మందిలో 456 మంది మాత్రమే భోజనం తిన్నారు. మరో 20 మంది ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తిన్నారు.
కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ పాఠశాలలో మొత్తం 1004 మందికి 683 మంది హాజరయ్యారు. 240 మంది మాత్రమే భోజనం చేయగా, మిగిలిన వారు ఇళ్లకు వెళ్లి భోజనం చేశారు.
నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాలలో 414 మందికి గానూ 330 మంది భోజనం చేశారు. వారికి రోజువారీ ఖర్చు రూ.4,290 కాగా, నిర్వాహకులకు ప్రభుత్వం ఇస్తున్నది మాత్రం రూ.2,828 మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంతకుల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు
[ 29-04-2024]
వైకాపా హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. -
సైకోను శాశ్వతంగా ఇంటికి పంపాలి: చంద్రబాబు
[ 29-04-2024]
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో వేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
కూటమితోనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
[ 29-04-2024]
ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాలులోఉమ్మడి జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాల్లోని యువతతో కలిసి భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు. -
తెదేపాలోకి 80 కుటుంబాలు చేరిక
[ 29-04-2024]
నియోజకవర్గంలోని నందవరం మండలంలోని హాలహర్వికి గ్రామానికి చెందిన ఎనభై కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. -
వర్షాలు సమృద్ధిగా కురవాలని సప్తభజనలు
[ 29-04-2024]
మండలం కైరుప్పల గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఖరీఫ్, రబీ సీజన్లలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని సప్త భజనలు నిర్వహిస్తున్నారు. -
తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా
[ 29-04-2024]
పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెదేపా అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్రెడ్డి అన్నారు. -
గూడ్స్ బోగిలో మంటలు
[ 29-04-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి మండలం నేమకల్లు రైల్వే స్టేషన్లో ఆదివారం గూడ్స్ బోగిలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అగ్ని మాపక శాఖ వారికి సమాచారం అందించారు. -
జలం తీసుకొస్తాం.. జనాలను బాగు చేస్తాం
[ 29-04-2024]
పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది.. మంత్రాలయం నియోజకవర్గంలో వలసలు ఎక్కువ.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.. వలసలకు అడ్డుకట్ట వేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. -
వైకాపాలో రగడ
[ 29-04-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆదివారం వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక సగర (ఉప్పర) సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీరశైవ సంఘం ఛైర్మన్ రుద్రగౌడ్, పట్టణ బ్యాంకు ఛైర్మన్ యు.కె.రాజు తదితరులు హాజరయ్యారు. -
జగన్ పాలన.. కష్టాల‘పాలు’
[ 29-04-2024]
చంద్రబాబు ఆలోచన: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం.. ‘పాడి’ రంగాన్ని ప్రోత్సాహం ఇచ్చారు. రాష్ట్రంలోనే ఎక్కడ లేనివిధంగా కల్లూరు మండలం తడకనపల్లెలో పశు వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. -
పశ్చిమాన వలస విలాపం
[ 29-04-2024]
పశ్చిమాన పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. వలస వెళ్తున్న ప్రజలను చూసి. ఇళ్లకేసిన తలుపులు, తాళాలు ప్రశ్నిస్తున్నాయి.. మళ్లీ ఎప్పుడు తీస్తారని. ఇంటికి కాపలా ఉన్న పెద్దలు ఎదురు చూస్తున్నారు.. అయినవాళ్లు ఎప్పుడు తిరిగొస్తారని. -
విలీనం చేసి.. జగన్ నిలువునా ముంచి
[ 29-04-2024]
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి. -
జగన్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
[ 29-04-2024]
ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పోలవరం కట్టలేదని, రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయకుండా మాట తప్పారని, మరోసారి మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. -
అరాచక పాలనకు అంతం తప్పదు
[ 29-04-2024]
రాష్ట్రంలో అరాచక పాలనకు త్వరలోనే అంతం తప్పదని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెన్నంశెట్టిపల్లెలో తెదేపా నేత వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
నెరవేరని మాటలు.. అవస్థల పాఠాలు
[ 29-04-2024]
విద్యార్థులు చదువుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పలు ప్రసంగాల్లో ఊదరగొడుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పొంతన ఉండటం లేదు. -
వైకాపాను నమ్మి మళ్లీ మోసపోవద్దు
[ 29-04-2024]
ఆదోని పట్టణంలోని శివశంకర్నగర్లో భాజపా అభ్యర్థి డా.పార్థసారథి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట తెదేపా సీనియర్ నాయకులు భూపాల్చౌదరి, తెదేపా మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశం
[ 29-04-2024]
ఆర్థికమంత్రి బుగ్గన నామినేషన్ బందోబస్తుకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణకు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 22న బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్కు ఆవుకు పోలీస్స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు బందోబస్తు నిమిత్తం డోన్కు వచ్చారు. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెబుదాం: బీసీ
[ 29-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధిచెప్పి ఇంటికి పంపిద్దామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పెండేకంటి నగర్, శివనందినగర్లో ‘ప్రజాగళం’లో భాగంగా రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖరరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. -
కల్తీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారులను ఓడించాలి
[ 29-04-2024]
నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.