logo

వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం

వైకాపా ప్రభుత్వం మరోసారి వచ్చిందంటే అరాచక పాలనే ఉంటుందని కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు.

Published : 28 Apr 2024 02:42 IST

కరపత్రం అందజేస్తున్న టీజీ భరత్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం మరోసారి వచ్చిందంటే అరాచక పాలనే ఉంటుందని కర్నూలు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్‌ అన్నారు. జొహరాపురంలోని మాలగేరిలో శనివారం భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు విన్నవించారు. రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెదేపా నగర అధ్యక్షుడు నాగరాజుయాదవ్‌, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు రమణ, నారాయణ, నేతలు మోహన్‌, మాధవస్వామి, తిమ్మోజి, శ్రీనివాసగౌడ్‌, వెంకటేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు