భాజపా అభ్యర్థులు వీరే
భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు మూడో జాబితా విడుదల చేసింది.
భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు మూడో జాబితా విడుదల చేసింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. కమలదళం కదనరంగంలోకి దూకుతోంది. ప్రకటించిన అభ్యర్థుల నేపథ్యం, వారి వ్యక్తి‘గతం’ గురించి తెలుసుకుందాం.
న్యూస్టుడే, నారాయణపేట, ఆత్మకూరు, అచ్చంపేట న్యూటౌన్, వనపర్తి న్యూటౌన్, గండీడ్, జడ్చర్ల గ్రామీణం
నియోజకవర్గం : జడ్చర్ల
పేరు : జె.చిత్తరంజన్దాస్
పుట్టిన తేదీ : 19.06.1951
చదువు : డిగ్రీ (బీకాం)
వృత్తి : వ్యవసాయం
కుటుంబ నేపథ్యం : తల్లిదండ్రులు నారాయణమ్మ, నరసింహదాస్(న్యాయవాది), భార్య నీరజ, ముగ్గురు కుమార్తెలు ప్రశాంతి, స్వాతిదాస్, శ్వేతాదాస్ ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం ఎలికట్టలో నివాసం.
రాజకీయ ప్రవేశం : చిత్తరంజన్దాస్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1986లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1987-1999 మధ్య పీసీసీ సభ్యుడిగా, 1955-1998 మధ్య పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1985లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీచేసిన తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను చిత్తరంజన్దాస్ ఓడించి సంచలనం సృష్టించారు. 1989-1992 మధ్య కాలంలో మర్రి చెన్నారెడ్డి కేటినెట్లో కార్మిక, ఉపాధి కల్పన, టూరిజం, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2004-2019 వరకు పీసీసీ ఓబీసీ సెల్ ఛైర్మన్గా ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. 2018లో తెరాస(భారాస)లో చేరారు. 2023లో ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు.
నియోజకవర్గం: నారాయణపేట
పేరు : కొత్తకాపు రతంగ్ పాండురెడ్డి
పుట్టినతేదీ : 1965 ఆగస్టు 25
చదువు : ఇంటర్మీడియట్
వృత్తి : వ్యవసాయం
రాజకీయ ప్రవేశం : 1989 నుంచి 1993 నారాయణపేట మండలం సింగారం సర్పంచి
కుటుంబ నేపథ్యం : భార్య రత్నమాల, కుమారుడు డా.రాజేశ్రెడ్డి,, కూతురు డాక్టర్ శ్వేత
అనుభవం : 1993 నుంచి 1995 వరకు భాజపా మండల ప్రధాన కార్యదర్శిగా, 1995 నుంచి 2000 వరకు పేట మండల పరిషత్తు అధ్యక్షుడిగా, 2000 నుంచి 2003వరకు భాజపా మండలశాఖ అధ్యక్షుడిగా, అనంతరం 2006లో భాజపా జిల్లా ప్రధానకార్యదర్శిగా, 2010 నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా భాజపా అధ్యక్షుడిగా, రాష్ట్రకార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 2022లో సాగు, తాగునీటి కోసం పాదయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా జైలుకు వెళ్లారు. 2014లో భాజపా, తెదేపా ఉమ్మడి పోటీ నేపథ్యంలో టిక్కెట్టు రాక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 23,238 ఓట్లు సాధించారు. 2018 ఎన్నికల్లోనూ భాజపా అభ్యర్థిగా మరోమారు పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో రెండోసారి భాజపా అభ్యర్థిగా పోటీపడుతున్నారు.
నియోజకవర్గం: అచ్చంపేట
పేరు : దేవని సతీశ్ మాదిగ
విద్యాభ్యాసం : బి.ఎ.
తల్లిదండ్రులు : శేషమ్మ, కిష్టయ్య
భార్య : సుగుణకళ
సంతానం : కుమారుడు సూరజ్ బాబు, కుమార్తె సస్య
పుట్టిన తేది : 10.08.1969
స్వస్థలం : చుక్కాయపల్లి, కొల్లాపూర్ మండలం
వృత్తి : వ్యాపారం, రాజకీయం
రాజకీయ ప్రవేశం : 1996లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో విద్యార్థి నేతగా, 2002 నుంచి 2009 వరకు ప్రస్తుత సీఎం కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓటమి.2010 నుంచి 2017 వరకు తెదేపా, 2017లో కాంగ్రెస్లో చేరి రాష్ట్ర అధికారి ప్రతినిధిగా పని చేశారు.2022లో భాజపాలో చేరి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
నియోజకవర్గం: వనపర్తి
పేరు : ఇట్టా అశ్వత్థామరెడ్డి
పుట్టిన తేదీ : 13.10.1965
చదువు : ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేశారు.
కుటుంబం : భార్య అరుణ, కుమారుడు విరాజిత్రెడ్డి (ఆస్రేలియా), కుమార్తె భవ్యశ్రీరెడ్డి (సాఫ్ట్వేర్ ఇంజినీరు)
వృత్తి : ఆర్టీసీ డ్రైవరు. 2021లో ఉద్యోగానికి రాజీనామా. ఎన్ఎంయూ నుంచి బయటకు వచ్చి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
రాజకీయరంగ ప్రవేశం : 2021లో భారతీయ జనతా పార్టీలో చేరారు.
నియోజకవర్గం: మక్తల్
పేరు : మాదిరెడ్డి జలంధర్ రెడ్డి
పుట్టిన తేదీ : 30.10.1964
తల్లిదండ్రులు : మాదిరెడ్డి శివారెడ్డి, పార్వతమ్మ
విద్యాభ్యాసం : బీకాం
కుటుంబం : భార్య పద్మజ, కుమారుడు రిగ్వేద్రెడ్డి, కూతురు నిశిక
సొంత గ్రామం : నర్వ
రాయకీయ నేపథ్యం : తండ్రి శివారెడ్డి ఆత్మకూరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్. జలంధర్రెడ్డి యువకుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గుర్తింపు. అమరచింత నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. అనంతరం భాజపాలో చేరారు. ప్రస్తుతం ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
నియోజకవర్గం : పరిగి
పేరు : మారుతి కిరణ్ భూనేటి
పుట్టినతేదీ : 02-03-1979
విద్యార్హత : బీటెక్, ఎంబీఏ
కుటుంబ నేపథ్యం : తల్లిదండ్రులు వినోదిని, సాయిలు, భార్య అర్చన, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
వృత్తి : వ్యాపారం, ప్రకృతి వ్యవసాయం
అనుభవం : శంషాబాద్ సమీపంలోని గొల్లపల్లి స్వస్థలం. 1990లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై పనిచేశారు. ప్రస్తుతం భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భాజపా అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు వేసవి చదువుల పండుగ
[ 29-04-2024]
విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా.. వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి చదువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఫౌండేషన్ మండల సమన్వయకర్త హన్మిరెడ్డి అన్నారు. -
వైభవంగా కలశ స్థాపన మహోత్సవం
[ 29-04-2024]
తుంగభద్ర నదిలో నీరు పూర్తిగా తగ్గడంతో బయటకు తేలిన రాజోలి శివారులోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో కలశ స్థాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 29-04-2024]
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ఉండవల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్పై జరిగింది. -
ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
[ 29-04-2024]
నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ప్రచండ ఎండ!
[ 29-04-2024]
పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. -
వలస ఓటర్లపై ఆశలు!
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం
[ 29-04-2024]
వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. -
దుందుభి.. దుఃఖిస్తోంది!
[ 29-04-2024]
దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం
[ 29-04-2024]
మహబూబ్నగర్ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్రెడ్డి, రాజ్మల్లేశ్ వెల్లడించారు. -
ఈవీఎంల వయసు 35 ఏళ్లు
[ 29-04-2024]
ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. -
ఐదేళ్లకు ఓ పూట
[ 29-04-2024]
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... -
భారాస, భాజపా మాటలు నమ్మొద్దు : మంత్రి జూపల్లి
[ 29-04-2024]
భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
దోచుకున్న సొమ్ముతో దుబాయ్లో పెట్టుబడులు : వంశీచంద్రెడ్డి
[ 29-04-2024]
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. -
ముగిసిన శిర్సనగండ్ల రాములోరి బ్రహ్మోత్సవాలు
[ 29-04-2024]
రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి. -
అలంపూర్ బేనీషా.. ప్రియం
[ 29-04-2024]
ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది. -
ఎలుకా కొరకకే!
[ 29-04-2024]
నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. -
అందని ద్రాక్షగా.. టీ ఫైబర్ సేవలు
[ 29-04-2024]
గ్రామాలకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్ సేవలు అందనిద్రాక్షగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్