మున్సిపల్ సమావేశానికి నిరసన సెగ
పురపాలక సమావేశం వేదికగా భారాస నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఛైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు.
కంటతడి పెట్టిన అధ్యక్షురాలు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ
పురపాలక సమావేశం వేదికగా భారాస నాయకుల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఛైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. రూ.88.19 కోట్లతో సిద్ధం చేసిన మున్సిపల్ బడ్జెట్ను ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు. అధ్యక్షురాలిపై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన భారాస అసంతృప్త కౌన్సిలర్లు నల్ల మాస్కు ధరించి నిరసన తెలిపారు. అనంతరం సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లి నిరసన కొనసాగించారు.
సమస్యలపై నిలదీత
పట్టణంలోని పలు సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. పారిశుద్ధ్య పర్యవేక్షకులు సైదులు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. ఇదంతా అవాస్తమని సైదులు వివరణ ఇచ్చారు. మద్యం తాగి విధులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ చంద్రశేఖర్ సర్ది చెప్పారు. విధులు నిర్వహించకుండా వేతనాలు తీసుకుంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కొందరు సభ్యులు ప్రశ్నించారు. తాను ఉద్యోగుల అటెండెన్స్ పరిశీలిస్తున్నానని, విధులకు రాకుండా ఎవరైనా వేతనాలు తీసుకుంటే తొలగిస్తామని కమిషనర్ తెలిపారు. డంప్యార్డులో ఓ ఉద్యోగికి రూ.50 వేలు ఇచ్చినట్లు కౌన్సిల్ వాట్సాప్ గ్రూప్లో వచ్చిందని కౌన్సిలర్లు అడగగా, వారిని పిలిపించి మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పట్టణంలో అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరారు. కొన్ని చోట్ల పురపాలక సంఘం నుంచి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు రావడం లేదని కౌన్సిలర్ శ్రీకాంత్ అన్నారు. హెచ్ఎండీఏకు లేఖ రాస్తానని కమిషనర్ చెప్పారు.
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన: తనపై కొందరు కౌన్సిలర్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సమావేశం ముగిసిన తరువాత అధ్యక్షురాలు విజయలక్ష్మీ కంటతడి పెట్టారు. తమ బంధువుల్లో ఆరుగురు పేదలు ఉండటంతోనే వారికి పురపాలక సంఘంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకున్నామని తెలిపారు. మూడు సార్లు అధ్యక్షురాలిగా పని చేశానని, ఇప్పటి వరకు తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. కౌన్సిలర్ల వాట్సాప్ గ్రూపులో తనపై కొందరు కౌన్సిలర్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలకు సమాయత్తం
[ 05-05-2024]
బరిలో నిలిచే అభ్యర్థులు తేలిపోవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలు ఆయా జిల్లాలకు చేరుకోగా, అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 05-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. ఒక్కోచోట ఒక్కో సమస్య ప్రభావితం చేస్తుంది. -
హ్యాట్రిక్ విజయం ఖాయం: హరీశ్రావు
[ 05-05-2024]
అబద్ధపు పునాదుల మీద స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, భాజపాలకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. -
ఎన్డీయేతోనే సుపరిపాలన: తమిళిసై
[ 05-05-2024]
దేశం అభివృద్ధి చెందాలన్న.. సురక్షితంగా ఉండాలన్నా... సుపరిపాలన కోసం, పేదరికాన్ని నిర్మూలించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై అన్నారు. -
దేవుళ్లతో రాజకీయం చేయడం సరికాదు
[ 05-05-2024]
దేవుళ్లతో భాజపా రాజకీయం చేయడం సరికాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం రాత్రి మెదక్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
పూత రాలి.. తెగుళ్లు పెరిగి
[ 05-05-2024]
మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది. -
సంతోషాల సవ్వడి.. ఐదు వసంతాల ఒరవడి
[ 05-05-2024]
‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడో కవి. జీవితం సాఫీగా.. -
రెండో పెళ్లి వ్యామోహంతో భార్య హత్య
[ 05-05-2024]
తన కుమార్తెను హత్య చేసి కాగ్నా నదిలో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ, హతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి శనివారం హత్యోందంతాన్ని ఛేదించారు. -
వాడిన విరులూ.. ఆదాయపు సిరులే
[ 05-05-2024]
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితం ఖాయం. ఈ కోవకే చెందుతారు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామానికి చెందిన మహిళలు. -
‘కుబేరులను పోషించిన మోదీ ప్రభుత్వం’
[ 05-05-2024]
పదేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కుబేరులను పెంచి పోషిస్తూ పేదలపై ఆర్థిక భారాన్ని మోపిందని ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర ఛైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ అన్నారు. -
మన భవితను నిర్ణయిస్తుంది
[ 05-05-2024]
మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించినది. మన భవితను నిర్ణయిస్తుంది. నోటు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగొద్దు. లేదంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఓటు విషయంలో కులం, మతం, బంధుప్రీతిని అనుసరించొద్దు. -
గ్రామీణులపైనే ఆశలు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మద్దతు కూడగట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. -
హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి సురేఖ
[ 05-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శనివారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
మతం బలహీనత కావొద్దు: మంత్రి
[ 05-05-2024]
మతం బలహీనత కారాదని, అది సమాజంలో అసమానతలు, అసహనాన్ని పెంచేలా ఉండొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
సాంకేతికత వినియోగం పారదర్శకతకు దోహదం
[ 05-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఇవి పారదర్శకంగా జరగాలి. ఓటు హక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలి. -
గజ్వేల్లో 25 వేల ఓట్ల ఆధిక్యం తేవాలి: జగ్గారెడ్డి
[ 05-05-2024]
రాహుల్గాంధీని ప్రధానిని చేయటమే లక్ష్యంగా మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును భారీ ఓట్ల ఆధిక్యంతో గెలిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఎట్టకేలకు కేజీబీవీ నిర్మాణం ప్రారంభం
[ 05-05-2024]
ఎట్టకేలకు అక్కన్నపేట కేజీబీవీ భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితం వివిధ కారణాలతో అర్దంతరంగా ఆగిపోయాయి.