మరణించి ఎనిమిది మందికి ఊపిరిపోసింది
ఓ మహిళ మరణించి ఎనిమిది మందికి అవయవ దానం చేసిన ఘటన చిట్యాల మండలంలోని వెలిమినేడులో ఆదివారం చోటు చేసుకుంది... ఆ గ్రామానికి చెందిన అశ్విని(25), రెండు ఏళ్ల క్రితం శ్రీనుతో వివాహం చేశారు.
చిట్యాల గ్రామీణం, న్యూస్టుడే: ఓ మహిళ మరణించి ఎనిమిది మందికి అవయవ దానం చేసిన ఘటన చిట్యాల మండలంలోని వెలిమినేడులో ఆదివారం చోటు చేసుకుంది... ఆ గ్రామానికి చెందిన అశ్విని(25), రెండు ఏళ్ల క్రితం శ్రీనుతో వివాహం చేశారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వలిగొండ మండలంలోని వేములకొండకు పాపకు తలనీలాలు తీసేందుకు భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. ఆ వాహనం ప్రమాదవశాత్తు కింద పడింది. ఆమె తలకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆమె అవయవాలను వైద్యులు సేకరించి ఎనిమిది మందికి అమర్చారు. మృతురాలు అంత్యక్రియలను వెలిమినేడులో నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ ప్రకటనలు, వార్తలను నిశితంగా పరిశీలించాలి
[ 06-05-2024]
ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు, (పెయిడ్ న్యూస్) చెల్లింపు వార్తలను నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే సూచించారు. -
ఓటరు అవగాహన కార్యక్రమం
[ 06-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యం కోసం స్వీప్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
ఎంపీలకు ఎన్ని సౌకర్యాలో..!
[ 06-05-2024]
ఒకసారి ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తే ప్రభుత్వ పరంగా జీతభత్యాలతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తారు. అలాంటి సీటులో కూర్చునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. -
నడ్డా సభకు వేళాయె..!
[ 06-05-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న భాజపా.. రెండు లోక్సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. -
స్వేచ్ఛగా ఓటు వేసేలా..!
[ 06-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఆయా వసతులను ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు అనువుగా తీర్చేదిద్దేందుకు అధికారులు మరోసారి ఏర్పాట్లు చేపడుతున్నారు. -
గతమంతా ఘనం.. ఇప్పుడంతా ధనం
[ 06-05-2024]
ప్రధాన పార్టీలు నిర్వహించే ర్యాలీలు, కూడళ్ల సమావేశాలకు జనం తరలింపు పెద్ద తలనొప్పిగా మారుతోంది. నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో కూడళ్ల జాతరకు జనం స్వచ్ఛందంగా రావాలంటే కష్టమే. భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల పరిస్థితి ఇదే. -
ప్లాస్టిక్ ముప్పు.. ఎవరిదీ తప్పు..!
[ 06-05-2024]
పురపాలికల్లో పాలిథిన్ నిషేధం ప్రచారానికే పరిమితం అయింది. అటవీ, పర్యావరణ పరిరక్షణ చట్టం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఉత్తర్వుల ప్రకారం 50 మైక్రాన్లు మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్ సంచులను వాడొద్దు. -
వ్యర్థాలకు నిప్పు.. భూసారానికి ముప్పు
[ 06-05-2024]
యాసంగి సీజన్ పూర్తి అయిన నేపథ్యంలో రైతులు తమ పొలాలను యంత్రాలతో కోసిన తరువాత మిగిలిన వరికొయ్యలను తగులబెడుతున్న తీరుతో.. ఓ వైపు భూమిలోని పోషకాలు కరిగిపోవటంతో పాటు.. మరోవైపు వాతావరణంలో కాలుష్యానికి కారణమై తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం నెలకొంది. -
ఆర్టీసీ బస్టాండ్లు.. చోరీలకు అడ్డాలు!
[ 06-05-2024]
మిర్యాలగూడ పట్టణం చింతపల్లి కాలనీకి చెందిన ఓ మహిళ తన బంగారాన్ని బ్యాగులో వేసుకుని ఊరికి వెళ్లేందుకు స్థానిక బస్టాండ్లోని నల్గొండ ప్లాట్ఫాం వద్ద ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బస్సెక్కింది. -
కృష్ణా జలాల వాటాపై పోరాటం
[ 06-05-2024]
‘బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం కృష్ణాలో రావాల్సిన నీటి వాటా కోసం పోరాడుతా. సాగర్ ప్రాజెక్టులో 130 టీఎంసీల నీరున్నా రైతులకు సాగునీళ్లు ఇవ్వలేదు. మా హయాంలో ఉమ్మడి జిల్లాలో 11.5 లక్షల ఎకరాల్లో వరి సాగయితే.. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 06-05-2024]
కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
[ 06-05-2024]
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని దుప్పల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుప్పల్లి గ్రామానికి చెందిన గాదగోని రోశయ్య (45) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. -
ఎన్ఆర్ఐలతో జానారెడ్డి ఇష్టాగోష్ఠి
[ 06-05-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ఎన్ఆర్ఐలను కోరారు. ఆదివారం ఆయన సాగర్లోని తన నివాసగృహం నుంచి జూమ్ యాప్ ద్వారా ఎన్ఆర్ఐలతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. -
జనన, మరణ ధ్రువపత్రాల జారీ సులువే
[ 06-05-2024]
జనన, మరణ ధ్రువపత్రాల కోసం పట్టణవాసుల ఇక్కట్లు దూరమయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే అందించేలా గతంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తోంది. -
యాదాద్రిలో భక్తుల మొక్కు పూజలు
[ 06-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సెలవు రోజు కావడంతో క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగి.. దర్శనం కోసం సుమారు రెండు గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
కేసీఆర్ పథకాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి
[ 06-05-2024]
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన పథకాన్ని కొనసాగిస్తున్నారు.. తప్పా కొత్తగా రైతులకు ఒరగబెట్టిందేమి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
పోలింగ్ ఏర్పాట్లలో యంత్రాంగం
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్నకు ఇంకా ఎనిమిది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఎన్నికల సామగ్రి, ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలింపు ప్రక్రియ పూర్తయింది. -
గాలి, వాన బీభత్సం
[ 06-05-2024]
జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పలుచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. మోత్కూరు, కొండగడప, జామచెట్లబావి వద్ద పలువురి రేకుల ఇళ్ల పైకప్పులు లేచి పోయాయి. -
ఎమ్మెల్యే గారు.. మరమ్మతులు చేయించరూ!
[ 06-05-2024]
ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలతో సతమతమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం కళాశాలకు సొంత భవనం నిర్మించగా ప్రస్తుతం పూర్తిగా శిథిలమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!