కాల్వలో కలసిపోతున్న ప్రాణాలు
జిల్లావాసుల తాగు, సాగునీటి కష్టాలు తీర్చుతున్న ఏఎమ్మార్ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు జలాశయాలు, కాల్వలు ఏళ్ల తరబడి నిర్వహణకు నోచుకోకపోవడంతో అడుగడుగునా ప్రమాదాలకు నెలవయ్యాయి. అనుసంధానకాల్వలో, అక్కంపల్లి జలాశయం, పుట్టంగండి జలాశయాల్లో పలువురు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. జిల్లాలో జలప్రమాదాలకు ఈ ప్రాజెక్టు కాల్వలే కారణమవుతున్నాయ
పెద్దఅడిశర్లపల్లి, న్యూస్టుడే: జిల్లావాసుల తాగు, సాగునీటి కష్టాలు తీర్చుతున్న ఏఎమ్మార్ ప్రాజెక్టుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు జలాశయాలు, కాల్వలు ఏళ్ల తరబడి నిర్వహణకు నోచుకోకపోవడంతో అడుగడుగునా ప్రమాదాలకు నెలవయ్యాయి. అనుసంధానకాల్వలో, అక్కంపల్లి జలాశయం, పుట్టంగండి జలాశయాల్లో పలువురు అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. జిల్లాలో జలప్రమాదాలకు ఈ ప్రాజెక్టు కాల్వలే కారణమవుతున్నాయని అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా సమస్యల పరిష్కారానికి కన్నెత్తి చూడడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హామీలివ్వడం ఆ తర్వాత ఆయా హామీలు నీటిమీద రాతలుగానే మిగులుతుండడంతో ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది.
బాధిత కుటుంబాల్లో తీరని విషాదం
పుట్టంగండి జలాశయం నుంచి అక్కంపల్లి జలాశయం వరకు అనుసంధాన కాల్వలో మూడేళ్ల క్రితం 2018 ఏప్రిల్ 6న పడమటితండా సమీపంలో కూలీల ట్రాక్టర్ బోల్తా పడి 10 మంది కూలీలు జలసమాధైన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరో ఏడాదిన్నర తర్వాత 2020లో వడ్డెరిగూడేనికి చెందిన ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా అనుసంధాన కాల్వలో పడి దంపతులతోపాటు యువతి మృతిచెందారు. తాజాగా బుధవారం నాంపల్లి మండలం నెమిళ్లగూడెంకు చెందిన ఇరు కుటుంబాలకు చెందిన ఆరుగురు ఇన్ఫాల్రెగ్యులేటర్ల వద్ద కాల్వలో పడి నలుగురు బయటపడి ఇద్దరు యువకులు మృతిచెందారు. వీటితో పాటు జలాశయాల్లో చేపల వేటకు వచ్చి ఈత రాక ప్రమాదవశాత్తు ఇరవై మందికి పైగా అసవులుబాయగా.. పలు బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో కూరుకుపోయాయి.
నోచుకోని రక్షణ గోడ
పుట్టంగండి నుంచి అక్కంపల్లి జలాశయం వరకు 9.260 కిలోమీటర్లు విస్తరించిన ఈ అనుసంధాన కాల్వ సమీపంలో వద్దిపట్ల, పలుగుతండా, వడ్డెరిగూడెం, దుగ్యాల, తిర్మలగిరి, మదారిగూడేనికి చెందిన వందల సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. పడమటితండా సమీపంలో ట్రాక్టర్ ప్రమాదం సమయంలో మంత్రి, కలెక్టర్ పడమటితండా వద్ద రక్షణగోడ నిర్మించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. సదరు హమీకి నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రూ.కోట్లు వెచ్చించి రక్షణ గోడ, లైనింగ్ చేపడుతామని చివరికి రూ.10 లక్షలు వెచ్చించి కిలోమీటరు దూరం తాత్కాలిక ఫెన్సింగ్ మాత్రమే ఏర్పాటు చేశారు. అది కాస్త నాణ్యత లేక ఏర్పాటు చేసిన ఏడాదికే కూలి శిథిలమై పూర్వపు పరిస్థితి నెలకొంది. జంటనగరాల తాగునీటి అవసరాల రీత్యా నిత్యం నీటి సరఫరా చేసే ఈ కాల్వ.. పడమటి తండా వద్ద భారీగా కోతకు గురై ప్రమాదకరంగా మారింది.
కనిపించని హెచ్చరిక బోర్డులు
ప్రాజెక్టు కాల్వలు ప్రమాదాలకు నిలయంగా మారినా జలాశయాలు, కాల్వలవద్ద ప్రమాదహెచ్చరిక బోర్డులు ఏక్కడా కనిపించవు. పడమటితండా సమీపంలో మూడు, నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక బోర్డులు ప్రస్తుతం కనిపించడం లేదు. ప్రాజెక్టు పరిధిలో ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులతో పాటు జనసంచారం అధికంగా ఉండే ప్రదేశంలో ఇనుప రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తే కొంత వరకు ప్రమాదాలు నిర్మూలించిన వారవుతారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
తగిన చర్యలకు కసరత్తు
- జగన్మోహన్రెడ్డి, ఈఈ డివిజన్-4, అంగడిపేట స్టేజీ
అనుసంధాన కాల్వలో పడమటితండా వద్ద 700 మీటర్ల రక్షణగోడకు రూ.4.995 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపించాం. దీనితో పాటు మిగిలిన కాల్వ పరిధిలో ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి రక్షణ గోడల నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తాం. పడమటితండావద్ద రక్షణగోడకు త్వరలో టెండర్లు నిర్వహించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయిస్తాం.
హమీకే పరిమితమైంది
- రమావత్ హరి, పడమటితండా
మా తండావద్ద కాల్వలో ట్రాక్టర్ ప్రమాదంలో పది మంది మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన నాయకులు, అధికారులు రక్షణ గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు సమీపిస్తున్నా ఇప్పటికీ గోడ నిర్మించలేదు. కేవలం తాత్కాలికంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అదికూడా పూర్తిగా శిథిలమై కూలిపోతోంది. పుట్టంగండి నుంచి కాల్వ ఎక్కడ చూసినాపెద్దగా కోతకుగురై ప్రమాదకరంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి వేడి..దొరకని నాడి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. -
మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
[ 05-05-2024]
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
[ 05-05-2024]
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. -
చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
[ 05-05-2024]
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు -
ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
[ 05-05-2024]
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. -
ఆయకట్టులో ఆగని చోరీలు
[ 05-05-2024]
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
భానుడి ప్రతాపం.. బాతులకు తాపం
[ 05-05-2024]
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. -
నేనేంటీ.. నాకింత విలువేంటి..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. -
నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
[ 05-05-2024]
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. -
6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. -
కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్
[ 05-05-2024]
జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. -
రూ.2తో ఓటు సవాల్
[ 05-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం
[ 05-05-2024]
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.