నాటకాలు అలరించె.. ఆహుతులను మెప్పించె
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం సంయుక్త నిర్వహించిన జాతీయస్థాయి నాటక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి.
ముగిసిన జాతీయస్థాయి నాటకపోటీలు
పద్యనాటక పోటీల్లో జాతీయ స్థాయి ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైన కర్నూలు జిల్లా టీజీవీ కళాక్షేత్రం వారి ‘ శ్రీ కృష్ణ కమలపాలిక’ నాటక విజేతలకు బహుమతి అందజేస్తున్నఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం సంయుక్త నిర్వహించిన జాతీయస్థాయి నాటక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటక పోటీల్లో విజేతలకు వేర్వేరుగా బహుమతులను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. నాటకాలు సజీవంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తాను ఇప్పటి వరకు నాటకాలు చూడలేదని, మొదటిసారి వీక్షించడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. నాటకాలు, కళల పరిరక్షణకు ఎంతో కృషిచేస్తున్న మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం ప్రతినిధుల్ని అభినందించారు. మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం అధ్యక్షుడు బోయినేపల్లి భుజంగరావు మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే మొదటిసారిగా జాతీయస్థాయి నాటకపోటీలను 11 రోజులపాటు నిర్వహించగలిగామన్నారు. చంద్రశేఖర్రావు, పులి కృష్ణమూర్తి, మామిడాల ఉపేందర్, విద్యారత్న, శ్రీనివాసశర్మ, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణశర్మ, పి.రామావతారం, చిల్లంచర్ల చంద్రశేఖర్, బాపనయ్య, బాబురావు, రాఘవయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పద్యనాటక పోటీల విజేతలు... ఉత్తమ ప్రదర్శన కనబర్చిన కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారు ‘ శ్రీకృష్ణ కమలపాలిక’ నాటికకు ( రూ.40వేలు నగదు) మొదటి బహుమతి పొందగా, కాకినాడ శ్రీ సీతారామాంజనేయ నాట్యమండలి ‘నర్తనశాల’ కు( రూ.30వేలు నగదు) ద్వితీయ బహుమతి లభించింది. హైదరాబాద్ మురళీకృష్ణ నాట్యమండలి వారి ‘ వసంతరాజీయం’( రూ.20వేలు నగదు) నాటిక తృతీయ బహుమతి సొంతం చేసుకుంది. వరంగల్ స్టార్ బ్రదర్స్ సాంస్కృతిక కళాపరిషత్ వారి ‘ విజయానిరుద్ధం’ నాటకం జ్యూరీ ప్రదర్శనగా ఎంపికయ్యింది. వీటితో పాటు 19 మంది నటీనటులకు వ్యక్తిగతంగా బహుమతులు అందజేశారు. ఉత్తమ సంగీతం, అలంకరణ, ఆహార్యం విభాగాల్లోనూ బహుమతులు అందించారు.
జాతీయస్థాయి సాంఘిక నాటక పోటీల విజేతలు ... జాతీయస్థాయి సాంఘిక నాటక విభాగంలో హైదరాబాద్ కర్టెన్కాల్ థియేటర్ వారి ‘పెట్రోమాక్స్ పంచాయతీ’ ప్రదర్శనకు మొదటి బహుమతి లభించగా ( రూ.20వేలు నగదు), హైదరాబాద్ సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్ వారి ‘థింక్’ నాటికకు ద్వితీయ బహుమతి(రూ.15వేలు నగదు), కరీంనగర్ చైతన్య కళాభారతి వారి ‘చీకటిపువ్వు’ (రూ.10వేలు నగదు) నాటికకు తృతీయ బహుమతి లభించింది. జ్యూరీ ప్రదర్శనగా కొప్పోలు పండు క్రియేషన్స్ వారి ‘పక్కింటి మొగుడు’ నాటకం ఎంపికయ్యింది. వీటితో పాటు వ్యక్తిగతంగా 19 మంది నటీనటులకు బహుమతులు అందజేశారు. ఉత్తమ సంగీతం, అలంకరణ, ఆహార్యం విభాగాల్లోనూ బహుమతుల్ని అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభ్యర్థి ముఖం చూపడాయె.. ఓటెవరికి వేద్దాం..!
[ 09-05-2024]
ఓ యాదన్న ఎటుబోతున్నవే.. రా.. ఈ రచ్చబండ కాడ కూర్చోని మంచి, చెడ్డలు మాట్లాడుకుందాం..! పిలిచాడు రామస్వామి గాడేందో మైక్ సప్పుడైతాంది. ఏందో.. ఏమిటో? చూసొద్దామని పోతున్నా బదులిచ్చిండు యాదయ్య. -
పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యం
[ 09-05-2024]
గతంలో ఎన్నడూ లేని విధంగా 200 ఓటర్లున్నా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఎండ వేడిమి నియంత్రణతో పాటూ ఓటేయడానికి వచ్చే ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోక్సభ పరిధిలోని 2,061 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. -
కురుక్షేత్రం ఓ పాఠమే
[ 09-05-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగలో వర్గాలుగా విడిపోయి.. ప్రత్యర్థులుగా మారడం, దశాబ్దాల వైరంతో రగిలిపోవటం చూస్తుంటాం. -
అగ్రనేతలొస్తున్నారు..!
[ 09-05-2024]
మరో రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. -
ఎల్లయ్య హత్య కేసులో కొత్త మలుపు
[ 09-05-2024]
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట మండల కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య హత్య కేసు బుధవారం మరో కొత్త మలుపు తిరిగింది. -
ఓటర్లకు ఆహ్వానం
[ 09-05-2024]
ఓ శుభకార్యానికి ఆహ్వానం వస్తే అందరం ఆ తేదీ గుర్తు పెట్టుకుని తప్పకుండా హాజరవుతాం. అలాంటిది ఏకంగా మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేసే, మన భవితను తీర్చిదిద్దే ఓటుకు రమ్మని ఓటరును ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారేమో..! -
ఈవీఎంల కేటాయింపు పూర్తి
[ 09-05-2024]
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నికకు 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,141 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయి. -
ఎంపీ నిధుల కేటాయింపు ఇలా..!
[ 09-05-2024]
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
పదమూడోసారి.. 2వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు
[ 09-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లతో పాటే పోలింగ్ కేంద్రాలు సైతం పెరుగుతూ వస్తున్నాయి. 1977 నుంచి 2019 వరకు లోక్సభకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా, త్వరలో 13వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. -
భాజపాని విమర్శిస్తే.. అవినీతిపరులా: జూలకంటి
[ 09-05-2024]
భాజపా, మోదీని విమర్శించే వారు.. అవినీతి పరులంటూ ముద్రలు వేస్తున్నారని, కానీ ఆ పార్టీకి చెందిన వారే అత్యంత అవినీతి పరులని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. -
నోటా.. వచ్చిందిలా
[ 09-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
ఐదేళ్లలో.. మూడు లక్షలు పెరిగె..!
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ- 2024 ప్రక్రియలో భాగంగా.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల తుది ఓటరు జాబితా ఇటీవలే విడుదలైంది. -
నీటికుంట.. తీర్చును తంటా!
[ 09-05-2024]
నీటి నిల్వ సాంద్రత పెరిగేలా ఉపాధి హామీ పథకంలో కమ్యూనిటీ ఫారం పాండ్స్ (నీటి కుంటలు) నిర్మాణం చేపడుతున్నారు. -
భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు
[ 09-05-2024]
కాంగ్రెస్ నాయకుడు, జనశక్తి మాజీ సభ్యుడు వడ్డె ఎల్లయ్య అంత్యక్రియలు పోలీసుల భారీ బందోబస్తు నడుమ సూర్యాపేట మండలం ఎల్కారం గ్రామంలో బుధవారం రాత్రి పూర్తిచేశారు. -
ఆరుబయట నిలిపితే.. అంతే
[ 09-05-2024]
ఈ చిత్రంలో ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మార్చి 28న కోదాడ పట్టణంలోని ఓ వైన్స్ దుకాణం ముందు రాత్రి సమయంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం మీద కాసేపు కూర్చొని, తర్వాత అతడి దగ్గర ఉన్న దొంగ కీ సాయంతో దాన్ని తీసుకుపోయాడు. -
ర్యాలీలో.. జాలీగా
[ 09-05-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు పేర్కొన్నారు.