విజ్ఞాన సంస్కారం.. కీర్తి పురస్కారం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన గ్రంథాలయకర్త అనుముల శ్రీనివాస్కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది.
చిట్యాల గ్రామీణం, న్యూస్టుడే: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన గ్రంథాలయకర్త అనుముల శ్రీనివాస్కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ఈనెల 21న నాంపల్లిలోని విశ్వవిద్యాయలంలో ప్రదానం చేయనున్నారు. అనుముల శ్రీనివాస్ చదువుకునే రోజుల్లో గ్రామంలో ఒక దినపత్రిక, మాస పత్రిక వచ్చేది. చదివే వారు ఎక్కువగా ఉండటంతో పత్రికలు దొరకడం కష్టంగా మారేది. గ్రంథాలయం లేని లోటును భవిష్యత్తు తరానికి రానివ్వొద్దని నిశ్చయించుకొని తన తోటి మిత్రులతో కలిసి సమష్టిగా స్వచ్ఛందంగా గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 14 ఏప్రిల్ 2006న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య చేతుల మీదుగా దీనిని ప్రారంభింపజేశారు. దీనిని వినియోగించుకుని సుమారు 30 మంది యువకులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇలా 18 సంవత్సరాలుగా విజ్ఞాన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లో ...
గుండ్రాంపల్లిలో గ్రంథాలయ ఏర్పాటు స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి, కడప, చిత్తూరు ప్రాంతాల్లో తనకున్న పరిచయాలతో యువకులలో చైతన్యం నింపి గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. పలు గ్రామాల్లో స్థానికుల సహకారంతో గ్రంథాలయాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రతి గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటే లక్ష్యం
- అనుముల శ్రీనివాస్, గ్రంథాలయ వ్యవస్థాపక ఛైర్మన్, గుండ్రాంపల్లి
కీర్తి పురస్కారానికి గ్రంథాలయకర్తగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నా తోటి స్నేహితులు, విద్యావంతులు, గ్రామస్థుల సహకారంతో మా స్వగ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేశాం. వట్టికోట ఆల్వారుస్వామి కలలుగన్న మిషన్ వట్టికోటతో ప్రతి గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటికే గుండ్రాంపల్లి గ్రంథాలయాన్ని స్ఫూర్తిగా చాలా చోట్ల గ్రంథాలయాలు ఏర్పాటు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎల్లయ్య హత్య కేసులో కొత్త మలుపు
[ 09-05-2024]
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట మండల కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య హత్య కేసు బుధవారం మరో కొత్త మలుపు తిరిగింది. -
అభ్యర్థి ముఖం చూపడాయె.. ఓటెవరికి వేద్దాం..!
[ 09-05-2024]
ఓ యాదన్న ఎటుబోతున్నవే.. రా.. ఈ రచ్చబండ కాడ కూర్చోని మంచి, చెడ్డలు మాట్లాడుకుందాం..! పిలిచాడు రామస్వామి గాడేందో మైక్ సప్పుడైతాంది. ఏందో.. ఏమిటో? చూసొద్దామని పోతున్నా బదులిచ్చిండు యాదయ్య. -
పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యం
[ 09-05-2024]
గతంలో ఎన్నడూ లేని విధంగా 200 ఓటర్లున్నా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఎండ వేడిమి నియంత్రణతో పాటూ ఓటేయడానికి వచ్చే ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోక్సభ పరిధిలోని 2,061 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. -
కురుక్షేత్రం ఓ పాఠమే
[ 09-05-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండగలో వర్గాలుగా విడిపోయి.. ప్రత్యర్థులుగా మారడం, దశాబ్దాల వైరంతో రగిలిపోవటం చూస్తుంటాం. -
అగ్రనేతలొస్తున్నారు..!
[ 09-05-2024]
మరో రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది.ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. -
ఓటర్లకు ఆహ్వానం
[ 09-05-2024]
ఓ శుభకార్యానికి ఆహ్వానం వస్తే అందరం ఆ తేదీ గుర్తు పెట్టుకుని తప్పకుండా హాజరవుతాం. అలాంటిది ఏకంగా మనదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేసే, మన భవితను తీర్చిదిద్దే ఓటుకు రమ్మని ఓటరును ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారేమో..! -
ఈవీఎంల కేటాయింపు పూర్తి
[ 09-05-2024]
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నికకు 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,141 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయి. -
ఎంపీ నిధుల కేటాయింపు ఇలా..!
[ 09-05-2024]
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్దంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
పదమూడోసారి.. 2వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు
[ 09-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లతో పాటే పోలింగ్ కేంద్రాలు సైతం పెరుగుతూ వస్తున్నాయి. 1977 నుంచి 2019 వరకు లోక్సభకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా, త్వరలో 13వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. -
భాజపాని విమర్శిస్తే.. అవినీతిపరులా: జూలకంటి
[ 09-05-2024]
భాజపా, మోదీని విమర్శించే వారు.. అవినీతి పరులంటూ ముద్రలు వేస్తున్నారని, కానీ ఆ పార్టీకి చెందిన వారే అత్యంత అవినీతి పరులని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. -
నోటా.. వచ్చిందిలా
[ 09-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
ఐదేళ్లలో.. మూడు లక్షలు పెరిగె..!
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ- 2024 ప్రక్రియలో భాగంగా.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల తుది ఓటరు జాబితా ఇటీవలే విడుదలైంది. -
నీటికుంట.. తీర్చును తంటా!
[ 09-05-2024]
నీటి నిల్వ సాంద్రత పెరిగేలా ఉపాధి హామీ పథకంలో కమ్యూనిటీ ఫారం పాండ్స్ (నీటి కుంటలు) నిర్మాణం చేపడుతున్నారు. -
భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు
[ 09-05-2024]
కాంగ్రెస్ నాయకుడు, జనశక్తి మాజీ సభ్యుడు వడ్డె ఎల్లయ్య అంత్యక్రియలు పోలీసుల భారీ బందోబస్తు నడుమ సూర్యాపేట మండలం ఎల్కారం గ్రామంలో బుధవారం రాత్రి పూర్తిచేశారు. -
ఆరుబయట నిలిపితే.. అంతే
[ 09-05-2024]
ఈ చిత్రంలో ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మార్చి 28న కోదాడ పట్టణంలోని ఓ వైన్స్ దుకాణం ముందు రాత్రి సమయంలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం మీద కాసేపు కూర్చొని, తర్వాత అతడి దగ్గర ఉన్న దొంగ కీ సాయంతో దాన్ని తీసుకుపోయాడు. -
ర్యాలీలో.. జాలీగా
[ 09-05-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
-
డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
-
21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్.. మోదీ, అంబానీ, అదానీ కీలక పాత్ర: సీఎన్ఎన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు: వైకాపా అభ్యర్థి సతీమణి వ్యాఖ్యలు
-
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్