logo

మహిళల పోరుబాట

మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో సభ్యులు రోడ్డెక్కారు.

Published : 02 Feb 2023 03:36 IST

మాచారెడ్డిలో భారీగా తరలొచ్చిన అతివలు

మాచారెడ్డి, న్యూస్‌టుడే: మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో సభ్యులు రోడ్డెక్కారు. మాచారెడ్డి మండలానికి చెందిన సుమారు 3 వేల మంది అతివలు బుధవారం గజ్యానాయక్‌తండా నుంచి మండల పరిషత్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాజపా కామారెడ్డి నియోజకవర్గ బాధ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..     గత మూడు రోజులుగా వేలాది మంది మహిళలు తమకు న్యాయంగా రావల్సిన నగదు కోసం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం విచారకరమన్నారు. కామారెడ్డి నియోజక వర్గంలోనే రూ.45 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. సభ్యుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే వరకు ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి,   మండలాధ్యక్షుడు నర్సింహాచారి, ప్రధాన కార్యదర్శి సురేశ్‌, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు తోట బాలరాజు, బీజేవైఎం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌చారి, నర్సింలు, రవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు